Tuesday, March 4Thank you for visiting

Tag: Telangana police

Transfers In Telangana | రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీల పర్వం

Telangana
మరో 74 మంది మున్సిపల్‌ కమిషనర్‌లు బదిలీ Transfers In Telangana | హైదరాబాద్‌: తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల ముందు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంగళవారం 40 మందిని బదిలీ (Transfers In Telangana) చేస్తూ ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే బుధవారం మరో 74 మందికి ప్రభుత్వం స్థాన చలనం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర పురుపాలక శాఖ.. ఈ బదిలీలను చేపట్టింది. అయితే ప్రభుత్వం తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో కూడా భారీగా బదిలీలు చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖలో మొత్తం 105 మంది అధికారులను బదిలీ చేశారు. సోమవారం జారీ చేసిన ఉత్తర్వులతో సీఈవో, డీఆర్డీవో, అడిషనల్‌ డీఆర్డీవో, డీపీవోలను బదిలీ చేశారు. 14 మంది ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లును తెలంగాణ ఆబ్కారీశాఖలో బదిలీ చేశారు. ఇద్దరు ఉప కమిషనర్ల తో పాటు 9 మంది సహాయ కమిషనర్లకు ప్రభుత్వం బదిలీ ఉ...

మీకు “ఓటర్​ స్లిప్​” ఇంకా అందలేదా? సింపుల్​గా ఇలా పొందండి..!

Telangana
తెలంగాణలో ఎన్నికల పండగ వచ్చేసింది. గురువారం జరిగే పోలింగ్​ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఓటరు స్లిప్​ల పంపిణీ ప్రక్రియ ముగిసింది. అయితే.. పలు కారణాల వల్ల కొందరికి ఓటరు స్లిప్ (voter slip)​ అందకపోవచ్చు. అలాంటి వారు ఆందోళన చెందకుండా కొన్ని పద్ధతులను పాటించి మీ ఓటర్​ స్లిప్​ను పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.. ఓటర్ స్లిప్ తో  లాభం ఇదే.. మన వద్ద ఓటర్ ఐడీ ఉంటుంది కదా.. మరి, ఈ ఓటరు స్లిప్ ఎందుకు? అనే అనుమానం రావొచ్చు. ఎందుకంటే.. మనం ఉన్న ఏరియాలో సుమారు నాలుగైదు పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. వాటిలో ఒక కేంద్రంలో మాత్రమే మనం ఓటు వేసేందుకు వీలుంటుంది. ఆ పో లింగ్ కేంద్రం ఏది? ఎక్కడుంది? అనేది మనకు తెలియాలంటే.. ఓటర్ స్లిప్ మన వద్ద ఉండాలి. ఓటు వేయడానికి మనం వెళ్లినప్పుడు.. ఓటరు ఐడీ కార్డు లేదా.. వేరే ఇతర గుర్తింపు కార్డు తో పాటు.. ఈ స్లిప్ తీసుకెళ్తే.. త్వరగా ఓటు వేసేయవచ్చు. ...

మేకలను దొంగిలించారనే నెపంతో.. తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు

Crime, Local
Mandamarri Incident: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. మేకలను చోరీ చేశారనే అనుమానంతో ఓ దళిత యువకుడితో పాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. వివరాల్లోకి వెళితే.. మందమర్రి కి చెందిన కొమురాజుల రాములు కు చెందిన మేకల మందలో నుంచి రెండు మేకలు కనిపించకుండా పోయాయి. దీంతో పశువుల కాపరి తేజ, దళితుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్ పై అనుమానంతో ఇద్దరిని షెడ్డుకు పిలిపించారు. షెడ్డులో తాళ్లతో తలకిందులుగా వేలాడదీసి కింద పొగపెట్టి ఇద్దరినీ తీవ్రంగా కొట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కొమురాజుల రాములుతోపాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదీ జరిగింది. మంచిర్యాల(mancherial) జిల్లా మందమర్రి పట్టణంలో మేకలను చోరీ చేశారనే అనుమానంలో దళిత యువకుడితో పాటు పశువుల కాపరిని తాళ్లతో కట్టి వేలాడదీశారు. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగ...

బైక్ ల చోరీల్లో ఆరితేరారు.. పలుమార్లు జైలుకెళ్లినా మారలేదు..

National
ఇద్దరు బైక్ దొంగలను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ (warangal police commissionerate) పరిధిలో ద్విచక్ర వాహనాలు, తాళం వేసి ఉన్న షటర్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సీసీఎస్, మట్వాడా, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు లక్షల రూపాయల విలువైన తొమ్మిది ద్విచక్రవాహనాలు, రూ1.60లక్షల నగదు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను  క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడించారు. మాట్వాడా పోలీసులు అరెస్టు చేసిన వరంగల్ పోచమ్మమైదాన్ కు చెందిన బరిపట్ల  సాయి( 30) మద్యంతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో వరంగల్ పోలీస్ కమికషనరప్ పాటు మహబూబాబాద్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిపై గతంలో...

నిజాయితీగా వ్యాపారం చేసుకోండి లేదంటే చర్యలు తప్పవు

Local
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ. రంగనాథ్ హన్మకొండ: ‘నిజాయితీగా వ్యాపారం చేయండి లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్.. పాత ఇనుప సామాను కొనుగోలు వ్యాపారస్తులకు, ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యానికి సూచించారు. వరంగల్, హన్మొకండ, కాజీపేట ట్రై సిటీ పరిధిలోని పాత సామగ్రి కొనుగోలు చేసే వ్యాపారులతో పాటు ఆటో కన్సల్టెన్సీ నిర్వాహకులతో గురువారం హన్మకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో పోలీసు కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా నగరంలో చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు కలిగే నష్టంతో పాటు, తద్వారా దేశానికి ఏవిధంగా నష్టం వాటిల్లుతుందో పోలీస్ కమిషనర్ రంగనాథ్ వ్యాపారస్తులకు వివరించి చెప్పారు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా చోరీకి గురైన వాహనాల కొనుగోలు చేయడం సరికాదన్నారు. నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ము...

భారీ వర్షాలతో తెలంగాణ విలవిల

Telangana
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు రికార్డు స్థాయిలో కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఎనిమిది మంది చనిపోయారని సమాచారం. మూడు రోజుల రెడ్ అలర్ట్ తర్వాత, వాతావరణ శాఖ అనేక జిల్లాల్లో హెచ్చరిక స్థాయిని 'ఆరెంజ్' అలర్ట్  కు తగ్గించింది. గురువారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో లక్ష్మీదేవిపేట (ములుగు జిల్లా), చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి)లో వరుసగా 64.98 సెం.మీ, 61.65 సెం.మీ వర్షపాతం నమోదైంది. నివేదికల ప్రకారం, గురువారం భారీ వర్షం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కనీసం ఎనిమిది మంది వ్యక్తులు వేర్వేరు సంఘటనలలో మరణించారు. మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు పి.యాకయ్య, పి శ్రీనివాస్ వాగులో కొట్టుకుపోగా, హనుమకొండలో లైవ్ వైరు తగిలి ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. కరీంనగర్‌కు చెందిన ఎం.వెంకటేష్ (23) సబితం జలపాతంలో జారిపడి గల్లంతయ్యాడు. హనుమకొండలోని గోపాలపూర్‌కు చెందిన జి రాజు నీటిలో కొట్టుకుప...
Exit mobile version