Saturday, March 1Thank you for visiting

Tag: Tollywood News

Tollywood News | సీఎంతో టాలీవుడ్ ప్ర‌ముఖుల భేటీ.. కీల‌కాంశాల‌పై చ‌ర్చ‌

Entertainment
Tollywood News Updates | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగు సినిమా పరిశ్రమ ప్రతినిధులు ఈ రోజు క‌లిశారు. ప‌లు అంశాల‌పై వీరి మ‌ధ్య సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాల మార్గాలు త‌దిత‌ర విష‌యాల‌పై స‌మాలోచ‌న చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి (35) అనే మ‌హిళ మృతి చెంద‌డం, ఆమె కుమారుడు శ్రీతేజ్ (Shirtej) తీవ్రంగా గాయపడం లాంటి సంఘటన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. సినీ ప‌రిశ్ర‌మ నుంచి పాల్గొన్నదెవ‌రంటే.. ముఖ్య‌మంత్రితో స‌మావేశ‌మైన సినీ ప్ర‌ముఖుల్లో అల్లు అరవింద్ (Allu Aravind), నాగార్జున, వెంకటేశ్‌, మురళి మోహన్, రాఘవేంద్రరావు, సి.క‌ల్యాణ్‌, బీవీఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, హరీశ్‌ శంకర్, కొరటాల శివ, బోయపాటి శ్రీను ఉన్నారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున డిప్యూట...

Allu Arjun | అల్లు అర్జున్ అరెస్టు.. అస‌లేం జరిగింది?

Entertainment
Allu Arjun : పుష్ప-2 సినిమా చూడ్డానికి వ‌చ్చి తొక్కిస‌లాట‌లో ఓ మ‌హిళ మృతి చెందిన కేసులో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ శుక్ర‌వారం అరెస్టు అయ్యారు. చిక్కడపల్లి పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే ముగ్గురిని అరెస్టు కాగా అల్లు అర్జున్‌ను కూడా కావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావ‌త్ భార‌తదేశంలో ఉన్న ఆయ‌న ఫ్యాన్స్ షాక్‌కు గుర‌య్యారు. స‌రైన ఏర్పాట్లు లేక‌పోవ‌డం వ‌ల్లే ఆ మ‌హిళ మృతి చెంద‌ని సంధ్యా థియేట‌ర్ య‌జ‌మానితోపాటు మేనేజర్‌ను, సరైన భద్రతా చర్యలు చేపట్టలేద‌ని సెక్యూరిటీ మేనేజర్‌ను ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేసిన‌ చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు. తాజాగా హీరో అల్లు అర్జున్‌ను కూడా అరెస్టు చేయ‌డం, ఆయన్ను సెంట్ర‌ల్ జైలుకు పంప‌డం సంచ‌న‌లం సృష్టించింది. పోలీసులు ఏమన్నారు? సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు చేప‌ట్టిన విచ...

Allu Arjun Remand | అల్లు అర్జున్‌కు బిగ్ షాక్, 14 రోజుల రిమాండ్

Entertainment
Allu Arjun Remand | పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊర‌ట ద‌క్క‌లేదు. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ వేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. 14 రోజులపాటు జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు బ‌న్నీని హైద‌రాబాద్‌ చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద ప్రీమియ‌ర్ షో స‌మ‌యంలో జ‌రిగిన‌ తొక్కిసలాటలో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెంద‌గా మ‌రో బాలుల‌డు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈఘ‌ట‌న‌కు సంబంధించి ఇదివ‌ర‌కే బ‌న్నీ తో స‌హా ప‌లువురిపై కేసులు న‌మోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఈరోజు మ‌ధ్యాహ్నం అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను గాంధీ హాస్పిట‌ల్ కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ త‌ర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా తనపై నమోదైన అన్ని కేసులను క్వాష్ చేయాల‌ని అల్లు అర్జున్ పిటిషన్ ...
Exit mobile version