Thursday, June 19Thank you for visiting

Tag: Tirupati Laddu

Mathura | మధుర, బృందావన్‌లోని ప్ర‌సాదాల‌పై అల‌ర్ట్‌.. నమూనాలను ల్యాబ్ కు త‌ర‌లింపు

Trending News
Mathura | తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం మధుర (Mathura Temple) , బృందావనం తదితర ప్రాంతాల్లోని ధార్మిక క్షేత్రాలకు సమీపంలోని 15 దుకాణాల నుంచి 43 ఆహార పదార్థాల నమూనాలను సేకరించింది. సేకరించిన ఆహార పదార్థాల్లో కల్తీ పదార్థాలను వాడుతున్నారనే అనుమానంతో లక్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి 'పేడా' (ఒక రకమైన స్వీట్) నమూనాను పరీక్షల నిమిత్తం పంపారు. ఎఫ్‌ఎస్‌డిఎ అసిస్టెంట్ కమిషనర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ సోమవారం మధుర, బృందావన్‌లలో నిర్వహించిన నమూనా ప్రచారంలో 15 మంది వ్యాపారుల‌ నుంచి మొత్తం 43 నమూనాలను సేకరించినట్లు తెలిపారు. మిఠాయిలు, పాలు, పనీర్, పెడా, బర్ఫీ, మిల్క్ కేక్, రసగుల్లా, సోన్‌పాప్డి, ఇతర స్వీట్లు మసాలా దినుసులతో తయారుచేసిన వ‌స్తువులను లాబ్ కు పంపించారు. వాటిలో 42 స్టాండర్డ్‌లో ఉన్నట్లు గుర్తించామని, అయితే 'పెడా' నమ...

Tirupati Laddu | తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం సీరియస్‌..

Andhrapradesh
Tirupati Laddu Row | కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై కేంద్రం సీరియ‌స్ అయింది. ఆల‌యానికి నెయ్యి సరఫరా చేసిన కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులు జారీ చేసింది. స‌ద‌రు కంపెనీ స‌ర‌ఫ‌రా చేసిన‌ నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫలం కావడంతో షోకాజ్‌ నోటీసులిచ్చింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను కేంద్రం సేకరించి ల్యాబ్‌కు పంపించ‌గా అందులో ఓ కంపెనీ నాణ్యత పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో కేంద్రం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. అయితే, తమిళనాడులో ఏఆర్‌ డెయిరీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్య‌వ‌హారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్‌...

Tirumala Laddu | దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం..

Andhrapradesh
Tirumala Laddu Controversy | క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం.. తిరుమల తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర‌స్వామి దేవ‌స్థానం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా హిందువుల్లో ఆధ్యాత్మిక భావ‌న క‌లుగుతుంది. అందులో తిరుమ‌ల లడ్డూ అనగానే అంద‌రికీ ఎంతో ప‌విత్ర‌మైన‌దిగా, ప్ర‌తీక‌ర‌మైన‌దిగా భావిస్తారు. అద్భుత‌మైన రుచికి ఈ లడ్డూకు ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. అయితే ఈ లడ్డూ తయారీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును ఉప‌యోగించార‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం సంచ‌ల‌నం గా మారింది. ఇదే ఇప్పుడు స‌ర్వ‌త్రా దుమారం రేపుతోంది. చంద్రబాబు వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ ఛైర్మన్లు కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. తిరుమల లడ్డూ తయారీలో కుటుంబంతో సహా ప్రమాణం చేసేందుకు సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు. కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యల్నిత‌ప్పుబ‌ట్టారు. విషప్రచారం చేస్తే స్వామి...

Tirupati Laddu : అయోధ్య రాముడి కోసం తిరుమల శ్రీనివాసుడి ప్రసాదాలు.. లక్ష లడ్డూలు సరఫరా..

Andhrapradesh
Tirupati Laddu : అయోధ్య బాలరాముడి కోసం తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాలు వెళుతున్నాయి. ధార్మిక కార్యక్రమాల్లో ముందుండే టీటీడీ.. అయోధ్య రామాలయం కోసం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపనోత్సవం సందర్భంగా.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూలను భక్తులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు వీవీఐపీలు హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. శుక్రవారం తిరుమలలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 22న అయోధ్యకు లక్ష శ్రీవారి లడ్డులు (Tirupati Laddu) పంపిస్తున్నామని తెలిపారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ, రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా ఇస్తారు. ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు ఉంటుంది. అయోధ్యలో జరిగే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రారం...
Exit mobile version