Sikkim flash floods : సిక్కింలో వరద బీభత్సం.. 23 మంది. ఆర్మీ జవాన్లు గల్లంతు.. కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు
Sikkim flash floods : ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయ్యారు. అనేక చోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఉత్తర సిక్కింలో భారీ వర్షాలతో తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద నీటిలో కొట్టుకుపోవడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. బుధవారం రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఆకస్మిక వరద రావడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు ప్రాంతంలో అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురవడంతో ఈ వరద ఏర్పడింది, దీని కారణంగా తీస్తాలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయి. చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైంది. దీనివల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది.
సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద ...