మహిళ ఘాతుకం.. నిద్రపోనివ్వకుండా ఏడ్చినందుకు రెండేళ్ల గొంతుకోసి చంపిన అత్త
Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తనను నిద్రపోనీయకుండా ఏకధాటిగా ఏడుస్తోందని విసుగు చెంది.. తన రెండేళ్ల మేనకోడలిని కొట్టింది. అంతటితో ఆగకుండా పసిపాప గొంతుకోసి చంపింది.
ఈ సంఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్ పూర్ నగరంలోని హనుమంతల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో సోమవారం జరిగింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసినట్లు మంగళవారం తెలిపారు.
బాధితుడు మహ్మద్ షకీల్ కుమార్తె మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిందని హనుమంతల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎం ద్వివేది తెలిపారు. కుటుంబ సభ్యులు బాలిక కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా తప్పిపోయిన బాలిక గురించి ఎలాంటి క్లూ లభించలేదని ద్వివేది తెలిపారు.
తరువాత, పోలీసులు ఆమె తండ్రి ఇంటిలో పసిబిడ్డ కోసం వెతకడం ప్రారంభించ...