రూ.170 కోట్లతో కరీంనగర్ – హుస్నాబాద్ మధ్య నాలుగు లైన్ల రహదారి..
Karimnagar - Husnabad Road | సిద్దిపేట, , కరీంనగర్ జిల్లా వాసులకు శుభవార్త.. త్వరలో సిద్ధిపేట జిల్లా కేంద్రం నుంచి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తికి రూ.170 కోట్లతో నాలుగు లైన్ల రహదారిని నిర్మించనున్నామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడించారు. హుస్నాబాద్ ప్రాంతం కరీంనగర్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట పట్టణాలకు 30 నుంచి 40 కిలోమీటర్ల లోపే ఉందని, ఇప్పటికే సిద్దిపేట - ఎల్కతుర్తి మధ్య ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణం పూర్తి కావస్తోందని, త్వరలోనే రూ.170 కోట్లతో హుస్నాబాద్ కరీంనగర్ ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణం చేపడతామని మంత్రి పొన్నం తెలిపారు. అంతేకాకుండా హుస్నాబాద్ - జనగామ (Husnabad-Janagama Road మధ్య ఫోర్ లైన్స్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని వెల్లడించారు. తద్వారా ఆయా జిల్లాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
హుస్నాబ...