Tuesday, March 4Thank you for visiting

Tag: mulugu

TGSRTC : ఈ రెండు జిల్లాలో కొత్త ఆర్టీసీ బస్ డిపోలు..

Telangana
TGSRTC | తెలంగాణ ఆర్టీసీని ముందుకు నడిపించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. ఆర్టీసీలో త్వరలో నియామకాలు ఉంటాయని ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రకటించారు. అలాగే కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నారు. అద్దె బస్సుల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రాజధాని నగరంలో  కాలుష్యాన్ని నియంత్రించేందుకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్  బస్సులను కూడా ప్రారంభించారు.  మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా  ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. పెద్దపల్లి,  ములుగులో కొత్త బస్ డిపోలు తాజాగా తెలంగాణలో కొత్తగా రెండు ఆర్టీసీ (TGSRTC) బస్ డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.  గత 15 సంవత్పసరాలుగా రాష్ట్రంలో ఒక్క కొత్త బస్సు డిపో కూడా ఏర్పాటు చేయలేదని ఆయన గు...

Telangana Cabinet | ములుగు గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు.. మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం

Telangana
Telangana Cabinet Decisions : సచివాలయంలో  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ప్రధానంగా మూసీ ప్రక్షాళన చర్యలు, హైడ్రా, ఉద్యోగుల డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, బోనస్ చెల్లింపు,  కొత్త రేషన్‌ కార్డుల జారీ తదితర అంశాలపై  మంత్రివర్గం చర్చించింది. దీంతోపాటు పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా ఏటూరునాగాారాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మద్నూరు మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా  అప్‌గ్రేడ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పరిధి పెంచాలని తీర్మానించారు. అలాగే ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్...

Medaram Maha Jatara 2024 : మేడారం జారతరకు వెళ్తున్నారా? అయితే ఈ ఆలయాలను మిస్ కావొద్దు..

Special Stories
Medaram Maha Jatara 2024 Updates: సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారం జాతరకు వెళ్తున్నారా…? అయితే జాతర ప్రాంగణంలో సమ్మక్క - సారక్క గద్దెలనే కాకుండా మరెన్నో చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి.  ఆ వివరాలను ఇక్కడ చూడండి…. Medaram Sammakka Sarakka Maha Jatara 2024: మేడారం మ‌హాజాత‌రకు భక్తులు పోటెత్తుతున్నారు. వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, మ‌ధ్య‌ప్ర‌దేశ్ క‌ర్ణాట‌క త‌దిత‌ర ప్రాంతాల నుంచి ల‌క్ష‌లాదిగా భ‌క్తులు ఇక్క‌డికి త‌ర‌లివ‌స్తారు. కాగా మేడారం వ‌చ్చే భక్తులు సమ్మక్క, సారలమ్మ గద్దెలు, జంపన్న‌వాగు, తోపాటు ఇక్క‌డి స్టాళ్లు, ఎగ్జిబిష‌న్లను చూసి వెళ్తుంటారు. అయితే ఇవే కాకుండా మేడారం ప్రాంతంలో ఇంకా చూడాల్సిన‌వి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా జంపన్న గద్దె, నాగులమ్మ గద్దెలను కూడా ద‌ర్శించుకోవ‌చ్చు. జాతరలో మూడు, నాలుగు రోజులు గడిపే భక్తుల...
Exit mobile version