Thursday, June 19Thank you for visiting

Tag: Rain updates

Rain Report | తెలంగాణను వీడని ముసురు.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ..

Telangana
Rain Report | వరుస వానలు రాష్ట్రాన్ని వీడడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా ముసురు కమ్ముకుంటుండడంతో ప్రజలు ఇండ్లను విడిచి బయటకు రావడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మరోసారి  వానలకు సంబంధించి అప్రమత్తం చేసింది. మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా  వర్షాలు కురుస్తాయని  వెల్లడించింది. Rain Report In Telangana : భారీ వర్షాలు ముఖ్యంగా  నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మెదక్‌లో ఈదురుగాలలతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌తో పాటు జగిత్యాల, మెదక్‌, సిరిసిల్ల, సిద్దిపేట, కరీ...

భారీ వర్షాలతో తెలంగాణ విలవిల

Telangana
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు రికార్డు స్థాయిలో కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఎనిమిది మంది చనిపోయారని సమాచారం. మూడు రోజుల రెడ్ అలర్ట్ తర్వాత, వాతావరణ శాఖ అనేక జిల్లాల్లో హెచ్చరిక స్థాయిని 'ఆరెంజ్' అలర్ట్  కు తగ్గించింది. గురువారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో లక్ష్మీదేవిపేట (ములుగు జిల్లా), చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి)లో వరుసగా 64.98 సెం.మీ, 61.65 సెం.మీ వర్షపాతం నమోదైంది. నివేదికల ప్రకారం, గురువారం భారీ వర్షం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కనీసం ఎనిమిది మంది వ్యక్తులు వేర్వేరు సంఘటనలలో మరణించారు. మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు పి.యాకయ్య, పి శ్రీనివాస్ వాగులో కొట్టుకుపోగా, హనుమకొండలో లైవ్ వైరు తగిలి ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. కరీంనగర్‌కు చెందిన ఎం.వెంకటేష్ (23) సబితం జలపాతంలో జారిపడి గల్లంతయ్యాడు. హనుమకొండలోని గోపాలపూర్‌కు చెందిన జి రాజు నీటిలో కొట్టుకుప...
Exit mobile version