Wednesday, June 18Thank you for visiting

Tag: Old City Metro

Double Bedroom House | వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి నుంచే ప్రక్రియ షురూ..

Telangana
Double Bedroom House : హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్న నిరు పేదలకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మూసీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో నిర్వాసితుల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు లేదా ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా అండ‌గా ఉంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అర్హులైన పేదలను రోడ్డున పడే పరిస్థితుల‌ను తీసుకురావొద్ద‌ని సూచించారు. పేద‌ల‌కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అర్హులైన పేదలకు భరోసా కల్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చూడాల‌ని సూచించారు. ...

Old City Metro | 2029 నాటికి ఓల్డ్ సిటీకి మెట్రో కనెక్టివిటీ

Telangana
Old City Metro | హైదరాబాద్: వచ్చే నాలుగేళ్లలో పాతబస్తీకి హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్) కనెక్టివిటీని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు . 78 కిలోమీటర్ల మేర హెచ్‌ఎంఆర్ ఫేజ్-2 విస్తరణకు నిధులు సమకూర్చేందుకు కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, దీని వల్ల నగర జనాభాలో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన వెల్ల‌డించారు. ఇటీవ‌ల‌ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో రైల్, ఇప్పుడు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీ.. హెచ్‌ఎంఆర్‌ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేశామన్నారు. Old City Metro : జాయింట్ వెంచర్ కింద రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం ఖర్చు పెట్టాలని ప్రతిపాదించగా, 15 శాతం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. మిగిలిన వాటి...

Old City Metro Project : త్వ‌ర‌లో ఓల్డ్ ‌సిటీలో మెట్రో ప‌రుగులు.. మార‌నున్న రూపురేఖ‌లు

Telangana
Old City Metro Project : హైదరాబాద్‌లోని ‌పాత బస్తీ మెట్రో రైలు (Pathabasthi Metro Rail) మార్గానికి శుక్రవారం ఫరూక్‌ ‌నగర్‌ ‌డిపో వ‌ద్ద‌ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌ చేశారు. ఎంజీబీఎస్‌ ‌నుంచి ఫలక్‌ ‌నుమా వరకు మొత్తం 5.5 కిలోటర్ల పొడవున 4 మెట్రో స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని తెలంగాణ‌ ప్రభుత్వం చేపడుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఓల్డ్ ‌సిటీ కాదు.. ఒరిజినల్‌ ‌హైదరాబాద్‌.. అని అన్నారు. దీనిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతో మంది కష్టపడ్డారు.. ఆ గుర్తింపును కాపాడే బాధ్యత త‌మ‌ ప్రభుత్వంపై ఉందని తెలిపారు. మెట్రో స్టేష‌న్లు ఎక్క‌డ‌? మెట్రో లైన్‌ ఎంజీబీఎస్‌, ‌దారుల్‌ ‌షిఫా జంక్షన్‌, ‌పురాణా హవేలీ, ఇత్తేబాద్‌ ‌చౌక్‌, అలీ జాకోట్ల, ర్‌ ‌మోమిన్‌ ‌దర్గా, హరిబౌలీ, శాలిబండ, షంషీర్‌ ‌గ...
Exit mobile version