RSS | సమ్మిళిత అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణే ముఖ్యం
బలవంతపు మతమార్పిడి హింసే..
స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్
Nagpur: బలవంతంగా లేదా ప్రలోభపెట్టి మతమార్పిడి చేయడమనేది ఒకరమైన హింస వంటిదేనని గిరిజన సోదరులను తిరిగి వారి అసలు స్థితికి తీసుకురావడం దిద్దుబాటు చర్య అని స్వయంసేవక్ సంఘ్ (RSS )సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు. నాగ్పూర్ లోని రేషింబాగ్లో గల హెడ్గేవర్ స్మృతి మందిర్ ప్రాంగణంలో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త వికాస్ వర్గ్-II ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇందిరా గాంధీ ప్రభుత్వంలో మంత్రి, మాజీ కాంగ్రెస్ సభ్యుడు, ముఖ్య అతిథి అయిన అరవింద్ నేతమ్ (Arvind Netam) లేవనెత్తిన ఆందోళనలకు మోహన్ భగవత్ స్పందిస్తూ, విస్తృతమైన మతమార్పిడులు (Forced Conversions) భారతదేశ గిరిజన వర్గాల ఉనికికి ముప్పు కలిగిస్తున్నాయని హెచ్చరించారు. "ఇది అదుపు లేకుండా కొనసాగితే, అమెరికాలోని రెడ్ ఇండియన్ల మ...