Lok Sabha Exit polls | లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు.. తేల్చి చెప్పిన సర్వే సంస్థలు..!
Lok Sabha Exit polls : లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకే మూడో సారి ప్రజలు పట్టంకట్టినట్టుగా స్పష్టమవుతోంది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ బీజేపీదే విజయమని తేల్చి చెబుతున్నాయి. ఈసారి బీజేపీ గతంలో కంటే ఏకంగా 350కి పైగా సీట్లలో గెలుపొందుతుందని దాదాపు అన్ని సర్వేలు వెల్లడించాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి కేవలం 150 కంటే తక్కువ సీట్లకే పరిమితమవుతుందని సర్వేలు చెప్పాయి. వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రిపబ్లిక్ భారత్-మాట్రిజ్
ఎన్డీఏ – 353-368
ఇండియా కూటమి – 118-133
ఇతరులు – 43-48
ఇండియా న్యూస్ డీ డైనమిక్స్
ఎన్డీఏ – 371
ఇండియా కూటమి – 125
ఇతరులు – 47
రిపబ్లిక్ టీవీ-పీ మార్క్
ఎన్డీఏ – 359
ఇండియా కూటమి – 154
ఇతరులు – 30
జన్కీ బాత్
ఎన్డీఏ – 377
ఇండియా – 151
ఇతరులు – 15
న్యూస్ నేషన్
ఎన్డీఏ – 342-378
ఇండియా కూటమి – 153-169
ఇతరులు – 21-23
...