Thursday, June 19Thank you for visiting

Tag: Rahul Gandhi

Congress Manifesto | కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ఐదు గ్యారంటీలు, 25 కీలక హామీలు ఇవే..

National
Lok Sabha Elections Congress Manifesto: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీ పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 25 హామీలను వెల్లడించింది. 48 పేజీల మేనిఫెస్టోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ శుక్ర‌వారం విడుదల చేశారు. సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారెంటీలు చేర్చింది. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్ర‌క‌టించింది. దేశ వ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించింది. రిజర్వేషన్‌లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామ‌ని హామీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా నియంత్రిస్తామ‌ని హామీ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల 2024 న్యూస్ లైవ్: కాంగ్రెస్ శుక్రవారం తన పోల్ మేనిఫెస్టో (Congress Manifesto) ను విడుదల చేసింది, రాబోయే ఐదేళ్లకు తన విజన్ డాక్యుమెంట్‌ను ఆవ...

K Surendran against Rahul Gandhi : వ‌య‌నాడ్ ల్ రాహుల్ గాంధీ పోటీగా బరిలో ఉన్న కె.సురేంద్రన్ ఎవరు?

National
Lok Sabha elections 2024 | కేర‌ళ‌లోని వయనాడ్ (Wayanad) లో కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢీకొట్టేందుకు బ‌ల‌మైన అభ్య‌ర్థిని బిజెపి బ‌రిలో దింపింది. ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్న కేరళలో లోక్‌సభ ఎన్నికలకు మరో నలుగురు అభ్యర్థులను ఆదివారం బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలోని 20 స్థానాల్లో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 16 ఇతర స్థానాలకు అభ్యర్థులను ముందుగా ప్రకటించింది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌లు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్ర‌క‌టించాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్.. అలాగే సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ పై ఆధిపత్యం సాధించేందుకు బిజెపి కొన్ని ద‌శాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. ఈసారి ఎన్నిక‌ల్లో 12 స్థానాలకు బీజేపీ త‌న అభ్యర్థులను ముందుగా పార్టీ ప్రకటించింది. దాని మిత్రపక్షమైన బీడీజేఎస్ రాష్ట్రంలో నాలుగు స్థానాల్లో పోట...

Most Popular Cm | దేశంలోనే అత్యంత పాపులర్‌ సీఎం ఎవరు.?

National
Most Popular Cm | దేశంలోనే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ముఖ్య‌మంత్రిగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ నిలిచారు. ఎక్స్ (ట్విట‌ర్‌) ఖాతాలో దేశ‌వ్యాప్తంగా మిగ‌తా సీఎంల కంటే ఎక్కువ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు యోగీ. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మైలురాయిని దాటింది. యోగి తరువాతి స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ ఎక్స్ అకౌంట్‌ను 27.3 మిలియన్ మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇక వీరిద్ద‌రి కంటే ముందు 24.8 మిలియన్ ఫాలోవర్లతో రాహుల్ గాంధీ ఉన్నారు. భారత్ లో మోస్ట్‌ పాపులర్‌ సీఎంగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఘ‌న‌తికెక్కారు. భారత్‌లో మిగ‌తా సీఎంల కంటే అధికంగా ఎక్స్ ఖాతాలో ఫాలోవర్లను క‌లిగి ఉన్నారు. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మార్కు దాటేసింది. ఇక‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యోగి తర్వా...

Assembly Elections 2023: ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి..

National
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 7 నుండి 30 వరకు ఈ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party (BJP), ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా పరిగణించవచ్చు. ABP News- CVoter విడుదల చేసిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేయగా, రాజస్థాన్‌లో బీజేపీ కమలం అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. సర్వే(survey ) వివరాలను ఒకసారి చూడండి.. తెలంగాణ: ఒపీనియన్ పోల్ (opinion polls) ఆధారంగా తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 119 సీట్ల అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు 43 నుంచి 55 సీట్లు వస్తాయని అంచనా వేయగా, కాంగ్రెస్‌(congress)క...
Exit mobile version