Thursday, June 19Thank you for visiting

Tag: Metro News

Hyderabad MMTS : గ్రేట‌ర్ లో భారీగా త‌గ్గిన‌ ఎంఎంటీఎస్ సర్వీసులు.. .

Telangana
Hyderabad MMTS | తక్కువ చార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించాల‌నుకుంటున్న హైద‌రాబాద్ వాసుల‌కు చుక్కెదుర‌వుతోంది. ఎంఎంటీఎస్ ప్రయాణికులకు క్ర‌మంగా దూరం అవుతోంది. నానాటికీ సర్వీసులు తగ్గిపోతుండ‌డంతో ఉద్యోగులకు, సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు ఎదురవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) ప్రాజెక్టును ఓ వైపు విస్తరిస్తూనే, మరోవైపు ఎంఎంటీఎస్ సర్వీసుల‌ను త‌గ్గిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఎంఎంటీ ఎస్ రైళ్లపై ప్రయాణికు్లో విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ఇందుకు కార‌ణం.. తక్కువ ధ‌ర‌లో ఎక్కువ దూరం ప్రయాణించే వీలు ఈ లోక‌ల్ ట్రైన్స్ వ‌ల్ల క‌లుగుతుంది. కరోనాకు ముందు రోజూ 175 సర్వీసులతో రెండున్నర లక్షలమందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర‌వేసిన ఎంఎంటీఎస్ రైళ్లు.. ఇప్పుడు సుమారు వంద సర్వీసులకు పైగా తగ్గి 70 వరకు నడుపుతోంది. ప్ర‌తిరోజు సుమారు 50 ...

Hyderabad Metro Phase II | హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం కారిడార్ల వారీగా డీపీఆర్‌లు సిద్ధం

Telangana
Hyderabad Metro Phase II : హైద‌రాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో రైలు రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధ‌మ‌య్యాయి. మొదటి దశను అనుసంధానం చేస్తూ రూ.24,042 కోట్ల అంచనా వ్య‌యంతో 78.4 కి.మీ మేర విస్తరించేలా 5 కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకు ప్రైవేట్‌ కన్సల్టెన్సీ సంస్థ సిస్ట్రాకు డీపీఆర్‌ రూపకల్పన బాధ్యతలు అప్ప‌గించ‌గా ఆ సంస్థ ప్రతినిధులు బేగంపేటలోని మెట్రో రైలు భవన్‌లో డీపీఆర్‌ను రెడీ చేస్తున్నారు. రెండో దశలో ప్రతిపాదించిన 5 మెట్రో కారిడార్లకు వేరువేరుగా డీపీఆర్‌లను సిద్ధం చేశారు. మొదటి దశలో పెండింగ్‌లో ఉన్న పాతబస్తీ మెట్రో మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడ‌గిస్తూ దానికి ప్రత్యేకంగా డీపీఆర్‌ సిద్ధం చేయగా, మిగతా 5 కారిడార్లకు డీపీఆర్‌లను ఆగస్టు 15 నాటికి రూపొందించనున్నారు. 5 మెట్రో కారిడార్లకు వేర్వేరుగా నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించాల‌ని భావిస్తున్నారు.మొత్తం ఒకే సంస్థకు ఇవ్...

l&t Metro Hyderabad | హైదరాబాద్ మెట్రోలో అసలేం జరుగుతోంది..!

Telangana, Trending News
l&t Metro Hyderabad |  తెలంగాణలో హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్)ను నిర్వహిస్తున్న L & T  భవిష్యత్తులో ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించాలనుకుంటున్నట్లు కంపెనీ ఇటీవలే వెల్లడించింది. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Shceme) కింద రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో   మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీనివల్ల తమకు భారీగా ఆదాయం పడిపోవడంతో ప్రాజెక్ట్‌ను విక్రయించాలని భావిస్తున్నామని ఎల్‌అండ్‌టి తెలిపిన విషయం తెలిసిందే.. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత, మెట్రో రైలులో ప్రయాణించే రోజువారీ ప్రయాణికుల సంఖ్య నవంబర్ 2023లో 550,000 నుంచి 480,000కి తగ్గింది. ఎల్ అండ్ టీపై రేవంత్ రెడ్డి ఏమన్నారు? గత ఏడాది మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టేందుకు ఎల్‌అండ్‌టీ నిరాకరించడంతో తెలంగాణ సీఎం అసహనం వ్యక్తం చేశారు.  కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (KLIP)లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి కాం...
Exit mobile version