Saturday, March 1Thank you for visiting

Tag: Telugu news

TTD | టీటీడీలో అన్యమత ఉద్యోగులకు షాక్..

Andhrapradesh
TTD Employees Transferred : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అన్యమత ఉద్యోగులకు ఏపి ప్రభుత్వం షాకిచ్చింది. టీటీడీలో హిందూవేతర ఉద్యోగులపై పాలక మండలి బదిలీ వేటు వేసింది. ఇందులో భాగంగా 18 మంది ఉద్యోగులను అధికారులు ట్రాన్స్ ఫర్ చేశారు. కాగా టీటీడీలో మొత్తం 300 మంది అన్యమతస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ బదిలీ చేయాలని చాలా రోజులుగా భక్తుల నుంచి డిమాండ్ వస్తోంది . కాగా బదిలీ అయిన వారి (TTD Employees Transferred ) లో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, వివిధ విద్య సంస్థల్లోని లెక్చరర్లు, హాస్ట‌ల్ వార్డెన్, తదితరులు ఉన్నారు. త్వరలోనే మరికొంత మంది అన్యమత ఉద్యోగులను కూడా ట్రాన్స్ ఫ‌ర్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు డైరెక్ట్ క్యూలైన్‌లో వెళ్తున్నారు. స్వామ...

BJP District Presidents | తెలంగాణలోని 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు వీరే..!

Telangana
Telangana BJP District Presidents list | తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై బిజెపి ప్రత్యేకంగా ద్రుష్టి సారించింది .గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఎనిమిది సీట్లు గెలుచుకొని చరిత్ర తిరగరాసిన బీజేపీ.. రాబోయే ఎన్నికల వరకు అధికారమే లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకుంది. తాజాగా జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల ఎంపిక పై రాష్ట్ర బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేస్తూ.. అధికారికంగా వారి పేర్లను విడుదల చేసింది. Telangana BJP District Presidents list బిజెపి జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే.. హైదారాబాద్ సెంట్రల్ – దీపక్ రెడ్డి సికింద్రాబాద్- గుండుగోని భరత్ గౌడ్ మేడ్చల్ రూరల్ – శ్రీనివాస్ మెదక్ – రాధా మల్లెష్ గౌడ్ వరంగల్- గంట రవి హన్మకొం...

Caste Census Report : కులగణన సర్వే లెక్కలు తేలాయి.. తెలంగాణలో బీసీలు 46.25 శాతం , ముస్లింలు 12.56 శాతం

National
Caste Census Report details | రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కుల‌గ‌ణ‌న‌పై హైదరాబాద్‌లోని సచివాలయంలో కేబినెట్ సబ్‌ కమిటీ (Cabinet Sub-Committee) సమావేశం ఆదివారం జ‌రిగింది. మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశంలో కేబినెట్‌ సబ్‌ కమిటీకి కులగణన నివేదికను ప్లానింగ్‌ కమిషన్‌ అధికారులు అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో జరిగిన కుల గణన వివరాలు మీడియాకు వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్త‌గా 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని, 3.1 శాతం మంది కుల‌గ‌ణ‌న‌ సర్వేలో పాల్గొనలేదని తెలిపారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసమే సర్వే నిర్వ‌హించామ‌న్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 10 గంటలకు కేబినెట్‌ సమావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. అదేరోజు కేబినెట్ ముందుకు కులగణన సర్వే నివేదిక తీసుకువస్తామని తెలిపారు. తెలంగాణలోని ఇంటింటా 96.9 శాతం సర్వే (Caste Census Re...

Donald Trump : ఆ న‌ర‌కానికి ముగింపు ప‌లుకుతాం.. ! హ‌మాస్‌కు ట్రంప్‌ మాస్ వార్నింగ్‌..

World
Donald Trump : డోనాల్డ్ ట్రంప్ పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా తాను జనవరి 20న వైట్‌హౌస్‌లో బాధ్యతలు స్వీకరించేలోపు ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ బందీలను విడుదల చేయకుంటే ‘నరకం అంత‌మ‌వుతుంది’ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి హమాస్‌కు వార్నింగ్ ఇచ్చారు. మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. హమాస్ బందీలను విడుదలపై విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. "ఇది హమాస్‌కు మంచిది కాదు. ఇది ఎవరికీ మంచిది కాదు. హమాస్ ఇప్పటికే బందీల‌ను విడుద‌ల చేయాల్సి ఉంది. ఇప్ప‌టికే చాలా మంది హ‌త్య‌కు గుర‌య్యారు. "వారు ఇకపై బందీలుగా ఉండ‌రు.. నాకు ఇజ్రాయెల్ నుండి వచ్చిన వ్యక్తులు, ఇతరులు కాల్ చేస్తున్నారు, వాళ్ల‌ను కాపాడాల‌ని వేడుకుంటున్నారు. అక్కడ యునైటెడ్ స్టేట్స్ కు చెందిన వారిని కూడా బందీలుగా చేశారు. వాళ్ల తల్లులు నా దగ్గరకు వచ్చార...

Delhi Election 2025 : నేడు ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

Elections
Delhi Election 2025 Schedule Live : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో నేటి నుంచి ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమలులోకి రానుంది. ఢిల్లీలో, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుసగా మూడోసారి పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఈసారి ఎలాగైనా నిలువ‌రించాల‌ని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉంది. కానీ గ‌త‌ లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తో మిత్ర‌ప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది. 2020లో ఢిల్లీ ఎన్నికలు జనవరి 6న ప్ర‌క‌టించారు. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. అవినీతి కేసులో బెయిల్ లభించడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ ముమ్మ‌రంగా ప్రచారం చేస్తోంది. ప్రజాకోర్టు తీర్పులో తమ పార...

Annamalai | ‘అప్పటి వరకు చెప్పులు వేసుకోను.’: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై

National
Annamalai | తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే (DMK) ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ తాను చెప్పులు వేసుకోబోన‌ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా యూనివర్సిటీ(Anna University)లో లైంగిక దాడి కేసులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతీ శుక్రవారం తన ఇంటి ముందు ఆరు కొరడా దెబ్బలు తింటానని గురువారం మీడియాకు వెల్ల‌డించారు. ఈ కేసులో బాధితురాలి పేరు, ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలు వెల్లడించడంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎఫ్ఐఆర్ లీక్ చేయడం ద్వారా బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశార‌ని, ఇది బాధితురాలి పట్ల ప్రభుత్వం, పోలీసుల వైఖరి ఎంటో తేట‌తెల్లం చేస్తుంద‌ని తెలిపారు . ఎఫ్ఐఆర్ వివ‌రాల‌ను లీక్ చేసినందుకు పోలీసులు, డీఎంకే పార్టీ నేత‌లు సిగ్గు పడాలి. నిర్భయ నిధి ఎక్కడ?. అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎందుకు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయ‌లేదు’ అని అన్నామలై (Annamalai) ప్ర‌శ్న‌ల‌...

వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. త్వరలో JPCకి..

National
New Delhi | పార్లమెంట్‌లో తొలిసారిగా ఇ-ఓటింగ్ తర్వాత ఏకకాల ఎన్నికల(One Nation One Election Bill) కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టారు. ప్రవేశ తీర్మానం మెజారిటీతో ఆమోదించబడింది. తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి. బిల్లు ఇప్పుడు జేపీసీకి పంపబడుతుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ - రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు ఒక సాధారణ బిల్లుల‌ను పెట్టారు. అయితే జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు తీవ్ర చర్చకు దారితీసింది. బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు ఈ బిల్లును రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. 7వ షెడ్యూల్‌కు మించిన ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేమని, ఈ బిల్...

Priyanka Gandhi | పాలస్తీనా బ్యాగ్ తో ప్రియాంక గాంధీ.. స్పందించిన‌ బిజెపి

Trending News
Priyanka Gandhi | కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ 'పాలస్తీనా (Palestine) అని రాసి ఉన్న బ్యాగుతో పార్ల‌మెంట్‌ (Parliament)కు రావ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ప్రియాంక బ్యాగ్ తో ఉన్న ఫొటోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ సోమవారం (డిసెంబర్ 16) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేశారు. ఈ పరిణామంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది 'ముస్లింల బుజ్జగింపు చ‌ర్య అని పేర్కొంది. ఈ వివాదంపై సోష‌ల్‌మీడియాలో అనేక మంది నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ప్రియాంక గాంధీ తన మద్దతుకు ప్రతీకగా ప్రత్యేక బ్యాగ్‌ని ధరించడం ద్వారా పాలస్తీనాకు తన సంఘీభావాన్ని చూపుతుందని ఒక నెటిజ‌న్ కామెంట్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని భారతదేశం తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లో పాకిస్తాన్ దళాలను ఓడించిన రోజు 'విజయ్ దివస్' నాడు హమాస్ వంటి సంస్థకు ప్రియాంక గాంధీ ఇందిరా గాంధీ మ...

Allu Arjun Remand | అల్లు అర్జున్‌కు బిగ్ షాక్, 14 రోజుల రిమాండ్

Entertainment
Allu Arjun Remand | పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊర‌ట ద‌క్క‌లేదు. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ వేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. 14 రోజులపాటు జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు బ‌న్నీని హైద‌రాబాద్‌ చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద ప్రీమియ‌ర్ షో స‌మ‌యంలో జ‌రిగిన‌ తొక్కిసలాటలో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెంద‌గా మ‌రో బాలుల‌డు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈఘ‌ట‌న‌కు సంబంధించి ఇదివ‌ర‌కే బ‌న్నీ తో స‌హా ప‌లువురిపై కేసులు న‌మోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఈరోజు మ‌ధ్యాహ్నం అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను గాంధీ హాస్పిట‌ల్ కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ త‌ర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా తనపై నమోదైన అన్ని కేసులను క్వాష్ చేయాల‌ని అల్లు అర్జున్ పిటిషన్ ...

Highway Roads | తెలంగాణలో సరికొత్త మోడల్ లో రహదారుల అభివృద్ధి

National, Telangana
Hyderabad : రహదారి మౌలిక సదుపాయాలను (Highway Roads ) మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ను అమలు చేయాలను భావిస్తోంది. ఈ నమూనా కింద రాష్ట్ర రహదారులు, రోడ్లు - భవనాలు (R&B) శాఖ నిర్వహించే రోడ్లు, పంచాయతీ రాజ్ (PR) శాఖ పర్యవేక్షించే గ్రామీణ రహదారులను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిదశలో రూ.28,000 కోట్ల అంచనా వ్యయంతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. HAM నమూనా అంటే ఏమిటి? బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (BOT), ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) ఫ్రేమ్‌వర్క్‌ల సమ్మేళనం అయిన HAM మోడల్, 2016లో భారతదేశంలో జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం ప్రవేశపెట్టారు. HAM కింద ప్రభుత్వం ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం నిధులు సమకూరుస్తుంది. అయితే ఇందులో ఈక్విటీ, రుణాల ద్వారా ప్రైవేట్ డెవలపర్లు మిగిలిన 60 శాతాన్ని ...
Exit mobile version