Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Mahakumbh

Mahakumbh Stampede | కుంభ‌మేళాలో 30 మంది మృతి.. యూపీ డీఐజీ కీల‌క ప్ర
Crime

Mahakumbh Stampede | కుంభ‌మేళాలో 30 మంది మృతి.. యూపీ డీఐజీ కీల‌క ప్ర

Mahakumbh Stampede : ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్‌లో తొక్కిసలాటకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీస్ డిఐజి (మహాకుంభ్ నగర్) వైభవ్ కృష్ణ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈరోజు జరిగిన ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మంది భక్తులు గాయపడ్డారని తెలిపారు. మహాకుంభమేళాలో తెల్లవారుజామున 1-2 గంటల మధ్య జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మందిని గుర్తించామని, మిగిలిన 5 మందిని గుర్తించడం జరుగుతోందని మహాకుంభ్ నగర్ డిఐజి (UP Police) తెలిపారు. వీరిలో (30 మంది మరణించారు), 25 మందిని గుర్తించగా, మిగిలిన ఐదుగురిని ఇంకా గుర్తించలేదు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు. నలుగురు కర్ణాటక, అస్సాం నుంచి ఒకరు, గుజరాత్ నుంచి ఒకరు. గాయపడిన కొందరు భక్తులను తీసుకెళ్లారు. గాయపడిన వారి బంధువులు స్థానిక వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. సీఎం యోగి న్యాయ విచారణ, రూ. 25 లక్షల ఎక...
Trending News

Monalisa | కుంభ‌మేళాలో దండ‌లు అమ్ముకునే అమ్మాయికి బంప‌ర్ ఆఫ‌ర్‌..

Monalisa | మహాకుంభమేళా (Maha kumbh 2025 ) లో ఓ తేనె క‌ళ్ల‌ యువతి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ముఖ్యంగాగా సోష‌ల్‌మీడియాలో ఇప్పుడు అమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేక్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆమె గురించే చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఆమె ఏదో సెలబ్రెటీయో.. ధనవంతుల బిడ్డనో కాదు.. అందాల భామ అస‌లే కాదు.. చామన ఛాయ రంగులో ఉండే సాధారణ అమ్మాయి మాత్ర‌మే.. పూస‌ల‌ దండ‌లు దండలు అమ్ముకుని కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న ఆ యువ‌తి ప్ర‌యాగ్‌రాజ్‌ మహా కుంభమేళా (Prayagraj Maha Kumbh ) లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది. ఇందుకు కారణం కాటుక దిద్దిన అందమైన తేనే కళ్లు.. అమాయకమైన చూపులు.. అవే ఇప్పుడు ఆమెను సోషల్‌మీడియాలో ఫాలో అయ్యేలా చేసింది. అంత‌టితో ఆగ‌కుండా ఆమెకు బాలీవుడ్‌ (Bollywood) నుంచి సినిమా ఆఫర్‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ మహాకుంభమేళాలో ప్ర‌త్య‌క్ష‌మైన ఈ తేనె క‌ళ్ల యువ‌తి పేరు మోనాలిసా భోస్లే. మధ్య...
National, Special Stories

Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావ‌డం మర్చిపోవద్దు..

Mahakumbh 2025 : హిందువులు ఎంతో ప‌విత్రంగా భావించే మహా కుంభమేళా వ‌చ్చేసింది. ఈ మ‌హా ఉత్స‌వంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు పవిత్ర ఘాట్‌లకు చేరుకుంటారు. ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ‌మేళా సందర్భంగా కోట్లాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. మహా కుంభం మొదటి రాజ స్నానం జనవరి 14న జరుగుతుందని తెలిసిందే.. మీరు కూడా మహా కుంభమేళాలో పాల్గొని, త్రివేణి ఘాట్‌లో స్నానం చేయాలనుకుంటే, మీరు తప్పనిసరిగా ప్రయాగ్‌రాజ్ నుంచి కొన్ని వస్తువులను తీసుకురావాలి. ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని వాస్తు దోషాల నుండి ఉపశమనం క‌లుగుతుంద‌ని చాలా మంది భ‌క్తులు నమ్ముతారు. త్రివేణి సంగమం ఇసుక గంగా ఘాట్ నేల ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మహా కుంభ్‌లో పాల్గొనబోతున్నట్లయితే, మీరు గంగా ఘాట్ ఇంటి నుండి తప్పనిసరిగా ప‌విత్ర‌మైన‌ మట్టిని తీసుకురావ‌చ్చు. మీరు ఈ మట్టిని తులసి మొక్కలో ...
National

Mahakumbh 2025 | మహాకుంభమేళాకు 37 వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రత

లక్నో: మహా కుంభ‌మేళా 2025 (Mahakumbh 2025) కు యూపీ స‌ర్కారు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌చ్చే భక్తులు పటిష్ట భద్రత కల్పించేందుకు యోగి ప్రభుత్వం ప‌ట్టిష్ట‌మైన ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. భ‌ద్ర‌త ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స్నిపర్‌లు, NSG కమాండోలు, కమాండో స్క్వాడ్‌లు, ATS, STF, BDDS బృందాలు, శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్‌లను మోహరించాల‌ని భావిస్తోంది యూపీ ప్ర‌భుత్వం. నివేదిక‌ల ప్ర‌కారం.. మ‌హాకుంభ మేళాలో 7 అంచెల భద్రత ఉంటుంది. ఇది కాకుండా, మహాకుంభమేళా జరిగే ప్రాంతాన్ని 10 జోన్లు, 25 సెక్టార్లు, 56 పోలీస్ స్టేషన్లు, 155 అవుట్‌పోస్టులుగా విభజించారు. ప్రతి స్థాయిలో తనిఖీలు, పర్యవేక్షణ ఉండేలా భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఎలాంటి అసౌకర్యం, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్ర‌యాగ్ రాజ్ నగరంలో రెండు NSG కమాండో కంటెంజెంట్లు, 26 యాంటీ-సబోటేజ్ (AS) తనిఖీ బృందాలు మోహరించనున్నామ...
Exit mobile version