Thursday, March 6Thank you for visiting

Tag: local news

Hyderabad Metro : న్యూ ఇయర్ జోష్.. మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

National
Hyderabad Metro : హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుక‌ల (New year 2025) సంద‌ర్భంగా ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రేపు, డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మెట్రో సేవ‌ల‌ను పొడిగించిన‌ట్లు పేర్కొంది. చివరి రైలు స్టేషన్ నుంచి 12:30 AMకి బయలుదేరుతుంది, అర్ధ‌రాత్రి 1:15 AM వ‌ర‌కు రైలు చివరి గమ్యస్థానానికి చేరుకుంటుంద‌ని తెలిపింది. కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునే వారికి సౌకర్యవంతమైన రవాణా సౌక‌ర్యాల‌ను అందిస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ మేరు హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్, NVS రెడ్డి సోమవారం మాట్లాడుతూ అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి మెట్రో రైలు 12:30 గంటలకు బయలుదేరి, జనవరి 1, 2025 న తెల్లవారుజామున 1:15 గంటలకు సంబంధిత ఎండ్ పాయింట్లకు చేరుకుంటుంది. ఈ మెట్రో సేవ‌ల విస్త‌ర‌ణ‌తో అర్థరాత్రి వేళ ప్ర‌యాణికుల‌కు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంద‌ని తెలిపారు. లేట్ నైట...

బాలత్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు

Local
warangal: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు  వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థావన, అఖండదీపం కార్యక్రమాలు జరగయి.. తొలిరోజు అమ్మవారు బాలత్రిపుర సుందరి (Bala Tripura Sundari Devi) గా దర్శనమిచ్చారు. అర్చకులు కళ్యాణ్ మధ్యాహ్నం వేదమంత్రోచ్ఛరణలతో హోమ, కుంకుమ పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం చిన్నారి విశ్వాని పొడిశెట్టి బాలత్రిపుర సుందరి దేవి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులందరు.. అమ్మవారికి పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు..   వరంగల్ కీర్తినగర్ లోని శ్రీ నిమిషాంబ దేవీ ఆలయంలో కనుల పండువగా శరన్నవరాత్రి వేడుకలు.. బాలత్రిపుర సుందరి దేవీ అలంకరణ...

బహిరంగంగా.. తల్వార్ తిప్పితే ఇక జైలుకే..

Local
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ Warangal : బహిరంగంగా తల్వార్(కత్తి)ను తిప్పుతూ ప్రదర్శనలు ఇచ్చేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ హెచ్చరించారు. ఇటీవల కాలం లో వరంగల్ కమిషనరేట్ పరిధి (warangal police commissionerate) లో తల్వార్లు, కత్తుల సంస్కృతి పెరిగిపోతోంది. కొందరు వ్యక్తులు తల్వార్లు, కత్తులతో యథేచ్ఛగా తిరుగుతూ ఫొటోలకు ఫోజులిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపై ఎవరైనా వ్యక్తులు పుట్టిన రోజుల వేడుకల్లో గానీ ఇతర కార్యక్రమాల సమయాల్లో గానీ తల్వార్లను బహిరంగంగా ఎత్తిచూపడం, వాటిని తిప్పతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, పుట్టినరోజు వేడుకల సందర్భంగా తల్వార్లు లేదా కత్తులతో కేకులను కట్ చేస్తున్నట్లుగా దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా పోస్టులు చేయొద్దని హెచ్చరించారు. అలాగే తల్వార్లు పట...

వీడియో: వరద ప్రవాహంలో వాహనం నడిపితే ఎంతో ప్రమాదమో చూడండి..

Local
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల ప్రజలు వరదల్లో చిక్కుకొకని పోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాలో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన విషాద సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. వీడియోలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నారం గ్రామానికి చెందిన పి.మహేందర్ (32)గా గుర్తించారు. వాగు నుంచి నీరు పొంగి ప్రవహిస్తున్న రోడ్డు వెంబడి నెమ్మదిగా బైక్ నడుపుతుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయాడు. వేలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం మహేందర్ కొట్టుకుపోగా, సాయంత్రం ప్రమాద స్థలానికి అరకిలోమీటర్ దూరంలో మృతదేహాన్ని వెలికితీశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా అనేక నీటి వనరులు పొంగిపొర్లుతున్నాయి, వరదలతో రహదా...

హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల క‌ళ‌క‌ళ‌

Local
electric double decker buses : హైద‌రాబాద్‌లో డ‌బుల్ డెక్క‌ర్ ఎల‌క్ట్రిక్ బ‌స్సులు సంద‌డి చేస్తున్నాయి. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకురావాలని ప్రజల నుండి ఎంతో కాలంగా వ‌స్తున్న డిమాండ్ ఎట్ట‌కేల‌కు నెర‌వేరింది. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రవేశపెట్టాలని ఓ వ్య‌క్తి ట్విట్టర్‌లో గ‌త రెండేళ్ల క్రితం చేసిన అభ్యర్థనపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు స్పందించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను తిరిగి తీసుకురావడానికి అవకాశం ఉందా అని చ‌ర్చించారు. అయితే ఈ ట్వీట్‌కు రెండేళ్ల తర్వాత మంగళవారం కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి మొదటి మూడు డ‌బుల్ డెక్క‌ర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎంఏ అండ్ యూడీ) అరవింద్ కుమార్ పాల్గొన్నారు. ABB FIA...
Exit mobile version