Tuesday, March 4Thank you for visiting

Tag: Maharashtra

Aurangzeb : ఔరంగజేబ్‌ను పొడిగిడినందుకు స‌మాజ్ వాదీ పార్టీ నేత‌పై కేసు

National
అత్యంత క్రూరుడైన‌ మొఘల్ పాలకుడు ఔరంగజేబును (Aurangzeb) ప్రశంసిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అబు అజ్మీ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో, శివసేన (షిండే వర్గం) ఆయనపై పోలీసు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే కూడా అజ్మీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శివసేన ఫిర్యాదు శివసేన (షిండే వర్గం) అబూ అజ్మీపై ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మాజీ ఎమ్మెల్యే, శివసేన అధికార ప్రతినిధి కిరణ్ పవాస్కర్, పార్టీ కార్యకర్తలతో కలిసి ఎస్పీ నాయకుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. అలాగే, శివసేన ఎంపీ నరేష్ మష్కే BNS సెక్షన్లు 299, 302, 356 (1), మరియు 356(2) కింద ప్రత్యేక...

‘లవ్ జిహాద్’ కు వ్యతిరేకంగా చట్టాలు? మ‌హారాష్ట్ర‌లో ఏడుగురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు

Trending News
Mumbai: మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లోని మ‌హాయుతి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. బలవంతపు మత మార్పిడులు, "లవ్ జిహాద్ (Love Jihad)" కేసులకు వ్యతిరేకంగా చట్టపరమైన చట్రాన్ని పరిశీలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) సంజయ్ వర్మ నేతృత్వంలోని ఈ కమిటీలో స్త్రీ, శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, న్యాయవ్యవస్థ (law and judiciary), సామాజిక న్యాయం (సోష‌ల్ జ‌స్టిస్‌), హోం శాఖ‌ వంటి కీలక విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ క‌మిటీలో ఉంటారు. శుక్రవారం ఆలస్యంగా జారీ చేసిన ప్రభుత్వ తీర్మానం ప్రకారం, ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. "లవ్ జిహాద్‌", బలవంతపు మతమార్పిడుల ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలను సూచిస్తుంది. ఈ కమిటీ చట్టపరమైన అంశాలను, ఇతర రాష్ట్రాల్లో రూపొందించిన చట్టాలను కూడా...

Maharashtra CM | మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపికపై ఏక్ నాథ్ కీలక ప్రకటన

Elections
Maharashtra CM : ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత మహారాష్ట్ర సీఎం పీఠం ఎవరిదనే అంశంపై స్పష్టత వచ్చింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిర్ణయాన్ని వాయిదా వేయడం ద్వారా షిండే ఎమోషనల్ మైండ్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. తాను ప్రధానమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ప్రభుత్వ ఏర్పాటుకు "అడ్డంకి" కాబోనని ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. కాగా మహారాష్ట్ర సీఎం ఎంపికలో ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించే బాధ్యతను మోదీ.. అమిత్ షాకు అప్పగించారు. ముగ్గురు మహాయుతి నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలతో  అమిత్ షా  సమావేశమయ్యారు. అయితే ఇక్కడ షిండే "సానుకూలంగా" ఉన్నప్పటికీ  ఆమర అసంతృప్తితో ఉన్నారని పలు వర్గాలు వెల్లడించాయి. తన బేరసారాల వ్యూహాలు విఫలమయ్యాయని గ్రహించిన షిండే, సిఎం, క్యాబినెట్ మ...

మ‌హా ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌లేకపోయిన రాజ్‌థాక్రే, ప్రకాశ్ అంబేద్క‌ర్ పార్టీలు

Elections
Maharashtra Assembly Elections : మహారాష్ట్ర ఎన్నిక‌ల్లో రాజ్ థాకరే కు చెందిన‌ మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ (MNS), అంబేద్క‌ర్ మ‌న‌వ‌డు ప్రకాష్ అంబేద్కర్ కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడి (VBA) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఈ పార్టీలో మ‌హాయుతి సూనామీ ముందు కొట్టుకుపోయాయి. అయితే సమాజ్ వాదీ పార్టీ, ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ వంటి పార్టీలు కాస్త మెరుగైన స్థితిలో ఉన్నాయి. MNS 125 మంది అభ్యర్థులను నిలబెట్టగా, VBA 200 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ముంబయిలోని మహిమ్‌ సీటులో పార్టీ అధినేత కుమారుడు అమిత్‌ థాకరే మూడో స్థానంలో నిలవడం ఎంఎన్‌ఎస్‌కు మింగుడు ప‌డ‌లేదు.. 19 మంది అభ్యర్థులను నిలబెట్టిన రాజు శెట్టి నేతృత్వంలోని స్వాభిమాని పక్ష (Swabhimani Paksha) కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలో రైతులపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. యాదృచ్ఛికంగా, ఓట్ల ల...

నాందేడ్ లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ‌.. బిజెపికి పెరిగిన సంఖ్యాబ‌లం

Elections
Nanded Constituency | నాందేడ్ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో బిజెపి పార్లమెంట్ స‌భ్యుల‌ సంఖ్యను 241కి పెంచుకుంది. బిజెపి అభ్యర్థి సంతుక్రావ్ హంబార్డే భారీ ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం కాంగ్రెస్‌ ప్రత్యర్థి రవీంద్ర చవాన్‌పై దాదాపు 40,000 ఓట్లు వచ్చాయి. ఐదు నెల‌ల క్రితం నాందేడ్‌లో కాంగ్రెస్ 50,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో బీజేపీపై విజయం సాధించించింది. అయితే ఆగస్టు 26న కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ వసంత్ చవాన్ మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గాన్ని నిలుపుకునే ప్రయత్నంలో వసంత్ కుమారుడు రవీంద్ర చవాన్‌ను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 23 నుంచి 9 స్థానాలకు పడిపోయిన మహారాష్ట్రలో బీజేపీ గెలుపు పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది. నాందేడ్ తిరిగి కైవ‌సం చేసుకోవ‌డంతో కాషాయ పార్టీ ఇప్పుడు మ‌హా...

Adani group | ఒకవైపు అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు.. మరోవైపు తెలంగాణలో అదానీ గ్రూప్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు..

Trending News
Adani group | న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ(Goutham Adani)  పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పిలుపునివ్వడంతో తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని ఇరకాటంలో పడేట్లు అయింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలపై USలో అభియోగాలు మోపబడిన తర్వాత అతనిపై చర్య తీసుకోవాలని గాంధీ డిమాండ్‌ చేసిన విష‌యం తెలిసిందే.. అయితే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అదానీ గ్రూప్ నుంచి విరాళాలు స్వీకరించిన వార్త‌లు అదానీ గ్రూప్ తో తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌కు సంబంధించిన వార్త‌లు ట్రెండింగ్ లోకి వ‌చ్చాయి. రాహుల్ గాంధీ ఏం చెప్పారు? భారతీయ అధికారులకు USD 250 మిలియన్ల లంచం ఇచ్చినందుకు US ప్రాసిక్యూటర్లు అదానీ, ఆయ‌న‌ సహచరులపై అభియోగాలు మోపిన విష‌యంపై రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ప్ర‌స్తావించారు. గౌత‌మ్ అదానీ.. భారత్‌, అమెరికన్ చట్ట...

Maharashtra Exit Poll : మహారాష్ట్రలో మళ్లీ మహాయుతికే పట్టం.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..

Elections
Maharashtra Exit Poll : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 137-157 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 126-146 సీట్లు రావచ్చు. ఇతరులు 2-8 సీట్లు సాధించ‌వ‌చ్చ‌ని అంచ‌నావేసింది. MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహాయుతి మరోసారి మెజారిటీతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 150-170 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 110-130 సీట్లు రావచ్చు. ఇతరులకు 8-10 సీట్లు రావచ్చు. పీపుల్స్ పల్స్: మహాయుతి (BJP+): 182 మహా వికాస్ అఘాడి (కాంగ్రెస్+): 97 ఇతరులు: 9  మెట్రిజ్: మహాయుతి (BJP+): 150-170 ...

Maharashtra Elections | మహావికాస్ అఘాడీ గెలిస్తే కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఏటీఎం అవుతుంది: అమిత్ షా

Elections
Maharashtra Elections : నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (MVA) గెలిస్తే ఈ రాష్ట్రం కూడా కాంగ్రెస్‌కు ‘ఏటీఎం’గా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) విమ‌ర్శించారు. రాష్ట్ర వనరులను ఉపయోగించి మహారాష్ట్ర నుంచి డబ్బు వసూలు చేస్తారు మీ డబ్బును ఢిల్లీకి పంపుతారు" అని బుధ‌వారం జల్గావ్ జిల్లాలోని చాలీస్‌గావ్‌లో జరిగిన ర్యాలీలో అమిత్‌ షా అన్నారు. బిజెపి (BJP)నేతృత్వంలోని మహాయ‌తి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంద‌ని, జార్ఖండ్‌లోనూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన అన్నారు మహారాష్ట్రలో మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందుకే కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అమిత్ షా అన్నారు. పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అదే రాజ్యాంగం న‌కిలీ కాపీని పట్టుకొని వ‌చ్చార‌ని, కొందరు జర్నలిస్...

మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. ఫడ్నవీస్‌పై పోటీగా గిరీష్ పాండవ్..

Elections
Maharashtra Assembly Elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ శనివారం విడుదల చేసింది. తాజా అభ్యర్థుల జాబితాతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 71 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజా జాబితాలో, డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్‌పై దక్షిణ నాగ్‌పూర్ నుంచి గిరీష్ కృష్ణరావు పాండవ్ ను కాంగ్రెస్ పార్టీ బ‌రిలో నిలిపింది. పూర్తి జాబితా ఇదే.. భుసావల్ - డాక్టర్ రాజేష్ తుకారాం మాన్వత్కర్ జలగావ్ - డాక్టర్ స్వాతి సందీప్ వాకేకర్ అకోట్ - మహేష్ గంగనే వార్ధా - శేఖర్ ప్రమోద్బాబు షెండే సావ్నర్ - అనూజ సునీల్ కేదార్ నాగ్‌పూర్ సౌత్ - గిరీష్ కృష్ణరావు పాండవ్ కమ్తి - సురేష్ యాదవ్రావ్ భోయార్ భండారా (SC) - పూజ గణేష్ తావ్కూర్ అర్జున్-మోర్గావ్ (SC) - దలీప్ వామన్ బన్సోడ్ అమగావ్ (ఎస్టీ) - రాజ్‌కుమార్ లోటుజీ పురం రాలే...

Assembly Elections 2024 | మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల షెడ్యూల్ ఇదే..

Elections
Assembly Elections 2024 | భారత ఎన్నికల సంఘం (ECI) మంగళవారం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 20న మహారాష్ట్ర ఒకే దశలో అలాగే జార్ఖండ్ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 13, 20 తేదీల్లో దశలు ఎన్నికలు జరగుతాయని, ఫలితాలు నవంబర్ 23 న ప్రకటించనున్నామని తెలిపారు. మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఈసారి జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల పూర్తి షెడ్యూల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 22 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 29 నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 30 అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 4 పోలింగ్ తేదీ: నవంబర్ 20 ఓట్ల లెక్కింపు తేదీ: నవంబర్ 23 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్  జార్ఖండ్‌లో ర...
Exit mobile version