Monday, March 3Thank you for visiting

Tag: Latest Telugu News

Caste Census Report : కులగణన సర్వే లెక్కలు తేలాయి.. తెలంగాణలో బీసీలు 46.25 శాతం , ముస్లింలు 12.56 శాతం

National
Caste Census Report details | రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కుల‌గ‌ణ‌న‌పై హైదరాబాద్‌లోని సచివాలయంలో కేబినెట్ సబ్‌ కమిటీ (Cabinet Sub-Committee) సమావేశం ఆదివారం జ‌రిగింది. మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన ఈ స‌మావేశంలో కేబినెట్‌ సబ్‌ కమిటీకి కులగణన నివేదికను ప్లానింగ్‌ కమిషన్‌ అధికారులు అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో జరిగిన కుల గణన వివరాలు మీడియాకు వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్త‌గా 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని, 3.1 శాతం మంది కుల‌గ‌ణ‌న‌ సర్వేలో పాల్గొనలేదని తెలిపారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసమే సర్వే నిర్వ‌హించామ‌న్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 10 గంటలకు కేబినెట్‌ సమావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. అదేరోజు కేబినెట్ ముందుకు కులగణన సర్వే నివేదిక తీసుకువస్తామని తెలిపారు. తెలంగాణలోని ఇంటింటా 96.9 శాతం సర్వే (Caste Census Re...

Job Notification | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో మరో భారీ నోటిఫికేషన్

Career
Bhatti Vikramarka On Job Notification |  నిరుద్యోగులకు ప్రభుత్వం (Congress Governament) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విద్యుత్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka Mallu )  వెల్లడించారు. ఈరోజు ఖమ్మం కలెక్టరేట్‎లో విద్యుత్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ శాకలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేస్తామని తెలిపారు. విద్యుత్ శాఖలో పదోన్నతులు లేక అధికారులు ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమోషన్స్ ఇచ్చామని తెలిపారు.. క్షేత్రస్థాయిలో లైన్ మెన్ల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదముందని అన్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువుల విషయంలో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. కరెంట్ ట్రిప్ క...

Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..

Andhrapradesh
Flood Relief Funds | న్యూఢిల్లీ: దేశంలో వరద ప్రభావిత 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయక నిధులను మంగళవారం విడుదల చేసింది. ఈమేరకు రూ.5,858 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ (MHA)  అధికార ప్రకటనలో పేర్కొంది.  రాష్ట్ర విపత్తు సహాయనిధి (SDRF) కి కేంద్ర వాటాగా జాతీయ విపత్తు సహాయ నిధి (NDRF) నుంచి ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి వరద సహాయ నిధిగా రూ.416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక మహారాష్ట్రకు రూ.1,491 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు,మిజోరాంకు రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు, సిక్కింకు రూ.23.60 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, పశ్చిమబెం...

Ration card Holders| పేదలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డుపై చక్కర పంపిణీ

Andhrapradesh
Ration card Holders | రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీ చేయాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించింది. సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించింది. ఈ కారణంతోనే రెండు నెలలుగా చక్కెర పంపిణీ నిలిపివేసింది. సెప్టెంబరు నుంచి కొత్త ప్యాకింగులో పంచదార పంపిణీకి రంగం సిద్ధం చేసింది. గత వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం నిత్యవసరాలను తగ్గించి చివరకు కేవలం బియ్యానికే పరిమితం చేసింది. అందరికి అవసరమైన కందిపప్పును పూర్తిగా నిలిపివేసింది. మూడునెలల కిందట అదికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కార్డుదారులకు సరకుల సరఫరాపై జిల్లాల వారీగా లబ్ధిదారులు, డీలర్లు, ఎండీయూ వాహనదారులతో సర్వే నిర్వహించింది.  కార్డుదారుల్లో ఒక్కొక్కరికి 5 కిలోల వంతున ఉచిత బియ్యం, నగదుకు అరకిలో చక్కెర ఇవ్వనున్నారు. వచ్చేనెల నుంచి కొత్త...

BSNL 4G: ఇప్పుడు 15,000 మొబైల్ టవర్లలో 4G స‌ర్వీస్‌

Technology
BSNL 4G : ప్రభుత్వ రంగ టెలికామ్‌ సంస్థ‌ బిఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు తన 4G సేవను ప్రారంభించింది. ఈ కంపెనీ చ‌రిత్ర‌లో ఇది ముఖ్యమైన మైలురాయి అని చెప్ప‌వ‌చ్చు. దేశవ్యాప్తంగా సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీని అందించే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. BSNL దేశవ్యాప్తంగా 4G సేవలను అందిస్తోంది. ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడేందుకు 5G టెక్నాలజీని పరీక్షించడం కూడా ప్రారంభించింది. అదనంగా, BSNL ఇప్పుడు వినియోగదారులకు 5G స‌పోర్ట్ చేసే SIM కార్డ్‌లను అందిస్తోంది. BSNL 15 వేలకు పైగా 4G సైట్‌లను ఇప్పుడు ప్రారంభించింది. ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్ క్రింద స్థాపించబడిన ఈ సైట్‌లు భారతదేశం అంతటా ఫాస్టెస్ట్‌ కనెక్టివిటీని అందిస్తాయని కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా, బిఎస్ఎన్ఎల్ 4G సేవ పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ మొబైల్ టవర్లలో భారతదేశంలో తయారు చేయబడిన పరికరాలు అమర్చారు. బిఎస్ఎన్ఎల్ 4G రోల్ అవుట్ టైమ్‌లైన్...

Baby Berth in Trains | భారతీయ రైల్వేలో బేబీ బెర్త్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయబోతోందా? అశ్విని వైష్ణవ్ ఏం చెప్పారు.?

Trending News
Baby Berth in Trains |  న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు బేబీ బెర్త్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయబోతున్నాయా? రైలు ప్రయాణికులు, ప్రత్యేకించి తమ పసి పిల్లలు, చిన్న పిల్లలతో ప్రయాణించే మహిళల్లో ఆందోళన కలిగించిన ప్రశ్న ఇది. భారతీయ రైల్వేలు స్లీపర్. హయ్యర్ క్లాస్ కోచ్‌లలో ప్ర‌యాణికుల‌కు మెరుగైన‌ సౌకర్యాల‌ను క‌ల్పించేందుకు అనేక చ‌ర్య‌లు చేప‌డుతోంది. అయితే కొన్ని రైళ్లలో సైడ్ లోయర్ బెర్త్‌ల కోసం అదనపు కుష‌న్ల‌ను ప్రవేశపెట్టారు. ఇవి ప‌సి పిల్ల‌ల బెర్త్ సీట్ల కోసం పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ట్రయల్ రన్‌లో శిశువులతో ఉన్న తల్లులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి లక్నో మెయిల్‌లో రెండు బేబీ బెర్త్‌లను కొత్త‌గా అమ‌ర్చారు. అన్ని రైళ్లలో బేబీ బెర్త్ సీట్లను అమర్చడానికి ప్రభుత్వం చొరవ చూపడంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పైలట్ ప్రాజెక్ట్‌లో ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సమస్యలను బయటపెట్టినట్లు రా...

SSC Jobs : ఇంటర్ పాస్ అయ్యారా ? 2,000 ఉద్యోగాలు రెడీ

Career
SSC Jobs| SSC నుంచి మరో భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్ అర్హతతో 2,006 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. SSC నుంచి కొత్తగా స్టెనోగ్రాఫర్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మరో 2006 మందికి గ్రేడ్‌ C, D పోస్టులను భర్తీ చేయనున్నారు. SSC స్టేనో రిక్రూట్‌మెంట్‌ 2024 నుంచి ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఆగష్టు 17న దరఖాస్తులకు ఆఖరి తేదీ అని ప్రకటించింది.ఈ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) స్టెనో గ్రేడ్ C, D పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పటికే SSC ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కొత్తగా మరో 2006 ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C, D ఎగ్జామ్ 2024 కోసం అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://ssc.gov.in/ SSC అఫీషియల్ వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. SSC స్టేనో అర్హత, ఎంపిక విధానం.. విద్యార...

Train Tickets Booking | రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ట్రెయిన్‌ టికెట్ల బుకింగ్‌లో కొత్త నిబంధనలు

National
Train Tickets Booking | రైలు టికెట్లు కొనుగోళ్ల‌లో పాత నిబంధనలే మ‌ర‌లా అమల్లోకి వచ్చాయి. సాధారణంగా టికెట్ రిజర్వేషన్ చేయించుకునేవారికి కొందరికే బెర్తులు అందుబాటులోకి వస్తాయి. మిగతా అందరికీ వెయిటింగ్ లిస్టులో చూపిస్తుంది. అయితే ప్ర‌యాణికుల‌కు ప్రయాణం చేసే రోజుకు బెర్తు దొరుకుతుందిలే అనే నమ్మకంతో వెయిటింగ్ లిస్టు టికెట్లు తీసుకుని రిజర్వేషన్ బోగీలోనే ప్రయాణం చేస్తుంటారు. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ప్ర‌యాణించేవారిని టికెట్ కలెక్టర్ జరిమానా విధించడంతోపాటు వారిని రైలు నుంచి కిందకు దింపే అధికారం ఉంటుంది. మ‌రోవైపు వెయిటింగ్ లిస్టు టికెట్ క‌లిగిన ప్ర‌యాణికులు ఏసీ కోచ్ లో ప్రయాణం చేయొద్ద‌నే నిబంధన కూడా ఉంది. ఇన్ని రోజులు అంతగా ప‌ట్టించుకోని రైల్వే అధికారులు ఇక‌నుంచి ఈ నిబంధ‌న‌ల‌ను కఠినంగా అమలు చేయనున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి భార‌తీయ రైల్వే నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు త...

Railway Budget 2024 | రైల్వేల భ‌ద్ర‌త‌కు భారీగా కేటాయింపులు.. సామాన్య ప్రజల కోసం కీలక నిర్ణయాలు

Business
Railway Budget 2024 | రైలు భద్రతను పెంపొందించడానికి, “కవాచ్” ఆటోమేటిక్ రైలు-రక్షణ వ్యవస్థను అమ‌లు చేయడానికి భారతీయ రైల్వే తన బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించ‌నుంద‌ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మొత్తం రూ.2,62,200 కోట్ల రైల్వే బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో రూ.1,08,795 కోట్లను పూర్తిగా రైల్వే భద్రతా చ‌ర్య‌ల‌కు కేటాయించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో పాత ట్రాక్‌ల భర్తీ, సిగ్నలింగ్ సిస్టమ్ మెరుగుదల, కవాచ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వంటివి ఉన్నాయి. “ఈ కేటాయింపులో పెద్ద భాగం - రూ. 1,08,795 కోట్లు - పాత ట్రాక్‌లను కొత్త వాటితో భర్తీ చేయడం, సిగ్నలింగ్ వ్యవస్థలో మెరుగుదల, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, కవాచ్‌ను ఇన్‌స్టాల్ చేయడం వంటి భద్రతా సంబంధిత కార్యకలాపాలకు కేటాయించ‌నున్న‌ట్లు చెప్పారు. రైల్వే బడ్జెట్ కవాచ్‌కు ప్రాధాన్యం కవాచ్‌కు ఇచ్చి...

Hyderabad | గోపన్‌పల్లి తండా ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధం..

Local
Gopanpally flyover |సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. శనివారం ఉదయం 11 గంటలకు గోపన్‌పల్లి తండా ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.28.50 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌లో రెండు ఎగ్జిట్ ర్యాంప్‌లు ఉన్నాయి. ఒకటి గౌలిదొడ్డి నుంచి నల్లగండ్ల వైపు 430 మీటర్లు, మరొకటి గౌలిదొడ్డి నుంచి తెల్లాపూర్ వైపు 550 మీటర్ల మేర నిర్మించారు. ఇది వన్‌వే ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది. రేడియల్‌ రోడ్డులో భాగంగా హెచ్‌సీయూ బస్టాండ్‌ నుంచి వట్టినాగులపల్లి మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రాకపోకలు సాగించేలా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. జూన్‌లో ఈ నిర్మాణాన్ని ట్రాఫిక్ కోసం తెరవాల్సి ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల కారణంగా జాప్యం జ‌రిగింది. Gopanpally flyover  హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ IT కారిడార్‌లలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను తొల‌గిస్తుంది. ఐటీ ఉద్యోగులతో పాటు, ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లే రహదా...
Exit mobile version