Secunderabad | శరవేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు
Secunderabad Railway Station Redevelopment | విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.700 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి పనులు ఏప్రిల్ 2023లో ప్రారంభమయ్యాయి. 2025 చివరి నాటికి అభివృద్ధిపనులుపూర్తిచేసి సికింద్రాబాద్ జంక్షన్ ను అత్యాధునిక సౌకర్యాలతో సుందరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రయాణీకుల రాకపోకలకు అంతరాయం కలగకుండా నిర్మాణ కార్యకలాపాలను సులభంగా కొనసాగించేందుకు ఉత్తరం వైపున ఉన్న బుకింగ్ కార్యాలయం స్థానంలో తాత్కాలిక బుకింగ్ కార్యాలయం నిర్మించారు. కాగా కొత్త రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) భవనం, స్ట్రక్చరల్, ప్లంబింగ్ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు, ఫౌండేషన్, సివిల్ ఫ్రేమ్ వర్క్తో సహా ఇతర పునర్నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణం వైప...