Tuesday, March 4Thank you for visiting

Tag: Ministry of Home Affairs

Ladakh New Districts | ఐదు జిల్లాలుగా ల‌డ‌ఖ్ ను ఎందుకు విభ‌జిస్తున్నారు.?

National
Ladakh New Districts | కేంద్ర పాలిత ప్రాంత‌మైన ల‌డ‌ఖ్ ను త్వ‌ర‌లో ఐదు జిల్లాలుగా విభ‌జించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) నిర్ణయించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై 'X' వేదికపై ఒక పోస్ట్‌లో కేంద్ర హోం మంత్రి మంత్రి అమిత్ షా వెల్ల‌డించారు. ల‌డ‌ఖ్ ను- జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌తంగ్ అనే జిల్లాలుగా విభ‌జిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు ప‌రిపాల‌న‌ను చేరువ చేయాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ఐదు జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇప్పుడు లడఖ్‌లో లేహ్, కార్గిల్‌తో కలిపి మొత్తం ఏడు జిల్లాలు ఏర్పడతాయి. ప్ర‌స్తుతం దేశంలోనే అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ ఉంది. ప్రస్తుతం, లడఖ్‌లో లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలు ఉన్నాయి. భారతదేశంలోని అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో ఇదీ ఒకటి. అత్యంత కష్టతరమైన కొండ ప్రాంతాలు, ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఇక్క‌డ ఉంటుంది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అట్టడు...

Air Taxi service | ఢిల్లీ నగరవ్యాప్తంగా ఎయిర్ టాక్సీ సేవలు, మొత్తం ఆరు రూట్లు, 48 హెలిపోర్ట్‌లకు గ్రీన్ సిగ్న‌ల్‌..

National
Air Taxi service  : ఎయిర్ టాక్సీలతో ఇంటర్‌సిటీ డొమెస్టిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), డిజిటల్ స్కైతో ఢిల్లీ NCRలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ తో ఎయిర్ టాక్సీని ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక‌వేళ ఈ ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వ‌స్తే దేశంలో ప్రజా రవాణాగా సౌకర్యాన్ని కలిగి ఉన్న మొట్ట‌మొద‌టి న‌గ‌రంగా ఢిల్లీ ఎన్‌సిఆర్ నిల‌వ‌నుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే పూర్తికాగా మొద‌ట‌ 6 రూట్లను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టును సాకారం చేసేందుకు అధికారులు ఎన్‌సీఆర్‌లో 48 హెలిప్యాడ్‌లను నిర్మించనున్నారు. 6 రూట్లు, 48 హెలిపోర్టులు ఢిల్లీ ప్రాంతంలో పూర్తిగా స‌ర్వే చేసిన త‌ర్వాత మొత్తం 6 రూట్ల...

Manipur violence : మణిపూర్‌ వైరల్ వీడియో రికార్డు చేసిన వ్యక్తి అరెస్ట్

Trending News
కేసును సీబీఐకి అప్పగించే ఛాన్స్ Manipur violence : మణిపూర్ భయానక లైంగిక వేధింపుల కేసులో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దారుణమైన వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నివేదికల ప్రకారం.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) వైరల్ వీడియో కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి రిఫర్ చేసే అవకాశం ఉంది. వైరల్ వీడియో కేసు విచారణను మణిపూర్ వెలుపల జరపాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేయనుంది. పొరుగు రాష్ట్రమైన అస్సాంలో విచారణ జరిగే అవకాశం ఉంది. కుకీ, మెయిటీ గ్రూపులతో చర్చలు మణిపూర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి కుకీ, మెయిటీ గ్రూపులతో MHA సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. "కేంద్రం కుకీ,...
Exit mobile version