ఆ స్కూల్ లో పిల్లలు మధ్యాహ్నం పడుకుండే ఫీజు బాదుడే.. డెస్క్, చాపలు, బెడ్స్ ఇలా ఒక్కోదానికి ఒక్కోరేటు
china: చైనాలోని ఒక ప్రైవేట్ ప్రైమరీ స్కూల్, గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని జిషెంగ్ ప్రైమరీ స్కూల్ కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టి కొత్తరూల్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తరగతిగదుల్లో నిద్రపోయే పిల్లల కోసం అదనంగా ఫీజులు వసూలు చేయనున్నట్ల ప్రకటించింది.
హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా సంస్థ నివేదించిన ప్రకారం, చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ వీచాట్ (WeChat) లో పాఠశాల నోటీసు స్క్రీన్షాట్ షేర్ చేసింది. అందులో ఛార్జీలను వివరించకుండా అనుబంధ రుసుములతో వసూలు చేయనున్నట్లు ఉంది.
ఆ నోటీసు ప్రకారం, డెస్క్పై పడుకుంటే 200 యువాన్లు (US$28) వసూలు చేస్తారు. అయితే, తరగతి గదుల్లో చాపలపై నిద్రించడానికి విద్యార్థులకు 360 యువాన్లు (US$49.29) ఖర్చవుతుంది. ప్రైవేట్ గదులలో బెడ్లపై నిద్రిస్తే మొత్తం 680 యువాన్లు (US$93.10) ఖర్చు అవుతుందని పేర్కొని ఉంది. విద్యార్థులను చూసేందుకు ఉపాధ్...