2025 New Year celebrations : నూతన సంవత్సరం వేళ బెంగళూరు మెట్రో కొత్త అప్డేట్
2025 New Year celebrations : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్రయాణికులకు బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) గుడ్న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31, 2024న పర్పుల్, గ్రీన్ లైన్లలో విస్తరించిన మెట్రో రైలు సేవలను విస్తరించింది. మెట్రో రైళ్లు డిసెంబర్ 31న అర్ధరాత్రి నుంచి జనవరి 1, 2025న తెల్లవారుజామున 2:00 గంటల వరకు నడుస్తాయి. నాడప్రభు నుంచి చివరి రైలు సర్వీస్ కెంపేగౌడ మెట్రో స్టేషన్ (మెజెస్టిక్) కు 2:40 AMకి చేరుకుంటుంది.
BMRCL (Bangalore Metro ) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, డిసెంబర్ 31, 2024న రాత్రి 11 గంటల నుంచి ప్రతీ 10 నిమిషాల వ్యవధిలో మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. పెద్ద సంఖ్యలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా MG రోడ్ మెట్రో స్టేషన్లో రాత్రి 11 గంటల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు మూసివేయనున్నారు. ప్రయాణికులు బదులుగా కబ్బన్ పార్క్, ట్రినిటీ వంటి సమీపంలోని స్టే...