Registration Charges | నవంబర్లో రిజిస్ట్రేషన్ పెంచనున్న ప్రభుత్వం?
Registration Charges | తెలంగాణలో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. నవంబర్ నుంచి సవరించిన చార్జీలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే నిజానికి వ్యవసాయ, వ్యవసాయేతర, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు కొత్త ధరలను ఆగస్టు 1 నుంచే అమలు చేయాలని భావించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జూన్లో షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. అధికారులు జిల్లాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి జూలైలో నివేదిక అందజేశారు. కాగా ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదించలేదు. ఈ క్రమంలో ధరల సవరణపై అధ్యయన బాధ్యతలను ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే నంబర్ల వారీగా భూముల విలువను అధ్యయనం చేసి, ఎక్కడ ఎంత మేరకు పెంచే అవకాశం ఉందో, ఎక్కడ తగ్గించాల్సి ఉంటుందో సూచించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రైవేట్ సంస్థ అధ్యయనం తుది దశకు చేరిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల ద్వారా తెలిసింది.
హైదరాబాద్ ర...