Thursday, June 19Thank you for visiting

Tag: revanth reddy

Telangana news | మహిళలలకు సర్కారు గుడ్ న్యూస్.. త్వరలో రైస్ మిల్లులు… గోదాముల బాధ్యతలు

Telangana
Telangana news : మ‌హిళా దినోత్స‌వం (Womens Day 2025) సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. మ‌హిళ‌ల‌కు కొత్త‌గా గోదాములు, రైస్ మిల్లుల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించేందుకు ప్ర‌యత్నాల‌ను మొద‌లుపెట్టిన‌ట్లు ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్ (Secundrabad) పరేడ్ గ్రౌండ్‌లో శ‌నివారం జ‌రిగిన‌ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌ను మ‌హిళా సంఘాల‌కు అప్ప‌గించామ‌ని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మ‌హిళా శ‌క్తి (Indira Mahila Shakthi) సమావేశాలకు భ‌వ‌నాలు ఉండాల‌ని నిర్ణ‌యించి ప్ర‌తి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శ‌క్తి సంఘం భ‌వ‌నానికి రూ.25 కోట్లు కేటాయించినట్లు ఆయ‌న గుర్తుచేశారు. మ‌హిళా సంఘాల‌కు సోలార్ ప్లాంట్లు Telangana news : సోలార్ విద్యుత్ ప్లాంట్ల‌ (Solar power Plants)ను మ‌హిళా సంఘాల()కు అప్...

Osmania | ఉస్మానియా ఆస్ప‌త్రికి సీఎం శంకుస్థాప‌న‌.. తీవ్ర ఉద్రిక్త‌త‌

Telangana
హైదరాబాద్‌లోని గోషామహల్ కొత్త‌గా ఉస్మానియా ఆస్ప‌త్రి (New Osmania Hospital) నిర్మాణానికి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Telangana chief minister Revanth Reddy) తీవ్ర నిర‌స‌నలు, ఉద్రిక్త‌ల మ‌ధ్య ఈ రోజు శంకుస్థాప‌న చేశారు. ఈ ఆస్ప‌త్రి నిర్మాణాన్ని గోషామ‌హ‌ల్ ప‌రిర‌క్ష‌ణ స‌మితి మొద‌టి నుంచే వ్య‌తిరేకిస్తోంది. ఈ అంశాన్ని గ్రేటర్ హైదరాబాద్ మునిసిప‌ల్ కార్పొరేషన్ (GHMC) సాధారణ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు కూడా లేవ‌నెత్తారు. కొత్త‌గా నిర్మించ‌నున్న ఉస్మానియా ఆస్ప‌త్రిని ఇప్పుడున్న భ‌వ‌నం వెనుక భాగంలోనే క‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. New Osmania Hospital పై వ్య‌తిరేకత ఎందుకంటే.. గోషామ‌హ‌ల్ (Goshamahal) పోలీస్‌గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆస్ప‌త్రి క‌ట్ట‌డంతో ఆ ప్రాంతంలో ర‌ద్దీ పెరిగితే తీవ్ర ట్రాఫిక్ స‌మ‌స్య ఎదుర‌వుతుంద‌నే అభ్యంత‌రం వ్య‌క్తమ‌వుతోంది. గోషామహల్ వాసులు, వ్యాపారులు ప‌లువురు ఈ నిర్మా...

Adani group | ఒకవైపు అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు.. మరోవైపు తెలంగాణలో అదానీ గ్రూప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు..

Trending News
Adani group | న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ(Goutham Adani)  పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పిలుపునివ్వడంతో తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని ఇరకాటంలో పడేట్లు అయింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలపై USలో అభియోగాలు మోపబడిన తర్వాత అతనిపై చర్య తీసుకోవాలని గాంధీ డిమాండ్‌ చేసిన విష‌యం తెలిసిందే.. అయితే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అదానీ గ్రూప్ నుంచి విరాళాలు స్వీకరించిన వార్త‌లు అదానీ గ్రూప్ తో తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌కు సంబంధించిన వార్త‌లు ట్రెండింగ్ లోకి వ‌చ్చాయి. రాహుల్ గాంధీ ఏం చెప్పారు? భారతీయ అధికారులకు USD 250 మిలియన్ల లంచం ఇచ్చినందుకు US ప్రాసిక్యూటర్లు అదానీ, ఆయ‌న‌ సహచరులపై అభియోగాలు మోపిన విష‌యంపై రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ప్ర‌స్తావించారు. గౌత‌మ్ అదానీ.. భారత్‌, అమెరికన్ చట్ట...

రాష్ట్రంలో వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు!

Telangana
DSC Results 2024 : డీఎస్సీ 2024 ఫలితాలను విడుదల చేసిన సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  మరో శుభ‌వార్త చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఖాళీలపై ప‌రిశీల‌న చూసుకొని మ‌రో డీఎస్సీ నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. విద్య‌పై ఖ‌ర్చు విద్యపై పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడి అని తాము భావిస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాఠాశాలలు నిర్వహిస్తామ‌ని చెప్పారు. . ప్ర‌స్తుత‌ డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇందులో ఉన్న మిగిలిపోయే ఖాళీలు, కొత్తగా ఏర్పడే ఖాళీలు సేక‌రించి డీఎస్సీపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక‌పై ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు నియామకాలు చేప‌డ‌తామ‌ని, త్వరలోనే గ్రూప్ 1 ఫ‌లితాలు  (Group 1 Results) కూడా వెల్ల‌డిస్త‌మ‌ని తెలిపారు. ఒక్కో నియోజక వర్గంలో రూ.100 -120 కోట్ల నిధులతో 20 నుంచి 25 ఎకరాల స్థ...

Vehicle Scrap Policy | మీ వాహనం 15 ఏళ్లు దాటిందా? అయితే మీకు షాక్.. జనవరి నుంచి కొత్త రూల్స్

Special Stories
Vehicle Scrap Policy | తెలంగాణ రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన పాత‌ వాహనాలను తుక్కు కింద మార్చేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించింది. వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని నియత్రించేందుకు, ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం న‌డుం బిగించింది. 2025, జనవరి ఒకటవ తేదీ నుంచి పాత‌ వాహనాల (Old Vehicles)ను స్క్రాప్‌ కు పంపించాల‌ని నిర్ణయించింది. 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలు.. ఫిట్‌నెస్‌ ‌పరీక్షల్లో ఫెయిల్ అయిన వాహనాలకు ఇక నుంచి రిజిస్ట్రేషన్ ఉండ‌దు. వెహికల్‌ ‌ఫిట్‌నెస్‌ ‌పరీక్షలో పాసయితే... గ్రీన్‌ ‌ట్యాక్స్ ‌(Green Tax) చెల్లించి.. మ‌రో మూడు నుంచి ఐదేళ్లు అదనంగా న‌డిపించుకోవ‌చ్చు. ఫిట్‌నెస్‌ ‌టెస్ట్‌లో ఫెయిలైన‌ వాహనాలు మాత్రం స్క్రాప్ కు పంపించాల్సిందే.. ఈ నిబంధ‌న‌ను ఉల్లంఘించి పాత‌వాహన‌ల‌ను రోడ్ల‌పైకి తీసుకువస్తే అధికారులు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారు. తెలంగాణ‌లో 15 ల‌క్...

Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ గౌడ్

Telangana
Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్‌గా  మ‌హేష్‌ కుమార్ ను నియ‌మిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగగా ప్రస్తుతం ఆయన స్థానంలో మ‌హేశ్ కుమార్ గౌడ్ ను నియమించింది. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. మహేష్ కుమార్ 2023లో పీసీసీ ఎన్నిక‌ల క‌మిటీ స‌భ్యుడిగా ప‌నిచేశారు. ఇదిలా ఉండ‌గా పీసీసీ చీఫ్ ప‌ద‌వికి మ‌ధుయాష్కీ గౌడ్, జీవ‌న్ రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, జ‌గ్గా రెడ్డి, అద్దంకి ద‌యాక‌ర్ పోటీ ప‌డ్డారు. కానీ వీరంద‌రిలో చివ‌ర‌కు రేవంత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ పీఠం (TPCC President)  ద‌క్కింది. పీసీసీ అధ్య‌క్షుడు ఎవ‌ర‌నే దానిపై రెండు వారాల క్రిత‌మే క‌స‌ర‌త్తు జ‌ర‌గ‌గా, కాంగ్రెస్ పార్టీ నేడు అధికారికంగా ప్ర...

Sports University | తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. !

Telangana
Sports University |  హైదరాబాద్ : ఒలింపిక్ పతకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ప్ర‌క‌టించారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ అంతర్జాతీయ కోచ్‌లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఎన్‌ఎండిసి హైదరాబాద్ మారథాన్ ముగింపు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించేందుకు ఇటీవల ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తరహాలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం తెలిపారు. అతను ఇటీవల దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా, సియోల్‌లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీని సందర్శించానని, ఇది ఒలింపిక్ పతక...

TG Raithu Runa Mafi | రైతన్నలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీ నగదు ఖాతాల్లో జమ..

Telangana
Second Fhase Loan Waiver : రాష్ట్ర‌ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. శాస‌న స‌భ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణ మాఫీ ( TG Raithu Runa Mafi )నిధులను విడుదల చేశారు. ఇప్పటికే లక్ష రూపాయ‌ల రుణ‌బ‌కాయిలు ఉన్నవారికి రుణమాఫీ ప్ర‌క్రియ‌ పూర్తి చేశారు. తెలంగాణ‌లో మొత్తం 6,40,223 మందికి రూ.6190.01 కోట్ల మేర రుణ‌మాఫీ నిధులను విడుదల చేశారు. ఇక మూడో విడత కింద 17, 75, 235 మంది రైతులకు రూ.12,224.98 కోట్లు విడుదల చేశారు. కాగా రాష్ట్రంలోని 17పార్లమెంటు నియోజక వర్గాల నుంచి లబ్దిదారులను రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి ఆహ్వానించారు. తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల్లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే రూ.లక్ష రుణాన్ని మాఫీ చేసింది. తెలంగాణలో 11,34,412 మందికి రూ...

AP, TG CM’s Meeting | ఇద్ద‌రు సీఎం ల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు ఇవే..

Andhrapradesh, Telangana
AP, TG CM's Meeting | తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై హైద‌రాబాద్ లోని ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్‌ ‌రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈసంద‌ర్భంగా చంద్ర‌బాబుకు సిఎం రేవంత్‌ ‌పుష్పగుచ్ఛం అందించి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. చంద్రబాబు కూడా రేవంత్‌కు బొకే అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆ త‌ర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు, అధికారులు స‌మావేశ‌మ‌య్యారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల‌పై ఇద్ద‌రు సీఎంలు కీలక నిర్ణ‌యాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ను నియంత్రించేందుకు కమిటీలు వేయాలని నిర్ణయించిన‌ట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్ల‌డించారు. ప్రజాభవన్‌లో సీఎంల‌ సమావేశంలో చర్చించిన అంశాలను ఇరు రాష్ట్రాల మంత్రులు మీడియాకు వివ‌రించారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని తెలిపారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు స...

Rythu Runa Mafi | రుణ‌మాఫీకి ఆ కార్డు అవ‌స‌రం లేదు.. బంగారం తాకట్టు రుణాలకు వర్తించదు..

Telangana
Rythu Runa Mafi | గ‌త ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమ‌లు చేసి తీరుతామ‌ని సీఎం రేవంత్ ‌రెడ్డి (CM Revanth Reddy) మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. కాగా రుణమాఫీకి సంబంధించి ప్ర‌క్రియను ప్ర‌భుత్వం ఇదివ‌ర‌కే ప్రారంభించింది. ఢిల్లీలో శుక్ర‌వారం సీఎం రేవంత్‌ ‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామ‌ని చెప్పారు. పంట రుణాల మాఫీకి రేషన్‌ ‌కార్డు ఏమాత్రం ప్రామాణికం కాదని అన్నారు. అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ చేయబోమ‌ని తేల్చి చెప్పారు. కేవ‌లం ప‌ట్టా పాస్‌ ‌బుక్‌ ఆధారంగానే రుణమాఫీ (Rythu Runa Mafi) ఉంటుందని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై ఆస‌క్తిక‌...
Exit mobile version