Thursday, June 19Thank you for visiting

Tag: Modi Government

Indian Railway | భారత్ లో అతి పొడవైన రైలు.. ఆశ్చర్యమనిపించే విషయాలు..

National, Trending News
Indian Railway | దశాబ్దకాలంగా భారత్ లో భారతీయ రైల్వే ఎన్నడూ చూడని ప్రగతి సాధించింది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్ పునరాభివృద్ధి చేపడుతూనే కొత్త రైళ్లను కూడా పెద్ద సంఖ్య ప్రవేశపెడుతోంది. రైల్వే మౌలిక సదుపాయాలు 2014 నుంచి పూర్తిగా మారిపోయాయి. భారతదేశ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రైలు ప్రయాణాలను అందిస్తుంది. Indian Railway : ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదే.. ఇక భారతదేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు (longest train) గా దిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ (Vivek Express) గుర్తింపు పొందింది. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్‌ను తమిళనాడులోని కన్యాకుమారికి కలుపుతుంది. మొత్తం 4,189 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణం దాదాపు 75 గంటల 30 నిమిషాలు ఉంటుంది. తొమ్మిది రాష్ట్రాల గుండా వెళుతుంది. 57 రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. Super Vasuki : సూపర్ వాసుకి రైలు గురించి...

‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం

National
One Nation, One Election bill | పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్రం స‌ర్వ‌న్న‌ద్ధ‌మైంది. కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 12న కీలకమైన 'ఒక దేశం, ఒకే ఎన్నికల' బిల్లుకు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.. దీనిని ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే చాన్స్‌ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికార‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి) 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' ఆలోచనను "చారిత్రకమైనది" అని పేర్కొంది. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ విధానం ద్వారా ఎన్నిక‌ల ఖ‌ర్చు భారీగా త‌గ్గుతుంద‌ని, స్థిర‌మైన‌ పాలనకు వీలు క‌ల్పిస్తుంద‌ని పేర్కొంది. అనేక సందర్భాల్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏకకాల ఎన్నికల గురించి ప్ర‌స్తావించారు. నివేదిక‌ల ప్రకారం, కేబినెట్ ఆమోదం ప్ర‌కారం.. ప్రస్తుతం జ‌మిలి ఎన్నిక‌లు లోక్‌సభ, శాసనసభలకు పరిమితం చేశారు. అయితే మాజీ రాష్ట్రపతి ...

Waqf Board | వక్ఫ్ బోర్డు అధికారాలకు అడ్డుకట్ట వేయనున్న మోదీ సర్కార్? అసలేంటీ వివాదం..

Trending News
Waqf Board | ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. వక్ఫ్ చట్టాన్ని సవరణలు చేస్తూ త్వరలో బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, శుక్రవారం (ఆగస్టు 2) సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదిత సవరణలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ఏ భూమినైనా క్లెయిమ్ చేసే అపరిమితమైన అధికారాల కారణంగా వక్ఫ్ బోర్డు వేల కోట్ల విలువైన 9.4 లక్షల ఎకరాలను తన గొడుగు కిందకు తెచ్చుకుంది. కాంగ్రెస్ హయాంలో UPA-2 వక్ఫ్ చట్టం ప్రకారం అదనపు అధికారాలను కట్టబెట్టింది. తద్వారా వక్ఫ్ బోర్డు నుంచి నుంచి భూమిని తిరిగి పొందడం ఎన్నటికీ అసాధ్యంగా మారింది.  ప్రభుత్వ భూములపై ​​క్లెయిమ్ చేసే కేసులు సం...

RSS | ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంపై కేంద్రం కీలక నిర్ణయం

National
న్యూఢిల్లీ:  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్ఎస్ఎస్ సోమవారం (జూలై 22) స్వాగతించింది. కేంద్రం చర్యపై ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రచార సారథి సునీల్ అంబేకర్ స్పందిస్తూ.. ‘గత 99 ఏళ్లుగా దేశ పునర్నిర్మాణంలోనూ, సమాజ సేవలోనూ ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం నిమగ్నమై ఉంది. దేశ భద్రతలో సంఘ్ సహకారం కారణంగా, ఐక్యత-సమగ్రత, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాజంతో మమేకమై సేవలందించడం చేశాయని తెలిపారు. "తన రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా, అప్పటి ప్రభుత్వం సంఘ్ (RSS) వంటి నిర్మాణాత్మక సంస్థ కార్యకలాపాలలో పాల్గొనకుండా ప్రభుత్వ ఉద్యోగులను నిరాధారంగా నిషేధించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. కాగా "నవంబర్ 7, 1966న, పార్లమెంటు వద్ద...

MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

National
MSP : కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వం రైతులకు గుడ్ న్యూన్ చెప్పింది. ప్రధాని న‌రేంద్ర‌ మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త మంత్రివ‌ర్గం వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, గోధుమ, పత్తి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర ( MSP) పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం జోడించి ఈ కొత్త‌ ధరలను నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్ల‌డించారు. దీని వల్ల ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఉంటుంది. గత ఏడాది కంటే రైతులకు రూ.35,000 కోట్ల లాభం చేకూర‌నుంది. #Cabinet approves Minimum Support Prices (MSP) for Kharif Crops for Marketing Season 2024-25 The highest absolute increase in MSP over the previous year has been recommended for oilseeds and pulses#CabinetDecisions pic.twitter.com/zhqhXyNzut — Sheyphali ...

Jammu And Kashmir | ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం ఎలా సాధ్యమైంది..

Special Stories
Jammu And Kashmir :  2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో సమూలమైన మార్పులు వచ్చాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ కాశ్మీర్ లోయ అత్యధిక ఓటింగ్‌తో మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే లోయలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. రికార్డు స్థాయి పోలింగ్.. జమ్మూ కాశ్మీర్‌లో బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్-రాజౌరీ, ఉధంపూర్, జమ్మూతో సహా ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 25 వరకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. ముఖ్యంగా, ఉధంపూర్, జమ్మూలో ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఉధంపూర్ 2019లో 70.15%తో పోలిస్తే 2024లో 68.27% నమోదైంది , జమ్మూ 2024లో 72.22% వద్ద ఉండగా, 2019లో 72.5% ఉంది. అయితే మిగతా మూడు స్థానాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2024...
Exit mobile version