DA Hike | ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక ..
DA Hike : దీపావళి పండుగకు కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది. అంతకంటే ముందే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం (Narendra Modi Govt) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. మోదీ ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుక ఇచ్చింది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (dearness allowance) ను 3 శాతం పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం జనవరి, జూలైలో ఏడాదికి రెండుసార్లు డీఏను అంచనా వేసి, సర్దుబాటు చేసి, ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుంది. చివరిసారి, మార్చిలో 4 శాతం ప్రకటించగా ఇది జనవరి 2024 నుండి అమలులోకి వచ్చింది.
దాదాపు 52 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు లబ్ధి
ఇప్పటి వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో 50 శాతం డీఏకు అర్హులు కాగా, పెన్షనర్లు తమ ప్రాథమిక పెన్షన్...