Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: telangana

Kanche Gachibowli : కంచ గచ్చిబౌలి భూముల అంశంపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
National

Kanche Gachibowli : కంచ గచ్చిబౌలి భూముల అంశంపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు సీరియస్.. Kanche Gachibowli : తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (HCU) ఆనుకుని ఉన్న భూమిలో భారీగా చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో పాల్గొన్న అధికారులు "ఆనందించడానికి" ఆ స్థలంలో తాత్కాలిక జైళ్లను నిర్మించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. అదనంగా, అటవీ నిర్మూలన వల్ల ప్రభావితమైన వన్యప్రాణులను రక్షించడానికి పరిస్థితిని అంచనా వేసి అవసరమైన చర్యలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర అటవీశాఖను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జంతువులు ఆశ్రయం కోసం పరిగెత్తుతున్న వీడియోలను చూసి ఆశ్చర్యపోయానని సుప్రీంకోర్టు పేర్కొంది, "పర్యావరణానికి జరిగిన నష్టం పట్ల మేము ఆందోళన చెందుతున్నాము" అని పేర్కొంది. విశ్వవిద్యాలయం సమీపంలోని పచ్చని ప్రదేశంలో చెట్లను నరికివేయడానికి "తొందరపడటం"పై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన...
National

RTC JAC | తెలంగాణలో మళ్లీ ఆర్టీసీ సమ్మె సైరన్.. నోటీసులు జారీ..!

RTC JAC strike notice | హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. మే 6వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. తమ డిమాండ్లను మే 6లోపు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు.. ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసును టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌తో పాటు, లేబర్ కమిషనర్‌కు అందజేసింది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మే 7 నుండి ఆర్టీసీ సిబ్బంది (RTC JAC ) విధులను బహిష్కరిస్తామని జేఏసీ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదనంగా, నేటికీ తమ జీతాలు జమ కాలేదని వారు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీకి బీఆర్ఎస్ రూ.8 కోట్లు.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో సిల్వర్ జూబ్లీ వేడుకలను...
Telangana

TG Ration Cards | తెల్లరేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి సన్నబియ్యం

TG Ration Cards | రాష్ట్రంలోని తెల్ల రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఉగాది నుంచి రేషన్‌ ‌షాపులలో సన్నబియ్యం పంపిణీ  చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున హుజూర్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గంలో సన్నిబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఈ రోజు ప్రకటించారు. ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి  సతీసమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజ అనంతరం సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారని తెలిపారు. మటంపల్లి ఆలయంలో పంచాంగ శ్రావణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాల్గొననున్నారు. కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్‌ ‌షాపుల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రేషన్‌ ‌షా...
Telangana

Rain Alert | ఎండల నుంచి ఉపశమనం మూడురోజులపాటు భారీ వర్షాలు

TG Weather Report Rain Alert : కొన్నాళ్లుగా తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే చాన్స్ ఉందని హెచ్చరించింది. హైదరాబాద్‌లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కరుస్తాయని వెల్లడించింది. TG Rain Alert నేటి (గురువారం మార్చి 20) వాతావరణం గమనిస్తే.. ఉదయం నుంచి ఎండలు దంచేస్తాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎండ ఎక్కువగానే ఉంటుంది. IMD Hyderabad Rain Alert మార్చి 22, 23, 24వ తేదీల్లో సెంట్రల్ నార్త్ తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ...
Telangana

Begumpet railway station : పూర్తి కావస్తున్న బేగంపేట రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు

Begumpet railway station : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీం (Amrit Bharat Station ) లో భాగంగా తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ పరిధిలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 1200 స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా.. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్‌లో 14 స్టేషన్లను కేంద్రం పునరాభివృద్ధి చేస్తోంది .ఈ క్రమంలో హైదరాబాద్ లో కీలకమైన బేగంపేట రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేశారు. రూ.27 కోట్లతో చేపట్టిన బేగంపేట రైల్వే స్టేషన్‌ డెవలప్ మెంట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేలో విప్లవాత్మక మార్పులు ...
Telangana

Telangana news | మహిళలలకు సర్కారు గుడ్ న్యూస్.. త్వరలో రైస్ మిల్లులు… గోదాముల బాధ్యతలు

Telangana news : మ‌హిళా దినోత్స‌వం (Womens Day 2025) సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. మ‌హిళ‌ల‌కు కొత్త‌గా గోదాములు, రైస్ మిల్లుల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించేందుకు ప్ర‌యత్నాల‌ను మొద‌లుపెట్టిన‌ట్లు ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్ (Secundrabad) పరేడ్ గ్రౌండ్‌లో శ‌నివారం జ‌రిగిన‌ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌ను మ‌హిళా సంఘాల‌కు అప్ప‌గించామ‌ని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మ‌హిళా శ‌క్తి (Indira Mahila Shakthi) సమావేశాలకు భ‌వ‌నాలు ఉండాల‌ని నిర్ణ‌యించి ప్ర‌తి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శ‌క్తి సంఘం భ‌వ‌నానికి రూ.25 కోట్లు కేటాయించినట్లు ఆయ‌న గుర్తుచేశారు. మ‌హిళా సంఘాల‌కు సోలార్ ప్లాంట్లు Telangana news : సోలార్ విద్యుత్ ప్లాంట్ల‌ (Solar power Plants)ను మ‌హిళా సంఘాల()కు అప్...
Telangana

Future City | ఫ్యూచర్ సిటీపై స్పెషల్ ఫోకస్.. నగరానికి అన్ని వైపులా రోడ్డు, రైలు కనెక్టివిటీ

Future City | రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్ ఫ్యూచ‌ర్ సిటీపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో 7,257 చదరపు కిలోమీటర్ల (చదరపు కి.మీ) విస్తీర్ణంలో ఉన్న హెచ్‌ఎండీఏ ఇప్పుడు 11 జిల్లాల్లో దాదాపు 10,472.71 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉంటుంది. HMDA నాలుగు వైపులా విస్తరిస్తుంది. ఇప్ప‌టికే మ్యాప్ తయారీలో ఉందని అధికారులు చెబుతున్నారు. "రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు ఉన్న ప్రాంతాన్ని HMDA అధికార పరిధిగా నేరుగా తీసుకోలేం, ఎందుకంటే 36 గ్రామాలను HMDA నుంచి తొలగించి కొత్తగా ప్రకటించిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కింద చేర్చారు" అని HMDA అధికారులు చెబుతున‌న్నారు. Future City : క‌నెక్టివిటీ కోసం రైలు, రోడ్డు మార్గాలు నగర శివార్లలోని అనేక గ్రామాలను HMDAతో విలీనం చేయడం వల్ల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి గ్రేటర్ హైదరాబాద్‌కు కనెక్టివిటీ కూడా పెరు...
Telangana

EV Bus | టీజీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల పెంపుపై కార్మికుల్లో ఆందోళన

TGSRTC EV Bus | ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం గ్రీన్ మొబిలిటీని ప్రోత్స‌హించే దిశ‌గా టీజీఎస్‌ ఆర్టీసీ (TGSRTC ) లో ఎలక్ట్రిక్ బస్సుల (EV Bus) సంఖ్య‌ను తెలంగాణ ప్రభుత్వం క్ర‌మ‌క్ర‌మంగా పెంచుకుంటూ పోతోంది. అయితే ఈ నిర్ణ‌యం ప‌ట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలలో ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంది. జిసిసి మోడల్‌లో ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఉద్యోగుల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త లేకుండా చేస్తుంద‌ని యూనియన్ నాయకులు భయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) ఫ్లీట్‌కు ఎలక్ట్రిక్ బస్సులను మ‌రిన్ని ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సహా ఇత‌ర మంత్రులు అనేక సందర్భాల్లో ప్ర‌క‌టించారు. డీజిల్‌తో నడిచే కాలం చెల్లిన‌ బస్సుల స్థానంలో దాదాపు 3,000 ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) వచ్చే అవకాశం ఉందని అంచనా. కార్బన్ పాదముద్రను తగ్గించడం, పర్యావరణ అనుకూల ప్ర...
National

Telangana prisons : 2024లో తెలంగాణ జైళ్లకు పెరిగిన ఖైదీల సంఖ్య..

Telangana prisons : 2024లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో 41,138 మంది నేరస్తులు చేరారు. కాగా, 2023లో 31,428 మంది అడ్మిషన్లు పొందారని రాష్ట్ర జైళ్ల శాఖ తెలిపింది. 41,138 మంది ఖైదీల్లో 30,153 మంది అండర్ ట్రయల్ ఖైదీలు (Undertrial prisoners) కాగా, వారిలో 2,754 మంది హత్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని జిల్లా జైళ్లలో కాకుండా 38 కేంద్ర, జిల్లా జైళ్లలో ఈ అడ్మిషన్లు నమోదయ్యాయి. జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్, డాక్టర్ సౌమ్య మిశ్రా (Soumya Mishra) బుధవారం ఇక్కడ వార్షిక విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. కారాగారాలకు చేరిన నేరస్థుల్లో పురుషులు, స్త్రీలు పెరిగారు. ట్రాన్స్‌జెండర్ల సంఖ్య తగ్గింది. ఎన్‌డిపిఎస్ చట్టానికి సంబంధించిన కేసుల కింద ఖైదీల సంఖ్య భారీగా పెరిగింది. ఇది మాదకద్రవ్యాలకు (NDPS) వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కారణమని భావించవచ...
Telangana, తాజా వార్తలు

Charlapalli Railway Station : ఇక‌పై ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే..

Charlapalli Railway Station : సుమారు రూ. 413 కోట్లతో అత్యాధునిక హంగులు, స‌క‌ల సౌకర్యాల‌తో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ ఎట్ట‌కేల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ రైల్వే టెర్మిన‌ల్‌లో మొత్తం 19 ట్రాక్‌లు ఉన్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వేస్టేష‌న్ల త‌ర్వాత చ‌ర్ల‌ప‌ల్లి స్టేష‌న్‌ కీలకమైన టెర్మిన‌ల్ గా మారింది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, వైజాగ్‌లకు వెళ్లే రైళ్లు ఇప్పుడు చ‌ర్లపల్లి నుంచే నడిపించ‌నున్నారు. దీనివ‌ల్ల సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచీగూడ‌ స్టేషన్ల‌లో రద్దీ తగ్గుతుంది. చ‌ర్లపల్లి నుంచి బయలుదేరే రైళ్లలో గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, MGR చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. అలాగే గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు కూడా...
Exit mobile version