Thursday, June 19Thank you for visiting

Tag: sheikh hasina

Sheikh Hasina | ప్ర‌ధాని ప‌ద‌వికి షేక్ హ‌సీనా రాజీనామా.. భారత్ – బంగ్లా సరిహద్దులో హై అలర్ట్..

World
Sheikh Hasina | రిజర్వేషన్ల కోటా విష‌యంలో అధికార పార్టీ శ్రేణులకు నిర‌స‌న కారుల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న‌ ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతున్న వేళ‌ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే అధికారిక ప్రకటన చేయనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. మ‌రికొన్ని నివేదిక‌ల ప్ర‌కారం.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. షేక్ హసీనా భారతదేశంలోని త్రిపుర రాజధాని అగర్తలాకు వచ్చినట్టుగా BBC బంగ్లా పేర్కొంది. కాగా, షేక్ హసీనా ఢాకా నుంచి వెళ్లిపోవ‌డం, రాజీనామాపై ఇంకా అధికారిక ధృవీకరించ‌లేదు. ఈ మేరకు ప్రధానమంత్రి సీనియర్ సలహాదారు ఒకరు మీడియాకు సంకేతాలు ఇచ్చారు. తీవ్ర ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆమె తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలిపారు. భారత్‌లో అడుగుపెట్టిన హసీనా! మరోవైపు ఢాకాలోని ప్ర‌ధాని అధికారి...

Maitri Setu | భారత్ -బంగ్లాదేశ్ మధ్య ప్రారంభం కానున్న మైత్రి సేతు వంతెన.. ఈ భారీ బ్రిడ్జి ప్ర‌త్యేక‌తేలు ఇవే..

World
Maitri Setu | భారత్ , బంగ్లాదేశ్‌లను కలిపే వంతెన మైత్రి సేతు ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా మార్చి 2021లో మైత్రి సేతు నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. ఫెని నదిపై 1.9 కి.మీ విస్తరించి ఉన్న ఈ వంతెన భారతదేశంలోని దక్షిణ త్రిపుర జిల్లాలో గ‌ల సబ్‌రూమ్‌ను బంగ్లాదేశ్‌లోని రామ్‌ఘర్‌తో కలుపుతుంది. అయితే “మైత్రి సేతు నిర్మాణం ఇప్పటికే పూర్త‌యింది. ల్యాండ్ పోర్ట్ దాదాపు సిద్ధంగా ఉంది… వంతెన మీదుగా ప్రయాణీకుల రాక‌పోక‌లు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. ప్రయాణీకుల రాక‌పోక‌లు మొద‌లైన త‌ర్వాత సరకు రవాణాను కూడా ప్రవేశపెట్టడానికి మ‌రో రెండు లేదా మూడు నెలల సమయం పడుతుంది” అని త్రిపుర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి కిరణ్ గిట్టే ఇటీవ‌ల‌ విలేకరుల సమావేశంలో వెల్ల‌డించారు. వంతెన ద్వారా సరుక...
Exit mobile version