Thursday, June 19Thank you for visiting

Tag: Pahalgam Attack

Tiranga Yatra | తిరంగా యాత్ర‌ను విజ‌య‌వ‌తం చేయండి

Telangana
కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి పిలుపు Tiranga Yatra in Hyderbad : పహల్గామ్ (Pahalgam) దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ (Operation Sindoor) విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో మ‌న వీర‌జ‌వాన్ల‌కు మద్దతు తెలుపుతూ శ‌నివారం ట్యాంక్ బండ్ వ‌ద్ద నిర్వ‌హించే తిరంగా యాత్ర‌ (Tiranga Yatra )ను విజ‌య‌వంతం చేయాల‌ని   బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Union Minister G.Kishan Reddy) పిలుపునిచ్చారు. శుక్ర‌వారం బిజెపి(BJP) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ దేశ సమగ్రతకు సవాలుగా నిలిచిన ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న‌కు  కారణమైన వారిని భారతదేశం వదిలిపెట్టేది లేదని, ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత ప్రధాని గట్టి హెచ్చరిక చేశార‌ని గుర్తుచేశారు. మే 6 రాత్రి ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు అత్యంత చాకచక్యంగా, సమర్థవంతంగా, ప...

Operation Sindoor : పాకిస్తాన్ జెట్ విమానాలను కూల్చిశాం..

National
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కొన్ని హైటెక్ ఫైటర్ జెట్‌ (Pakistani Planes)లను భారత్ కూల్చివేసిందని. దీనిని నిర్ధారించడానికి భారత వైమానిక దళం సాంకేతికంగా పరిశీలిస్తోందని ఆదివారం IAF ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత వైపు కూడా స్వల్పంగా నష్టాలు సంభవించాయని ఆయన పేర్కొన్నారు. అయితే మన ఫైటర్ పైలట్లు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారని చెప్పారు. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎయిర్ మార్షల్ ఎకె భారతి, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, వైస్ అడ్మిరల్ ఎఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారద పాల్గొన్నారు. "మా (PAF) విమానాలు మా గగనతలంలోకి ప్రవేశించకుండా నిరోధించబడినందున మా వద్ద శిథిలాలు లేవు. కానీ మేము కొన్ని విమానాలను కూల్చివేసాము. నా దగ్గర సంఖ్యలు ఉన్నాయి మరియు దానిని నిర్ధారించడానికి మేము సాంకేతిక వివరాలలోకి ప్రవేశిస్తున్నాము...

India Pakistan War | భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ క్షిపణులతో దాడులు..

National
దీటుగా స్పందించిన భారత రక్షణ వ్యవస్థలు India Pakistan War | పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం ఉగ్రవాదులకు దీటైన సమాధానం ఇచ్చింది. అదే సమయంలో, పాకిస్తాన్ కూడా భారతదేశంపై పిరికితనంతో దాడి చేసింది. పూంచ్‌లో జరిగిన దాడిలో సాధారణ పౌరులు మరణించారు. నిన్న రాత్రి పాకిస్తాన్ వైపు నుంచి భారతదేశంలోని అనేక నగరాలపై క్షిపణులు ప్రయోగించింది అయితే, భారత సైనిక వీరులు వాటన్నింటినీ గాల్లోనే నాశనం చేశారు. ప్రెస్ మీటింగ్‌లో అన్ని పరిణామాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని MEA పంచుకుంది.విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి(sofia qureshi), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (vyomika singh) పూర్తి వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష...

Indus water treaty | ఇకపై మన నదీ జలాలు భారత ప్రజల ప్రయోజనాల కోసమే ప్రవహిస్తాయి..

National
PM Modi on water issue : పహల్గామ్ దాడి (Pahalgam Terror Attack) తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల మధ్య, ప్రధాని మోదీ (PM Modi ) ఈరోజు నీటి సమస్య (Indus water treaty) పై కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో భారతదేశంలోని నీరు బయటకు వెళ్లేది. కానీ ఇప్పుడు దానిని భారతదేశ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు భారతదేశానికి హక్కుగా ఉన్న నీరు కూడా దేశం నుంచి బయటకు వెళ్లిపోయేదని ఆయన అన్నారు. ఇప్పుడు భారతదేశ జలాలు దేశ ప్రయోజనాల కోసమే ప్రవహిస్తాయి. దేశానికి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యగా సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలో నీటి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టలేదు. మునుపటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ముందు ప్రపంచం ఏమి చెబుతుందో ఆలోచి...

Jammu Kashmir : కశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట ముమ్మరం..

National
జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట నిర్విరామంగా సాగుతోంది. ఇదిలా ఉంటే పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను, పాక్‌ ‌తరలిస్తోందని పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇక పహల్గామ్‌ ‌నిందితుల్లో ఇప్పటికే ఆ నలుగురి లొకేషన్లను ట్రాక్‌ ‌చేయగా.. వారు త్రుటిలో తప్పించుకున్నారు. ఒకసారి భద్రతా దళాలు.. ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కూడా చోటుచేసుకొన్నాయి. ముఖ్యంగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్ ‌నెట్‌వర్క్ ఎప్పటికప్పుడు వారి లొకేషన్లను గుర్తిస్తున్నారు. వారు మా కనుచూపు మేరలోకి వచ్చినా.. కాల్పులు జరిపి తప్పించుకొంటున్నారు. ఇక్కడ అడవులు అత్యంత దట్టంగా ఉన్నాయి. మనకు కనిపిస్తున్నా.. ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. వారిని పట్టుకొని తీరతాం. కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉందని ఓ సైనిక అధికారి తెలిపారు. ఉగ్రవాదులను తొలుత అనంతనాగ్‌లోని పహల్గాం తెహస్లీ వద్ద గుర్తించారు. ...

Illegal immigrant : గుజరాత్‌లో 1000 మంది అక్రమ వలసదారులు అదుపులోకి..!

National
Ahmadabad : జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పాశవిక ఉగ్రదాడితో భారత ‌ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ‌నగరవ్యాప్తంగా శనివారం క్రైమ్‌ ‌బ్రాంచ్‌ అధ్వర్యంలో క్షుణ్ణంగా అనువణువు సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 400 మందికిపైగా అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 127 మంది బంగ్లా దేశీయులు అక్రమంగా దేశంలో నివసిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. విచారణ అనంతరం వారివారి ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామని అహ్మదాబాద్‌ - ‌బ్రాంచ్‌ ‌డీసీపీ అజిత్‌ ‌రాజియన్‌ ‌మీడియాకు వెల్లడించారు. అహ్మదాబాద్‌ ‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీ వలసదారులను (Illegal immigrant) పట్టుకోవడానికి ఈ కూంబింగ్‌ ఆపరేషన్‌ ‌నిర్వహించినట్లు డీసీపీ వివరించారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. దీంతో భారత్‌, ‌పాకిస్థాన్‌ ‌దేశాల మధ్య ఉద్రిక్...

Pahalgam Attack : శ్రీనగర్ లో 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లను ధ్వంసం చేసిన పోలీసులు

National
Pahalgam Attack : శ్రీనగర్‌లోని దాదాపు 64 మంది ఉగ్రవాద సహచరుల ఇళ్లపై జమ్మూ కాశ్మీర్ (Jammu And Kashmir) పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWలు), ఉగ్రవాదుల సహచరుల ఇళ్లపై విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నమోదైన కేసుల దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి (Pahalgam Attack) తర్వాత కాశ్మీర్‌లోని అధికారులు ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులపై భారీ స్థాయిలో దాడులు ప్రారంభించారు, ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశారు, వారి సురక్షిత స్థావరాలపై దాడులు చేశారు.అలాగే విచారణ నిమిత్తం వందలాది మంది అండర్ గ్రౌండ్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. JKలో ఉగ్రవాదుల ఇళ్ల నేలమట్టం గత 48 గంటల్లో అనేక మంది ఉగ్రవాదులు లేదా వారి సహచరుల ఇళ్లను కూల్చివేశారు. ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్న ఇతరు...

Pahalgam Attack : పాకిస్తాన్ కు చావు దెబ్బ.. ఇక యాక్షన్ లోకి దిగిన భారత్

National
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎదురుదాడి సింధు జల ఒప్పందం రద్దు, పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్లిపోవాలని ఆదేశం న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడి (Pahalgam Attack) కి భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్‌పై మోదీ ప్రభుత్వం తీవ్రమైన దౌత్య దాడిని ప్రారంభించింది, సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ కు చావు దెబ్బ చూపించాలని కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం తర్వాత ఐదు నిమిషాల మీడియా ప్రసంగంలో భారతదేశం ఐదు నిర్ణయాత్మక కఠినమైన ప్రతీకార చర్యలను ప్రకటించింది. అవి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం నుంచి పాకిస్తాన్ జాతీయులు దేశం విడిచి వెళ్లడానికి 48 గంటల గడువు జారీ చేయడం వరకు తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. అలాగే అట్టారి సరిహద్దు మూసివేస్తామని ప్రకటించింది.కీలకమైన దౌత్య మార్గాలను కట్ చేసి న్యూఢిల్లీ స్పష్టమై...
Exit mobile version