Thursday, June 19Thank you for visiting

Tag: TDP Govt

విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కదలిక..

Andhrapradesh
Visakha Metro Rail | ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీల‌క అప్ డేట్‌.. వచ్చింది. మెట్రో లైన్‌ నిర్మాణానికి సంబంధించిన మొద‌టి దశ డీపీఆర్‌లను చంద్ర‌బాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. విశాఖలో మొద‌టి విడ‌తో 46.23 కి.మీల మేర మూడు కారిడార్లు నిర్మించాలని భావిస్తోంది. మొద‌టి కారిడార్ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు (34.4కి.మీ) రెండో కారిడార్ : గురుద్వార్‌ నుంచి పాత పోస్ట్‌ఆఫీస్‌ వరకు (5.08కి.మీ) మూడో కారిడార్ :తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75కి.మీ) కాగా Visakha Metro Rail తొలి విడత ప్రాజెక్టుకు సుమారు రూ. 11,498 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని ఏపీ స‌ర్కారు అంచనా వేస్తోంది. విశాఖలోని తొలి ద‌శ ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌యిన తర్వాత మెట్రో రైల్‌ ప్రాజెక్టు రెండో విడత కింద కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వ...

Ration card Holders| పేదలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డుపై చక్కర పంపిణీ

Andhrapradesh
Ration card Holders | రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీ చేయాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించింది. సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించింది. ఈ కారణంతోనే రెండు నెలలుగా చక్కెర పంపిణీ నిలిపివేసింది. సెప్టెంబరు నుంచి కొత్త ప్యాకింగులో పంచదార పంపిణీకి రంగం సిద్ధం చేసింది. గత వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం నిత్యవసరాలను తగ్గించి చివరకు కేవలం బియ్యానికే పరిమితం చేసింది. అందరికి అవసరమైన కందిపప్పును పూర్తిగా నిలిపివేసింది. మూడునెలల కిందట అదికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కార్డుదారులకు సరకుల సరఫరాపై జిల్లాల వారీగా లబ్ధిదారులు, డీలర్లు, ఎండీయూ వాహనదారులతో సర్వే నిర్వహించింది.  కార్డుదారుల్లో ఒక్కొక్కరికి 5 కిలోల వంతున ఉచిత బియ్యం, నగదుకు అరకిలో చక్కెర ఇవ్వనున్నారు. వచ్చేనెల నుంచి కొత్త...

Anna Canteens | పేదలకు గుడ్ న్యూస్.. రేప‌టి నుంచే అన్న క్యాంటీన్స్ షురూ.. రూ.5కే టిఫిన్స్, భోజనం

Andhrapradesh
Anna Canteens | ఏపీలో ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 33 మున్సిపాలిటీలలో 100 క్యాంటీన్లను పునఃప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించింది. మొద‌టి విడతగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో ఆయా మునిసిపాలిటీల్లో క్యాంటీన్లు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా గుడివాడలో మొట్ట‌మొద‌టి అన్న‌ క్యాంటీన్‌ ప్రారంభించనున్నారు. మిగతా 99 అన్న క్యాంటీన్లు మరుసటిరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. తెలంగాణ‌లో రూ.5కే భోజ‌నం అందిస్తున్నారు. ఇవి ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ‌ ఆస్ప్ర‌త్రులు, బ‌స్టాండ్లతోపాటు జ‌నసందోహం ఎక్కువ‌గా ఉన్న ర‌హ‌దారుల కూడ‌ళ్ల వ‌ద్ద ప్ర‌స్తుతం అక్ష‌య‌పాత్ర పేరుతో కొన‌సాగుతున్నాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే ఇందిరా క్యాంటీన్ల (Indira canteens )ను ప...

Budget 2024 – Andhrapradesh : కేంద్ర బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు

Andhrapradesh, Business
Budget 2024 - Andhrapradesh | బడ్జెట్​ 2024లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ఖర్చుచేస్తామని హామీనిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్​ పూర్తిచేయ‌డానికి కూడా సాయమందిస్తామ‌ని తెలిపారు. విభజనచట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పారు.. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు అందిస్తామ‌ని, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామ‌ని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామ‌ని చెప్పారు. ఆంధ్ర ప్ర‌దేశ్ కు రాజధాని నిర్మాణం అవసరం అని నమ్ముతున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా నిధులు మంజూరు చేయాల‌ని కేంద్రం నిర్ణయించిందని...

Amaravati Railway | ఏపీ రాజధాని అమరావతి రైలు మార్గంతో ఈ ప్రాంతాలకు కొత్తగా రైల్వే సేవలు..

Andhrapradesh
Amaravati Railway Line | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో శ‌ర‌వేగంగా స‌రికొత్త‌ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో నిర్లక్ష్యానికి గురైన అమరావతి మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆశ‌లు చిగురిస్తున్నాయి. తాజాగా ఒక కీల‌క‌ పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న‌పుడు అప్ప‌టి సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమరావతి రైల్వేలైన్‌ ప్రతిపాదనను అట‌కెక్కించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో రైల్వే శాఖ వేగంగా స్పందించింది. అమరావతి రైల్వే లైన్ కోసం భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. గతంలో రైల్వే అనేక షరతులు విధించింది. రాష్ట్రం తన వాటాను అందించాలని అలాగే భూసేకరణ ఖర్చులను కూడా భరించాలని సూచించింది. ప్రస్తుత నోటిఫికేషన్‌లో అలాంటి షరతులు వి...
Exit mobile version