Hyderabad Metro : న్యూ ఇయర్ జోష్.. మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
Hyderabad Metro : హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల (New year 2025) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు కీలక ప్రకటన చేసింది. రేపు, డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మెట్రో సేవలను పొడిగించినట్లు పేర్కొంది. చివరి రైలు స్టేషన్ నుంచి 12:30 AMకి బయలుదేరుతుంది, అర్ధరాత్రి 1:15 AM వరకు రైలు చివరి గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపింది. కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునే వారికి సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొంది.
ఈ మేరు హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్, NVS రెడ్డి సోమవారం మాట్లాడుతూ అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి మెట్రో రైలు 12:30 గంటలకు బయలుదేరి, జనవరి 1, 2025 న తెల్లవారుజామున 1:15 గంటలకు సంబంధిత ఎండ్ పాయింట్లకు చేరుకుంటుంది. ఈ మెట్రో సేవల విస్తరణతో అర్థరాత్రి వేళ ప్రయాణికులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.
లేట్ నైట...