Thursday, June 19Thank you for visiting

Tag: Narendra Modi

Mahant Balak Nath | యోగి ఆదిత్యానాథ్ తరహాలో మరో సన్యాసికి బీజేపీ పట్టం?

National
రాజస్తాన్ లో మరో యోగీ.. సీఎం పదవి రేసులో మహంత్ బాలక్ నాథ్.. Rajasthan Assembly Election: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోయింది. విజయం దాదాపు ఖరారయ్యింది. కాగా.. ఊహించని విధంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి రేసులోకి ఓ సన్యాసి తెరపైకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజస్తాన్ లో బీజేపీ విజయం ఖాయమైన క్రమంలో ఇప్పుడు సీఎం ఎవరు అవుతారనేదానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే సీఎం రేసులో వసుంధర రాజే ముందుండగా మరోవైపు మహంత్ బాలక్ నాథ్ (Mahant Balak Nath) కూడా తెరపైకి వచ్చారు. ఆయనకు ఆర్ఎస్ఎస్, బీజేపీ అధిష్ఠానం ఆశీస్సులు ఉండడండంతో అనూహ్యంగా ఈ రేసులోకి దూసుకువచ్చారు. 40 ఏళ్ల మహంత్ బాలక్ నాథ్ రాజస్తాన్ (Rajasthan) లోని అల్వార్ నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తిజార (Tijara) సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. ఆయన రాజస్తా...

Bharat Atta: కేంద్రం గుడ్‌న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు

National
Bharat Atta: పెరుగుతున్న గోధుమల ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు దీపావళి వేళ కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళికి ముందు దేశవ్యాప్తంగా 'భారత్ అట్టా' బ్రాండ్ పేరుతో కిలోకు రూ. 27.50 రాయితీపై గోధుమ పిండిని విక్రయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 'భారత్ అట్టా'ని దేశంలోని 800 మొబైల్ వ్యాన్లు, 2,000 కంటే ఎక్కువ అవుట్ లెట్ల ద్వారా సహకార సంస్థలైన నాఫెడ్, ఎన్ సిసిఎఫ్, కేంద్రీయ భండార్ ద్వారా విక్రయించనున్నట్లు వెల్లడించింది. 'భారత్ అట్టా' రాయితీపై అందుబాటులో ఉంటుంది, కాగా గోదుమ పిండి ధర నాణ్యత, ప్రదేశాన్ని బట్టి ప్రస్తుతం మార్కెట్ ధర రూ. 36-70 లోపు ఉంటుంది. ప్రతిచోటా ఆటా ధరల స్థిరీకరణ నిధి పథకంలో భాగంగా కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో 18,000 టన్నుల 'భారత్ అట్టా'ని కిలోకు రూ. 29.50 చొప్పున ఈ సహకార సంస్థల ద్వారా ప్రయోగాత్మకంగా విక్రయించింది. 'భారత్ అట్టా' ను కు సంబంధించిన 100 మొబైల్ వ్...

భారతదేశపు మొట్టమొదటి, వేగవంతమైన రైల్ RAPIDX Train వస్తోంది..

Trending News
దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో అనతికాలంలోనే విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వందే భారత్‌ సెమీ హైస్పీడ్ రైళ్లు వచ్చిన కొద్దిరోజుల్లోనే సూపర్ సక్సెస్ గా రన్ అవుతున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు మధ్యతరగతి ప్రయాణికుల కోసం వందేభారత్ సాధారణ్ పేరుతో స్లీపర్ కోచ్ లతో రైళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో మరో కీలక ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఢిల్లీ ఎన్‌సిఆర్‌(Delhi-NCR)లో భారతదేశపు మొట్టమొదటి అత్యంత వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థ ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌ (RAPIDX Train)ను ప్రధాని నరేంద్రమోదీ వచ్చే వారం ప్రారంభించనున్నారు. నవరాత్రి పర్వదినాల్లోనే పట్టాలెక్కనున్న ఈ ట్రైన్‌ను పూర్తిగా మహిళలు నడపనుండటం విశేషం. పూర్తిగా మహిళా పైలట్లే.. దేశంలోనే మహిళా పైలట్లతో ప్రారంభోత్సవం జరుపుకుంటున్న తొలి ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌గా చరిత్రలో నిలిచిపోనుంది. దేశ రాజధానిలో...

తెలంగాణలో రూ.21,566 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Telangana
అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి రూ.21,566 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో అక్టోబర్‌ 1, 3 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రూ.21,566 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (G.Kirshan Reddy) శుక్రవారం తెలిపారు. తన మహబూబ్‌నగర్ పర్యటనలో మోదీ రూ.13,545 కోట్లతో ప్రాజెక్టులను ప్రారంభిస్తారని, నిజామాబాద్‌లో రూ.8,021 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తానని విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ (PM Modi) రెండు చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ...

మరో అద్భుత కళాత్మక నిర్మాణం యశోభూమి.. దీని ప్రత్యేకతలు ఏమిటీ?

National
ఢిల్లీలో అంతర్జాతీయస్థాయ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో  సెంటర్ 8 అంతస్తుల్లో కన్వెన్షన్ హాళ్లు, బాల్ రూం, మీటింగ్ హాల్స్ 8.9లక్షల చదరపుమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన కేంద్రం 17న ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం న్యూఢిల్లీ : అత్యంత ఆకర్షణీయ నిర్మాణాలు, పర్యాటక క్షేత్రాలకు నిలయమైన ఢిల్లీలో మరో అద్భుత నిర్మాణం యశోభూమి (YashoBhoomi) అందుబాటులోకి వస్తోంది. సెప్టెంబరు 17వ తేదీ ఆదివారం నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యశోభూమి పేరుతో నిర్మించిన అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించి, దేశానికి అంకితం చేయనున్నారు. ఇది ఫేజ్ 1 ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసిసి) 'అని పిలుస్తారు. దేశంలో సమావేశాలు, ప్రదర్శనలను నిర్వహించేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ప్రధానమంత్రి ఆలోచనతో ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. మొత్తం 8.9 లక్షల చదరపు మీటర్ల ప్రా...

తెలంగాణ కు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు

Telangana
హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే తాజాగా తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు(Vande Bharat Express)ను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్ నుంచి తరచుగా బెంగళూరుకు ప్రయాణించే వారి కోసం కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య కొత్తగా వందే భారత్ (VB) ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) రంగం సిద్ధం చేస్తోంది . ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఈ నెలాఖరులో వర్చువల్ మోడ్‌లో తాజా VB ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అయితే SCR అధికారులు ఇంకా లాంచ్ ఈవెంట్ గురించి అధికారికంగా వివరాలను వెల్లడించలేదు. కాగా కాచిగూడ - యశ్వంత్‌పూర్ మధ్య VB ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి ప్రవేశపెట్టబడిన మూడవ రైలు అవుతుంది. గతంలో ప్రారంభించిన మొదటి రెండు VB ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం తిరుపతికి ప్రవేశపెట్టారు.. కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు జరు...
Exit mobile version