Wednesday, June 18Thank you for visiting

Tag: Nitish Kumar

Nalanda New Campus | నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌.. పర్యావరణానికి అనుకూలం.. ఇందులో వాహనాలు కనిపించవు..

Special Stories
Nalanda New Campus | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో బుధవారం ఉదయం నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, 17 దేశాల రాయబారులు పాల్గొన్నారు. నూతన క్యాంపస్ ను ప్రారంభించిన అనంతరం మొక్కను నాటారు. ప్రధాని మోదీ . పురాతన నలంద విశ్వవిద్యాలయం శిథిలాలను కూడా పరిశీలించారు. అంతకుముందు X లో PM Modi తన అభిప్రాయాలను పంచుకున్నారు.  "ఇది మన విద్యా రంగానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు, రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ప్రారంభమవుతుంది. నలందకు ఈ అద్భుతమైన భాగంతో బలమైన అనుబంధం ఉంది. కొత్త క్యాంపస్ లో ఏమున్నాయి? క్యాంపస్ రెండు అకడమిక్ బ్లాక్‌లుగా విభజించబడింది.  ఒక్కో బ్లాక్ లో 40 తరగతి గదులు ఉన్నాయి. మొత్తం సీటింగ్ కెపాసిటీ సుమారు 1900. ఇందులో రెండు ఆడిటోరియంలు ఉన్నాయి. ఒక్కొక్కటి 300 మంది సీటింగ్ కెపాసి...

Nalanda University | ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నలంద విశ్వవిద్యాలయం విశిష్టతలు ఇవే..

Special Stories
Nalanda University | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న న‌లంద యూనివ‌ర్సిటీలో కొత్త క్యాంప‌స్‌ను ఈరోజు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ (PM Modi) ఆవిష్క‌రించారు. అంత‌కు ముందు ప్ర‌ధాని మోదీ .. యునెస్కో వార‌స‌త్వ క‌ట్ట‌డమైన‌ న‌లంద మ‌హావీర‌ను సంద‌ర్శించారు. నలంద విశ్వ‌విద్యాలయానికి సంబంధించిన‌ పురాతన శిథిలాలకు 20 కి.మీ కంటే తక్కువ దూరంలోనే ఈ కొత్త క్యాంప‌స్‌ ఉంది. ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం. ఈ పురాతన విశ్వ‌విద్యాల‌యాన్ని 427 CEలో కుమారగుప్త చక్రవర్తి స్థాపించాడు. ఎనిమిది శతాబ్దాలకుపైగా నలంద విజ్ఞాన దీవిగా వర్ధిల్లింది. ఎంతో అనుభ‌వ‌జ్ఞ‌లైన వేద‌పండితులు ఇక్క‌డ బోధించేవారు. చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, శ్రీలంక, ఆగ్నేయాసియా వంటి సుదూర ప్రాంతాల నుండి 2,000 మంది ఉపాధ్యాయులు, 10,000 మంది విద్యార్థులతో అద్భుతమైన ఈ విద్...

Lok Sabha Speaker | లోక్ సభ స్పీకర్ ఎన్నిక 26న

National
Lok Sabha Speaker election : లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రెండు రోజుల తర్వాత జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే స్పీకర్ అభ్య‌ర్థిని ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరుగుతాయని కొత్తగా చేరిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. రిజిజు ప్రకారం, సెషన్‌లో మొదటి మూడు రోజులు కొత్తగా ఎన్నికైన నాయకులు ప్రమాణ స్వీకారం చేయడం.. లోక్‌సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించడం, సభ స్పీకర్‌ను ఎన్నుకోవడం జ‌రుగుతుంది. జూలై 3న సెషన్‌ ముగుస్తుంది. జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని భావిస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మా...

Modi Oath Ceremony : ప్రధాని మోదీ తోపాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే నేతల జాబితా ఇదే..

National, తాజా వార్తలు
Modi Oath Ceremony Live : నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కొన్ని గంటల ముందు,బీజేపీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలను దేశ రాజధానిలోని ప్రధానమంత్రి ఇంటికి  తేనీటి విందుకు ఆహ్వానం అందింది. వీరిలో ఎక్కువ మంది సభ్యులు ప్రధానమంత్రి మంత్రివర్గంలో చేరి ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, రాజ్‌నాథ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, జేడీ(ఎస్) నేతలు హెచ్‌డీ కుమారస్వామి వంటి సీనియర్ నేతలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న ఎంపీల జాబితా నితిన్ గడ్కరీ (మ‌హారాష్ట్ర ) రాజ్‌నాథ్ సింగ్ (ఉత్త‌ర‌ప్ర‌దేశ్) పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా కిరణ్ రిజిజు హెచ్‌డి కుమారస్వామి (క‌ర్నాట‌క‌) చిరాగ్ పాశ్వాన్ (బిహార్‌) రామ్ నాథ్ ఠాకూర్ జితన్ రామ్ మాంజీ జయంత్ చౌదరి అనుప్రియా పటేల్ ప్రతాప్ రావ్ జాదవ్ (SS)...

Nitish Kumar NDA Meeting | నేను ఎప్పుడూ ప్రధాని మోడీతోనే ఉంటా : నితీష్ కుమార్ 

National
Nitish Kumar NDA Meeting | న్యూఢిల్లీ: ఎన్డీఏ (NDA) పక్షనేతగా ప్రధాని మోదీ పేరును (PM Modi) రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish kumar) , చంద్ర‌బాబు స‌హా, మిగతా ఎన్డీఏ పక్ష సభ్యులు న‌రేంద్ర‌ మోదీని బలపరిచారు. ఈ సందర్భంగా నితీశ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డీఏ.. కొత్తగా ఎన్నికైన ఎంపిల సమావేశం దిల్లీలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నితిష్ కుమార్ మాట్లాడుతూ.. ఇండియా కూట‌మికి పొర‌పాటున ఎక్కువ సీట్లు వ‌చ్చాయ‌ని, ఈ బృందం "ఏ పని చేయలేదని పేర్కొన్నారు. "నేను అన్ని వేళలా ప్రధానమంత్రితో ఉంటాను" అని కూడా ప్రకటించారు. నితీష్ కుమార్ మోడీకి మద్దతు ప్రకటించడం.. ఒక‌వైపు ఇండి కూటమి ఆశ‌ల‌కు గండిప‌డిన‌ట్లైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇద్దరు కింగ్‌మేకర్లు అవతరించారు. JDU నుండి 12 మంది. చంద్రబాబు నాయుడు TDP నుంచి 16 మంది ఎంపీల మ‌ద్ద‌తుతో ఎన్ డీఏ ప్ర‌భుత్వాన్ని ...

Nitish Kumar | బీహార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గెలిచిన సీఎం నితీశ్‌..

National
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేసినప్పటికీ 130 మంది శాసనసభ్యులు ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. కాగా బీహార్ అసెంబ్లీలో 243 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. JD(U), RJD, కాంగ్రెస్ ఫ్రంట్ అయిన మహాఘటబంధన్ (మహాకూటమి) నుండి నితిష్‌ కుమార్ BJP నేతృత్వంలోని NDA కూటమిలోకి చేరిన విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలో సోమ‌వారం అవిశ్వాస ప‌రీక్ష‌లో నితిష్ గెలిచారు. ఈ సెషన్‌లో ముగ్గురు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) ఎమ్మెల్యేలు ప్రహ్లాద్ యాదవ్, నీలం దేవి, చేతన్ ఆనంద్ ఎన్డీఏలోకి మారారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. తాను తీసుకొచ్చిన కార్యక్రమాలను ఆర్జేడీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందని, 15 ఏళ్లుగా లాలూ ప్రసాద్, రబ్రీ దేవి ప్రభుత్వాలు బీహార్ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు. 2005లో తాను అధికారంలోకి వచ్చినప్...

Nitish Kumar : 9వసారి సీఎం అయిననితీష్ కుమార్.. బీహార్ లో కీలక పరిణామాలు

National
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం 9వ సారి ప్రమాణస్వీకారం చేశారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. తాను ఉన్న చోటికి తిరిగి వచ్చానని చెప్పారు. 2020లో, రాష్ట్రంలో JD(U)-NDA కూటమి అధికారంలోకి వచ్చింది. 2022లో కూటమి నుంచి వైదొలిగి జేడీ(యూ)-ఆర్జేడీ (RJD) మహాఘటబంధన్‌కు సీఎం అయ్యారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీయేలోకి వెళ్లిపోయారు. "నేను ఇంతకు ముందు (ఎన్‌డిఎలో) ఉన్న చోటికి ఇప్పుడు తిరిగి వచ్చాను. ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళే ప్రశ్నే లేదు" అని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. Bihar Political Crisis : లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ‍ కూటమిని నుంచి దూరంగా ఉండటంఆర్జేడీకి పెద్ద దెబ్బ. దీనిపై మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ స్పందిస్తూ.. బీహార్‌లో ఆట ఇంకా ముగియలేదు. జెడి(యు) 2024లో ముగుస్తుందని, నితీష్‌ కుమార్‌ను 'అలసిపోయిన ముఖ్యమంత్రి' అని తేజస్వి విమర్శించారు. నితీష్‌ కుమార్‌...

Bihar Politics LIVE Updates : Bihar | సీఎం ప‌ద‌వికి నితీశ్ రాజీనామా.. జేడీయూతో కలవాలని బీజేపీ ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం

National
  Bihar Politics LIVE Updates | పాట్నా : జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆర్డేజీతో బంధం తెంచుకున్న నితీశ్ కుమార్.. బీజేపీతో క‌లిసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జేడీయూ-బీజేపీ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం వరకు కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీలో ఎవ‌రికి ఎన్ని సీట్లు ఉన్నాయి? ప్ర‌భుత్వం ఏర్పాటుకు కావాల్సిన స‌భ్యుల సంఖ్య జేడీయూ వ‌ద్ద ఉన్నదా? అనే అంశాల‌ను ప‌రిశీలిద్దాం. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.. ఆర్జేడీ పార్టీ నుంచి 79 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.. మ‌రో వైపు 78 మంది ఎమ్మెల్యేల‌తో బీజేపీ రెండో అతి పెద్ద పార్టీగా ఉంది. జేడీయూకు కేవ‌లం 45 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ...
Exit mobile version