Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Prayagraj

Maha Kumbh ends today | ఘనంగా ముగిసిన మహా కుంభమేళా..   45 రోజులు, 65 కోట్ల మంది భక్తులు, రూ. 3 లక్షల కోట్ల ఆదాయం, ఖర్చులు & మరిన్ని
Trending News

Maha Kumbh ends today | ఘనంగా ముగిసిన మహా కుంభమేళా.. 45 రోజులు, 65 కోట్ల మంది భక్తులు, రూ. 3 లక్షల కోట్ల ఆదాయం, ఖర్చులు & మరిన్ని

Maha Kumbh ends today : మహాకుంభ్ 2025 ప్రత్యక్ష ప్రసారం: ప్రపంచంలోనే అతిపెద్ద భ‌క్త‌ సమ్మేళనమైన మహాకుంభమేళా నేడు మహాశివరాత్రి పుణ్య‌స్నానంతో ముగియనుంది. మహాకుంభ‌మేళా ఐదు పవిత్ర స్నానాలకు వేదికైంది, వాటిలో మూడు అమృత స్నానాలు. జనవరి 14న మకర సంక్రాంతి, జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న బసంత్ పంచమి అమృత స్నానాలు, జనవరి 13న పౌస్ పూర్ణిమ, ఫిబ్రవరి 12న మాఘ‌ పూర్ణిమ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి ఇతర ముఖ్యమైన స్నాన రోజులు. మ‌హాకుభ‌మేళా ఉత్స‌వాన్ని విజయవంతం పూర్తి చేయ‌డంలో యూపి ప్ర‌భుత్వం స‌ఫ‌లీకృత‌మైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా 45 రోజుల ఉత్స‌వాల‌ను ముగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు త‌మ క్షేమం కోరుతూగంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్య స్నానాలు ఆచ‌రించారు. ఈ గొప్ప కార్యక్రమం నేడు ముగిసింది. Maha K...
National

Mahakumbh 2025 | 60 కోట్లు దాటిన కుంభ‌మేళా భ‌క్తులు.. ముగింపు ద‌శ‌లోనూ త‌గ్గ‌ని జోరు

Mahakumbh 2025 | ప్రయాగ్‌రాజ్‌(Prayagraj) లో కుంభమేళా త్వరలో ముగియనున్నందున, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. మహా కుంభమేళాలో ఊహించని విధంగా 60 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మహాకుంభమేళా ప్రారంభమైనప్పుడు, ప్రభుత్వం 45 కోట్ల మంది వస్తారని అంచనా వేసింది, కానీ ఆ సంఖ్య ఇప్పటికే 60 కోట్లను దాటింది. Mahakumbh 2025 : 65 కోట్ల మార్కు దాటుతుందా? ఫిబ్రవరి 26న జరిగే చివరి 'అమృత స్నానం' నాటికి భక్తుల సంఖ్య 65 కోట్లను దాటుతుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలోని 110 కోట్ల మంది హిందువుల‌లో సగానికి పైగా పవిత్ర సంగమంలో స్నానం చేశారని అధికారిక ప్రకటన తెలిపింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 వరకు...
National

Kumbh Mela 2025 : మహా కుంభమేళా గురించి మీరు తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు

Kumbh Mela 2025 : ప్రయాగ్‌రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ప్ర‌పంచంలోనే అతిపెద్ద జాత‌ర ప్రారంభ‌మైంది. మహా కుంభం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మూడు పవిత్ర నదులైన గంగా, యమునా, సరస్వతి న‌దులు ప్ర‌యాగ్ రాజ్ (Prayag Raj) లో క‌లుస్తాయి అందుకే దీనిని త్రివేణి సంగ‌మం (Triveni Sangam) అని పిలుస్తారు..మహా కుంభ్‌లో మూడు రాజ స్నానాలు (అమృత్ స్నాన్), మూడు ఇతర స్నానాలతో సహా ఆరు పుణ్య‌స్నానాలను ఆచ‌రిస్తారు. జనవరి 13, 2025: పౌష్ పూర్ణిమ, జనవరి 14, 2025: మకర సంక్రాంతి (మొదటి అమృత స్నాన్), జనవరి 26, 2025: మహా శివరాత్రి (చివరి స్నాన్), జనవరి 29, 2025: మౌని అమావాస్య (రెండవ అమృత స్నాన్). ఫిబ్రవరి 3, 2025: బసంత్ పంచమి (మూడవ అమృత స్నాన్), ఫిబ్రవరి 12, 2025: మాఘి పూర్ణిమ, ప్రయాగ్ రాజ్ కు 40 కోట్ల మంది భక్తులు? మహా కుంభమేళా, కుంభమేళా మధ్య ప్రధాన వ్యత్...
National, Special Stories

Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావ‌డం మర్చిపోవద్దు..

Mahakumbh 2025 : హిందువులు ఎంతో ప‌విత్రంగా భావించే మహా కుంభమేళా వ‌చ్చేసింది. ఈ మ‌హా ఉత్స‌వంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు పవిత్ర ఘాట్‌లకు చేరుకుంటారు. ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ‌మేళా సందర్భంగా కోట్లాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. మహా కుంభం మొదటి రాజ స్నానం జనవరి 14న జరుగుతుందని తెలిసిందే.. మీరు కూడా మహా కుంభమేళాలో పాల్గొని, త్రివేణి ఘాట్‌లో స్నానం చేయాలనుకుంటే, మీరు తప్పనిసరిగా ప్రయాగ్‌రాజ్ నుంచి కొన్ని వస్తువులను తీసుకురావాలి. ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని వాస్తు దోషాల నుండి ఉపశమనం క‌లుగుతుంద‌ని చాలా మంది భ‌క్తులు నమ్ముతారు. త్రివేణి సంగమం ఇసుక గంగా ఘాట్ నేల ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మహా కుంభ్‌లో పాల్గొనబోతున్నట్లయితే, మీరు గంగా ఘాట్ ఇంటి నుండి తప్పనిసరిగా ప‌విత్ర‌మైన‌ మట్టిని తీసుకురావ‌చ్చు. మీరు ఈ మట్టిని తులసి మొక్కలో ...
Crime

Atul Subhash suicide case | అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య‌, త‌ల్లి అరెస్టు

Atul Subhash suicide case | బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. బాధితురాడి భార్య, ఆమె తల్లితోపాటు అత‌డి బావ‌మ‌రిదిని పోలీసులు అరెస్టు చేశారు. నికితను గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, ఆమె తల్లి, సోదరుడిని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) లో అరెస్టు చేశారు, ఆ తర్వాత వారిని బెంగళూరుకు తీసుకువచ్చి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతకుముందు శుక్రవారం.. బెంగళూరు సిటీ పోలీసులు (Bengaluru Police) అతని భార్య నికితా సింఘానియాకు సమన్లు ​​జారీ చేసి మూడు రోజుల్లోగా హాజరు కావాలని కోరారు. సబ్-ఇన్‌స్పెక్టర్ సంజీత్ కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బెంగళూరు సిటీ పోలీస్ బృందం ఈ ఉత్తరప్రదేశ్ జిల్లాలోని ఖోవా మండి ప్రాంతంలోని సింఘానియా నివాసానికి ఉదయం 11 గంటలకు చేరుకుంది. ఆమె సమన్ల కోసం నోటీసును అతికించారు. సర్కిల్ ఆఫీసర్ (సిటీ)...
Special Stories

Maha Kumbh Gram Tent City | మ‌హాకుంభ‌మేళాలో సకల సౌకర్యాలతో టెంట్ సిటీ..

Mahakumbh Mela 2025 : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) వచ్చే ఏడాది జరగనున్న మహాకుంభ మేళాను దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో "మహా కుంభ్ గ్రామ్" పేరుతో భారీ ప్రీమియం టెంట్ సిటీ (Maha Kumbh Gram Tent City) ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ విలాసవంతమైన సౌక‌ర్యాల‌తో గొప్ప సాంస్కృతిక అనుభూతితో ఈ టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నామ‌ని ఐఆర్‌సిటిసి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. భారతదేశ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని గౌరవించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. భ‌క్తులు, ప‌ర్యాట‌కులంద‌రికీ , సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తామ‌ని జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన కంపెనీ ఐఆర్‌సిటీసీ.. ప‌ర్యాట‌కుల కోసం ఆస్తా, భారత్ గౌరవ్ రైళ్లలో ఇప్పటి వరకు 6.5 లక్షల మంది ప్ర‌యాణికుల‌ను విజ...
National

Vande Bharat | 20 కోచ్ ల‌తో తొలి వందేభార‌త్ రైలు,.. ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య ప‌రుగులు..

Varanasi Vande Bharat Express : భారతదేశపు మొట్టమొదటి 20-కోచ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వారణాసి నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. న్యూఢిల్లీని వారణాసితో కలిపే ఈ రైలును ఇటీవ‌లేప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేకంగా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆపరేషన్‌తో, న్యూఢిల్లీ, వారణాసి మధ్య ప్రయాణీకులు ఇప్పుడు రెండు నగరాల మధ్య ఫాస్టెస్ట్ జ‌ర్నీని ఎంచుకోవచ్చు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అభివృద్ధి చేసిన ఈ కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 1,440 సీట్లను క‌లిగి ఉంటుంది. ఇది మునుపటి 16- లేదా 8-కోచ్ వెర్షన్‌లతో పోలిస్తే ఇందులో ఎక్కువ సీట్లు ఉంటాయి. రైలు 8 గంటల్లో 771 కి.మీ ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తర రైల్వే జోన్‌లో నడుస్తుంది 771 కి.మీ ప్రయాణాన్ని సుమారు 8 గంటల్లో కవర్ చేస్తుంది. ఇప్పటి వరకు, న్యూ ఢిల్లీ-వారణాసి మార్గంలో రెండు 20 కోచ్‌ల వందే భారత్ ...
Telangana

Indian Railways update | సికింద్రాబాద్ పరిధిలో ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారిమళ్లింపు

Indian Railways update :  దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా, కొన్ని రోజుల‌పాటు అనేక రైళ్లను ర‌ద్దు చేసింది. అలాగేకొన్ని రైళ్ల‌ను దారి మళ్లించింది. ఈ రైళ్లలో ప్ర‌ధానంగా సికింద్రాబాద్, రక్సాల్, హైదరాబాద్ పాట్నా మధ్య ప్రత్యేక సర్వీసులు ఉన్నాయి. రైలు నం. 07005 సికింద్రాబాద్-రక్సాల్ స్పెషల్ 2024 సెప్టెంబర్ 23, 30వ‌ తేదీల్లో రద్దు చేశారు. రైలు నం. 07006 రక్సాల్-సికింద్రాబాద్ స్పెషల్ 26 సెప్టెంబర్, అక్టోబర్ 3న రద్దు రైలు నం. 07051 హైదరాబాద్-రక్సాల్ స్పెషల్ 28 సెప్టెంబర్, అక్టోబర్ 5వ తేదీన‌ రద్దు రైలు నం. 07052 రక్సాల్-సికింద్రాబాద్ స్పెషల్ 2024 అక్టోబర్ 1, 8వ‌ తేదీల్లో రద్దు రైలు నం. 03253 పాట్నా-సికింద్రాబాద్ స్పెషల్ 23, 25, 30 సెప్టెంబర్, 2 అక్టోబర్ 2024 తేదీల్లో రద్దు రైలు నం. 07255 హైదరాబాద్-పాట్నా స్పెషల్ 25 సెప్టెంబర్, 2 అక్టోబర్ 2024న రద్దు రై...
Crime

Kalindi Express | రైల్వే ట్రాక్ పై గ్యాస్‌ సిలిండ‌ర్‌.. ఎక్స్‌ప్రెస్ రైలు ప‌ట్టాలు త‌ప్పించే కుట్ర‌..!

UtterPradesh | ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం అర్థరాత్రి ఎక్స్ ప్రెస్ రైలును కొంద‌రు దుండ‌గులు ఉద్దేశ‌పూర్వ‌కంగా ప‌ట్టాలు త‌ప్పించేందుకు య‌త్నించారు. ఇందుకోసం పట్టాలపై ఎల్‌పిజి సిలిండర్‌ను ఉంచారు. ఇదే స‌మ‌యంలో వ‌స్తున్న ప్రయాగ్‌రాజ్-భివానీ కాళింది ఎక్స్‌ప్రెస్  ( Prayagraj - Bhiwani Kalindi Express) సిలిండ‌ర్ ను ఢీకొన‌గా అది పాక్షికంగా ధ్వంస‌మై ప‌క్క‌కు జ‌ర‌గ‌డంతో పెను ప్ర‌మాదం తప్పింది. దీనిని 'రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం'గా పోలీసులు పేర్కొన్నారు. కాన్పూర్‌లోని శివరాజ్‌పూర్ వద్ద కాళింది ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంతో గమ్యస్థానం వైపు వెళుతుండగా సిలిండర్‌ను ఢీకొట్టింది. ఎల్‌పిజి సిలిండర్‌ను పట్టాలపై ఉంచి కాళింది ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించే ప్రయత్నం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్స్ బృందాన్ని పిలిపించారు. రైల...
Exit mobile version