రేపు ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో మోదీ పర్యటన.. పట్టాలెక్కనున్న రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు..
PM Modi AP Tour | ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పర్యటించనున్నారు. విశాఖపట్నంలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులు సుస్థిర అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల పెంపుదల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రధాన కృషిలో ఒక భాగమని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది.
అలాగే గురువారం భువనేశ్వర్లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును కూడా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాజెకట్ఉలను ప్రారంభించేందుకు. విశాఖపట్నం ప్రజలను కలుసుకునేందుకు తాను ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఇటువంటి హబ్గా అ...