Sunday, June 1Welcome to Vandebhaarath

Tag: Liquor scam

National

Delhi Excise Policy Case | మూడు రోజుల సీబీఐ కస్టడీకి కవిత..

Delhi Excise Policy Case Updates : దిల్లీ లిక్కర్ కేసులో (Delhi Excise Policy Case) వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీలో క‌విత‌ ఉండనున్నారు. ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర‌చాల‌ని దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది కానీ కోర్టు కేవలం మూడు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఏప్రిల్ 15 వరకు కవితను సీబీఐ విచారించనున్న‌ది. మరో వైపు.. కవితకు దిల్లీ కోర్టులో వరుసగా షాక్ లు త‌గులుతున్నాయి. కవిత స‌మ‌ర్పించిన రెండు పిటిషన్లను దిల్లీ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్టు, సీబీఐ కస్టడీ పిటిషన్‌ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్లు ...
National

Liquor Scam | లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్.. మొత్తం 171 ఫోన్లు మాయమయ్యాయన్న ఈడీ

Liquor Scam | న్యూఢిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండేళ్ల క్రితం మద్యం కుంభకోణం జ‌రిగిన స‌మ‌యంలో ఉపయోగించిన ఫోన్ కనిపించకుండా పోయిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తెలిపాయి. దీనిపై కేజ్రివాల్ ను ప్రశ్నించగా, అది ఎక్కడ ఉందో తనకు తెలియదని చెప్పారని ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఇది 171వ ఫోన్ అని తెలిపారు. ఆ ఫోన్ లో ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన డేటాను ఉండవచ్చని వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు 36 మంది నిందితులకు చెందిన 170 ఫోన్‌లను గుర్తించలేకపోయామని ఈడీ పేర్కొంది. చివరికి, ఏజెన్సీ వారు 17 ఫోన్‌లను గుర్తించి డేటాను రికవరీ చేసింది. ED తన ఛార్జిషీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియాను నిందితుడిగా పేర్కొంది. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు గాను మిగిలిన ఫోన్లను పగలగొట్టారని దర్యాప్తు అధికారులు ఆరోపించారు. ఇప్పటి వరకు, ఫోన్‌లు ల్యాప్‌టాప్‌లలో ఈ కేసుకు సం...
Exit mobile version