Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Tdp

Rajya Sabha bypolls : ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
Elections

Rajya Sabha bypolls : ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

Rajya Sabha bypolls : ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఒడిశా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీరాజ్యసభ ఉప ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమ అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది. జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్: ఆర్.కృష్ణయ్య ఒడిశా: సుజీత్ కుమార్ హర్యానా: రేఖా శర్మ రాజ్యసభ ఉప ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ డిసెంబరు 20న ఎగువ సభకు ఎన్నికలు జరగనుండగా, అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా ఆరుగురు సభ్యులను రాజ్యసభకు ఎన్నుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, హర్యానాలో ఒక్కో సీటు ఖాళీ అయ్యాయి. కొత్త ఎంపీలు వచ్చే సీట్లు ఇవే.. ఆంధ్రప్రదేశ్: రాష్ట్రం ముగ్గురు ఎంపీలను పంపనుంది. జగన్ మోహన్ రెడ్డికి చెందిన ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు వ...
National

Lok Sabha Speaker | లోక్ సభ స్పీకర్ ఎన్నిక 26న

Lok Sabha Speaker election : లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రెండు రోజుల తర్వాత జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే స్పీకర్ అభ్య‌ర్థిని ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరుగుతాయని కొత్తగా చేరిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. రిజిజు ప్రకారం, సెషన్‌లో మొదటి మూడు రోజులు కొత్తగా ఎన్నికైన నాయకులు ప్రమాణ స్వీకారం చేయడం.. లోక్‌సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించడం, సభ స్పీకర్‌ను ఎన్నుకోవడం జ‌రుగుతుంది. జూలై 3న సెషన్‌ ముగుస్తుంది. జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని భావిస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మా...
National, తాజా వార్తలు

Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?

Modi 3 cabinet | బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అధినేత నరేంద్ర మోదీ ( Narendra Modi) ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రెండో వ్యక్తిగా మోదీ నిలిచారు. అయితే మొత్తం మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేయనప్పటికీ. మొద‌ట దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి మండలి మొత్తం బలం 78 నుంచి 81 మంది సభ్యుల మధ్య ఉండవచ్చని అంచనా.ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ఎన్నికైన నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి చెందిన పలువురు కీలక మిత్రపక్షాలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్త మంత్రివ‌ర్గంలో మిత్ర‌ప‌క్షాల‌కు కూడా పెద్ద‌పీట వేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలుగుద...
Andhrapradesh

AP Elections |  ఏపీలో ఒంట‌రిగానే బీజేపీ పోటీ..!! 

AP Elections | న్యూఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు సమీపిస్తున్నాయి.  త్వ‌ర‌లోనే ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఏప్రిల్ మొద‌టి వారంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగే చాన్స్ ఉంద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.  ఈ ఎన్నిక‌ల‌తో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జరగనున్నాయి.  ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో  రాజ‌కీయాలు  ర‌స‌వ‌త్తరంగా మారాయి. ఎన్నికల్లో అధికార వైసీపీని  ఓడించేందుకు టీడీపీ – జ‌న‌సేన పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే..  ఈ రెండు పార్టీలో ఇటీవలే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల   మొదటి జాబితాను కూడా విడుదల చేశాయి.  అయితే భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా టీడీపీ – జ‌న‌సేన‌తో క‌లిసి పోటీ చేస్తుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ విషయంలో బీజేపీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సమాచారం.  టీడీపీ – జనసేన కూటమితో కలిసి వెళ్లకుండా  బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదే...
Andhrapradesh

Inner Ringroad Case : గురి.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్

Inner Ringroad Case: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలో లోకేష్ ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఏపీ సిఐడి నిందితుడిగా చేర్చడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. Nara lokesh In Inner Ringroad Case: ఆంధ్రప్రదేశ్ అమరావతి (Amravathi) ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేశ్ (Nara Lokesh))  పేరును చేర్చింది. ఈమేరకు నారా లోకేశ్ పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలైంది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమ వ్యక్తిగత ఆస్తుల విలువను పెంచుకోడానికి ఇన్నర్‌ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్లను మార్చారని సిఐడి(CID) ఆరోపణలు చేస్తోంది. సింగపూర్‌ కన్సల్టెన్సీకి మాస్టర్‌ ప్లాన్ తయారు చేసే బాధ్యతలను అప్పగించి, అందులో నిబంధనలను తమకు అనుగుణంగా మార్చుకున్నారని సీఐడీ అభియో...
Exit mobile version