Caste Census : దేశ వ్యాప్తంగా కుల గణన.. గతంలో ఎప్పుడు జరిగిందో తెలుసా?
Caste Census : దేశంలో కుల గణనసై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించింది. బుధవారం కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. భారతదేశం - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ఈ తరుణంలో ప్రభుత్వం చివరకు కుల గణన నిర్వహించడానికి అంగీకరించడం ఖచ్చితంగా ఆశ్చర్యకరమైనదే.. ప్రతిపక్ష పార్టీలు తరచుగా కుల గణనను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజగా పెద్ద నిర్ణయం తీసుకుంది.
భారత్ లో చివరిగా జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయి?
భారతదేశంలో చివరి జనాభా గణన 2011 లో జరిగింది. ఇది స్వతంత్ర భారతదేశంలో 7వ జనాభా గణన. ఇప్పటివరకు దీనిని దేశంలోని 15వ జనాభా లెక్కలుగా పరిగణిస్తున్నారు. 2011 జనాభా లెక్కలను 2 దశల్లో నిర్వహించారు. ఇందులో భారతదేశ మొత్తం జనాభా 121 కోట్లకు పైగా నమోదైంది. ఈ జనాభా లెక్కల్లో పురుషుల స...