Thursday, June 19Thank you for visiting

Tag: rice

FCI : ఎఫ్‌సీఐ బియ్యం ధర క్వింటాల్‌కు రూ.550 తగ్గించిన కేంద్రం

National
New Delhi : భారత ఆహార సంస్థ (Food Corporation of India -FCI) కొనుగోలు చేసిన బియ్యం ధరను క్వింటాల్‌కు రూ.550 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. క్వింటాల్‌కు రూ. 2,250గా నిర్ణయించిన కొత్త ధర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇథనాల్ తయారీదారులకు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS) కింద ప్రయోజనం చేకూరుస్తుందని ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇథనాల్ (Ethanol) ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు.. సవరించిన ధర ఇథనాల్ ఉత్పత్తి ప్రోత్స‌హించ‌డంతోపాటు వివిధ రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాల కోసం బియ్యం లభ్యతను పెంచుతుంద‌ని కేంద్రం పేర్కొంది. ఈ చొరవ బియ్యం మార్కెట్లను స్థిరీకరించడానికి జీవ ఇంధన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి దోహ‌దం చేయ‌నుంది. కొత్త స‌వ‌రించిన ధ‌ర‌ల వ‌ల్ల స్టాక్ స్థాయిలను నిర్వహించడానికి, సరఫరా గొలుసు ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది ఇంధన భద్రతను ...

PMGKAY | 2028 డిసెంబర్‌ వరకు ఉచిత బియ్యం.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం

తాజా వార్తలు
PMGKAY | దేశవ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు కేంద్రం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (PMGKAY)తోపాటు ఇత‌ర‌ పథకాలను కేంద్రం మ‌రోసారి పొడిగించింది. 2028 డిసెంబర్‌ వరకు ఉచిత బియ్యం పంపిణీ పథకాలకు కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ ప‌థ‌కాల‌ కోసం రూ. 17,082 కోట్లు వెచ్చించ‌నున్న‌ట్లు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం తెలిపింది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రివర్గం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేర‌కు కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. లక్ష్యిత ప్రజాపంపిణీ వ్యవస్థ (TPDS), ఇతర సంక్షేమ పథకాలు, సమగ్ర శిశు అభివృద్ధి సేవ (ICDS) అంతటా బలవర్థకమైన బియ్యం సరఫరా, దేశంలో రక్తహీనత, సూక్ష్మపోషకాల లోపాలను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత...

Bharat Rice | రూ. 29కి బియ్యం విక్ర‌యం.. రేప‌టి నుంచి మార్కెట్‌లోకి భార‌త్ రైస్

National
Bharat Rice : దేశంలో బియ్యం ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. బియ్యం ల‌భ్య‌త‌ను పెంచి ధ‌ర‌ల‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని కేవ‌లం రూ. 29కి విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించింది. ఈ స‌బ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఎన్‌సీసీఎఫ్‌) కేంద్రియ భండార్ ఔట్‌లెట్ల ద్వారా విక్ర‌యించ‌నున్నట్టు తెలుస్తోంది. న్యూస్ అప్ డేట్స్ కోసం మన వాట్సప్ చానల్ లో చేరండి Bharat Rice పై ఏ క్ష‌ణ‌మైనా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని సీనియ‌ర్ ప్ర‌భుత్వ అధికారి ఒక‌రు పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే గోధుమ పిండి, ప‌ప్పు ధాన్యాల‌ను భార‌త్ ఆటా, భార‌త్ దాల్‌ పేరుతో త‌క్కువ ధ‌ర‌ల‌కే పంపిణీ చేస్తోంది. న‌వంబ‌ర్‌లో తృణ‌ధాన్యాల ధ‌ర‌లు ప‌ది శాతం పైగా...
Exit mobile version