Thursday, June 19Thank you for visiting

Tag: Muhammad Yunus

Bangladesh Crisis | బంగ్లాదేశ్ పై కారు చీకట్లు.. పీకల్లోతు అప్పులు.. అదానీ గ్రూపునకు 800 మిలియన్ డాలర్లు..

World
Adani Group | షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత బంగ్లాదేశ్‌లో ఆర్థిక సంక్షోభం (Bangladesh Crisis) తీవ్రమవుతోంది. తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్ ఇటీవల రుణాల కోసం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)తో పాటు పలు చోట్ల తలుపులు తట్టారు. ఇప్పుడు అతడి ముందు మరో కొత్త ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్ సరఫరా బిల్లును చెల్లించాలని అదానీ గ్రూప్ బంగ్లాదేశ్‌పై ఒత్తిడి చేయడం ప్రారంభించింది.  దాదాపు 500 మిలియన్ డాలర్ల బకాయిలను చెల్లించాలని అదానీ గ్రూప్ డిమాండ్ చేసింది. గత ప్రభుత్వ ఒప్పందాలపై విమర్శలు.. అదానీ గ్రూప్ తన 1600 మెగావాట్ల గొడ్డ ప్లాంట్ నుంచి బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందం కుదిరింది. అయితే   ఇప్పుడు మహ్మద్ యూనస్ దీనిని చాలా ఖరీదైన ఒప్పందం అని పిలవడం ప్రారంభించాడు. ఈ డీల్‌లో కూడా పారదర్శకత పాటించలేదని, షేక్ హ...

Bangladesh Crisis | బంగ్లాదేశ్‌తాత్కాలిక ప్ర‌ధాని యూన‌స్ నుంచి మోదీకి ఫోన్‌..

National
Bangladesh Crisis  | బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌ధాని ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నుంచి భార‌త‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం ఫోన్ కాల్ వచ్చింది. షేక్ హసీనా బహిష్కరణ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఇద్దరు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. X లో ఒక పోస్ట్‌లో, PM మోదీ "ప్రజాస్వామ్య, స్థిరమైన, శాంతియుత బంగ్లాదేశ్‌కు భారతదేశం పూర్తి మద్దతు ఇస్తుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే హిందువులతోపాటు ఇతర మైనారిటీ వర్గాల భద్రతపై యూనస్ మోదీకి హామీ ఇచ్చారు ఈ విష‌యాన్ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ X లో పోస్ట్ చేసారు, “ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్, @ChiefAdviserGoB నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితిపై అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారతదేశ మద్దతును పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీలందరికీ రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అన...
Exit mobile version