Monday, March 3Thank you for visiting

Tag: secundrabad

Vajpayee Statue : ప‌బ్లిక్ గార్డెన్‌లో వాజ్‌పేయి విగ్ర‌హం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్‌

Telangana
Vajpayee Statue in Hyderabad : సికింద్రాబాద్ పబ్లిక్ గార్డెన్ (Public Garden )లో దివంగ‌త‌ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) విగ్రహ ప్రతిష్ఠాపనకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుకా యారాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే విగ్రహ ప్రతిష్ఠాపనను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని పబ్లిక్ గార్డెన్‌లో వాజ్ పేయి స్మారక విగ్రహం (Atal Bihari Vajpayee Statue ) నిర్మాణ పనులు కొన‌సాగుతుండ‌గా దీనిని సవాల్ చేస్తూ జెట్టి ఉమేశ్వర్‌రావు అనే సామాజిక కార్యకర్త ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విగ్రహాన్ని తొలగించాలని, పికెట్ పబ్లిక్ గార్డెన్‌ను యథాతథంగా పునరుద్ధరించాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ, అధికారుల చర్యలు సుప్రీంకోర్టు ఆద...

Railway Stations Development : తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ

National, Special Stories
Amrit Bharat Station Scheme : దేశంలోని రవాణా మౌలిక సదుపాయాలు పూర్తి మారిపోతున్నాయి. అత్యాధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లను ఆధునీకకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్  ను ప్రవేశపెట్టారు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రైల్వే స్టేషన్‌ల సామర్థ్యాన్ని పెంచే మాస్టర్ ప్లాన్‌తో దీన్ని అమలు చేస్తున్నారు. Telangana Railway Stations Development: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్(Amrit Bharat Station Scheme) కింద రైల్వే ప్రయాణీకులకు ఆధునిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 38 రైల్వే స్టేషన్‌లను మొత్తం రూ.1830.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్‌ శాటిలైట్ టెర్మినల్ గా రూపుదిద్దుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లు అంతర్జాతీయ విమానాశ్...

Secundrabad | ప్రయాణికులకు అలెర్ట్.. నెల రోజులపాటు 12 రైళ్లు రద్దు..

తాజా వార్తలు
Trains Cancelled in Secundrabad | రైల్వే అభివృద్ధి ప‌నులు, మ‌ర‌మ్మ‌తుల కార‌ణంగా ప‌లు మార్గాల్లో 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే గురువారం ప్రకటించింది. అక్టోబరు 1వ తేదీ నుంచి అక్టోబ‌ర్‌ నెల 31వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని, ప్ర‌యాణికులు గ‌మ‌నించాల‌ని సూచించింది. కాచిగూడ-మెదక్‌ రైలు (07850)ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబరు 1 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు ప్ర‌క‌టించింది. రద్దయిన రైళ్ల జాబితా ఇదే.. కాచిగూడ-నిజామాబాద్‌(07596), నిజామాబాద్‌-కాచిగూడ(07593), మేడ్చల్‌-లింగంపల్లి(47222), లింగంపల్లి-మేడ్చల్‌ (47225), మేడ్చల్‌-సికింద్రాబాద్‌(47235), సికింద్రాబాద్‌-మేడ్చల్‌ (47236), మేడ్చల్‌-సికింద్రాబాద్‌(47237), సికింద్రాబాద్‌-మేడ్చల్‌(47238) మేడ్చల్‌-సికింద్రాబాద్‌(47242), సికింద్రాబాద్‌-మేడ్చల్‌(47245), మేడ్చల్‌-సికిం...

SCR Special Trains | సికింద్రారాబాద్ – కటక్‌ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు..

Telangana
SCR Special Trains | సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలోపెట్టుకొని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్‌ , ఒడిశాలోని క‌టక్ మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ - కటక్‌ మధ్య రాకపోకల కోసం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే పేర్కొంది. ప్ర‌త్యేక‌ రైళ్ల షెడ్యూల్ ఇదే.. SCR Special Trains From Secundrabad : ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 18వ తేదీ వరకు ప్రతి మంగళ, బుధవారాల‌లో ఈ ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌వ‌నున్నాయని మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ రైళ్లు బయలుదేరే సమయాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. హైదరాబాద్‌ - కటక్‌ (07165) రైలు మంగళవారం, కటక్‌ -హైదరాబాద్‌ (07166) రైలు బుధవారం హాల్టింగ్ స్టేష‌న్లు.. సికింద్రాబాద్‌, నల్ల‌గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్ల...

Vizag Vande Bharat Express | విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ లో మార్పులు..

Telangana
Vizag Vande Bharat Express | హైదరాబాద్‌ : విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శుక్రవారం రైలు నం. 20833 / 20834 విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 10 నుంచి కొత్త షెడ్యూల్ అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం Vizag Vande Bharat Express రైలు నంబర్ 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్, రైలు నంబర్ 20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తాయి. ఇప్ప‌టివ‌ర‌కు షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు సేవ‌లందించేవి. విశాఖపట్నం-సికింద్రాబద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్  రైలు మార్గ మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతుంది. ఈ రైలు ఏడు ఏ.సి చైర్ కార్ కోచ్‌లు, ఎగ్జిక్యూటివ్ ఏ...
Exit mobile version