Tuesday, March 4Thank you for visiting

Tag: Medchal Malkajgiri district

Medchel | రూ.32 కోట్ల తో మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి..

Telangana
Medchel :  దేశంలో రైల్వే సేవల విస్తరణ..అభివృద్ధి కోసం  కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోందని రూ.2వేల కోట్లతో జంట నగరాల్లోని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను మోదీ ప్రభుత్వం చేపట్టిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajender) తెలిపారు.  మేడ్చల్ రైల్వేస్టేషన్, ఆర్‌యూబీ పనులను గురువారం ఆయన పరిశీలించి, రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఎంపీ ఈటల మాట్లాడారు. ప్రధాని మోదీ చొరవతోనే జంటనగరాల్లో నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల అత్యాధునిక సౌకర్యాలతో  విమానాశ్రయాలను తలపిచేలా ఆధునీకరిస్తున్నారని తెలిపారు. మేడ్చల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి మేడ్చల్‌ రైల్వేస్టేషన్ లో (Medchel Railways Station) లో రూ.32 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.  గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, అమ్మగూడ రైల్...

కూల్చేసిన వందేళ్ల నాటి వృక్షానికి మళ్లీ జీవం పోశారు..

Telangana
యాదాద్రి భువనగిరి జిల్లా వాసి కృషి తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ ఏడాది ప్రారంభంలో భూమి ప్లాట్లు కోసం కొంతమంది రియల్టర్ల చేతిలో నరికివేయబడిన 100 ఏళ్ల మర్రి చెట్టుకు మళ్లీ ప్రాణం పోశారు ఈ ప్రకృతి ప్రేమికులు. దాదాపు 10 అడుగుల వ్యాసం కలిగిన 20 టన్నులకు పైగా బరువున్న మర్రి చెట్టును క్రేన్‌ల సాయంతో పైకి లేపి ఓ ప్రైవేట్‌ స్థలంలోకి తరలించారు. భారీ మల్టీ యాక్సిల్‌ ట్రక్కుపై 54 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి జాగ్రత్తగా  చెట్టును మళ్లీ నాటారు. ఇప్పుడది కొ్త్తకొమ్మలు, చిగుటాకులతో పచ్చగా కళకళలాడుతోంది. చెట్టు జీవం పోసిన ప్రకృతి ప్రేమికుడు అనిల్  గోదావర్తి మాట్లాడుతూ.. “మే 30న మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని ఘట్‌కేసర్‌ సమీపంలోని ఘన్‌పూర్‌కి వెళ్లే దారిలో రోడ్డు పక్కన మర్రిచెట్టు (Banyan Tree) పడి ఉండడం గమనించాను. దాన్నిచూసిన వెంటనే ఆ చెట్టును నా స్థలంలోకి తీసుకురావడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకు...
Exit mobile version