Tuesday, March 4Thank you for visiting

Tag: MLC Kavitha

ఢిల్లీ మద్యం కేసు: కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Crime
Dlehi Liquor Scam Updates | ఢిల్లీ మద్యం కుంభ‌కోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ తోపాటు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. AAPకి కిక్‌బ్యాక్‌లకు బదులుగా దిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించినందుకు నిందితులు కేజ్రీవాల్‌తో టచ్‌లో ఉన్నారని ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ ఆరోపించింది. దిల్లీ లిక్క‌ర్ విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని కూడా రూస్ అవెన్యూ కోర్టు మే 7 వరకు పొడిగించింది. ముగ్గురు నిందితులను వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్ సమక్షంలో ప్రతిరోజూ 15 నిమిషాలపాటు తన వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన ఒక రోజు తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైన వైద్య చికిత్స అందించాలని ఢిల్...

Delhi Excise Policy Case | మూడు రోజుల సీబీఐ కస్టడీకి కవిత..

National
Delhi Excise Policy Case Updates : దిల్లీ లిక్కర్ కేసులో (Delhi Excise Policy Case) వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీలో క‌విత‌ ఉండనున్నారు. ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర‌చాల‌ని దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది కానీ కోర్టు కేవలం మూడు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఏప్రిల్ 15 వరకు కవితను సీబీఐ విచారించనున్న‌ది. మరో వైపు.. కవితకు దిల్లీ కోర్టులో వరుసగా షాక్ లు త‌గులుతున్నాయి. కవిత స‌మ‌ర్పించిన రెండు పిటిషన్లను దిల్లీ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్టు, సీబీఐ కస్టడీ పిటిషన్‌ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్లు ...

Delhi Liquor Scam Case : లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు షాక్..తీహార్ జైలుకు తరలింపు

National
Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో అరెస్ట్ అయిన  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఈడీ కస్టడీ మంగళవారం ముగిసింది.  ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపరచాల్సి ఉండగా  కాస్త ఆలస్యంగా 11:45 గంటలకు హాజరుపరిచారు. కాగా మరోసారి కస్టడీ ఈడీ.. కోరగా,   కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.  ఇరువైపులా వాదనలు విన్న కోర్టు..  ఎమ్మెల్సీ కవితకు   రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ ( Judicial Remand) విధించడంతో ఆమెను తీహార్ జైలు(Tihar Jail )కు తరలించారు. ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో కవితను మంగళవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే.. కాగా  కోర్టులో హాజరుపరిచేముందుక కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు.  తనపై నమోదైన కేసు మనీలాండరింగ్ కేసు కాదని, రాజక...

Delhi Excise Policy | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్‌.. ఈడీ క‌స్ట‌డి 26 వరకు పొడిగింపు

Telangana
Delhi | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Excise Policy)లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఈడీ కస్టడీ (ED Custody) మరో మూడు రోజులు పొడిగించింది. ఢిల్లీ కోర్టు కవితను మార్చి 26 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించింది. అంతకుముందు విచారణ సమయంలో కవితకు ఆమె ఇద్దరు కుమారులు, ఇతర కుటుంబ సభ్యులను కోర్టు హాలులో కలవడానికి కోర్టు అనుమతించినట్లు వార్తా సంస్థ ANI నివేదించింది. కోర్టు హాలు నుంచి బయటకు వచ్చే సమయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ.. మేం పోరాడుతున్నామ‌ని,. ఎన్నికల సమయంలో రాజకీయ అరెస్టులు చేయడం సరికాదని, ఈసీ జోక్యం చేసుకుని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని కోరారు. ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు కవితను శనివారం ముందుగా ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చినట్లు ఏఎన్ఐ నివేదిక తెలిపింది. ముఖ్యంగా, ఆమె ED కస్టడీ నేటితో (మార్చి 23) ముగియ నుండ...
Exit mobile version