Thursday, June 19Thank you for visiting

Tag: Karnataka

Bengaluru Airport | బెంగళూరులో రూ.1,100 కోట్లతో MRO సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్న ఇండిగో

National
Bengaluru : దేశంలో అతిపెద్ద ప్ర‌యాణికుల‌ విమానయాన సంస్థ ఇండిగో, కర్ణాట‌క‌లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (Bengaluru Airport) లో 31 ఎకరాల్లో రూ. 1,100 కోట్ల పెట్టుబడితో తన నిర్వహణ, మరమ్మత్తు సౌకర్యాన్ని(Maintenance, Repair and Overhaul (MRO)) ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ విష‌య‌మై భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎంబి పాటిల్ మాట్లాడుతూ, “ఎయిర్ ఇండియా, TASL, HAL, ఇప్పుడు ఇండిగో కర్ణాటకలో ఫెసిలిటీల‌ను ఏర్పాటు చేయడంతో, రాష్ట్రం ఆసియాలో విమానయాన ఆవిష్కరణ, తయారీ, నిర్వహణకు ప్రాధాన్యతనిచ్చే గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతూనే ఉంది.” అని అన్నారు. MRO సౌకర్యం నాలుగు వైడ్-బాడీ లేదా ఎనిమిది నారో-బాడీ విమానాలకు సర్వీస్ చేయగల నాలుగు హ్యాంగర్‌లను, ఒక వైడ్-బాడీ లేదా రెండు నారో-బాడీ విమానాలను ఉంచగల ఒక పెయింట్ హ్యాంగర్‌ను కలిగి ఉంటుందని మంత్రి చెప్పారు. ఇది A350 సిరీస్ వంటి వైడ్-బాడీ మోడళ్లకు కూడా స‌...

Freebies Politics | పురుషులను వెంటాడుతున్న ఉచిత ప‌థ‌కాలు.. కొత్త ఛార్జీలతో జేబుల‌కు చిల్లు

National
Freebies Politics | గత కొన్ని సంవత్సరాలుగా ఉచిత ప‌థ‌కాలు రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి. తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ఇలా చాలా రాష్ట్రాల్లో ఎక్కువ‌గా ఉచిత ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయి. రాజకీయ పార్టీలకు ఎన్నికలలో విజయం సాధించడంలో ఇవే సహాయపడ్డాయి. ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్ర‌యాణం, మహిళలు , విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం.. ఇలా రాజకీయ పార్టీలు రాష్ట్ర ఖ‌జానాను ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఏమీ ప‌ట్టించుకోకుండా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఒకదాని తర్వాత మరొకటి ఉచిత‌ పథకాలు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. అయితే, ఈ ఉచిత‌ పథకాల భారం ఖజానాపై ( financial burden) పడుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాలు ఇంత భారీ అదనపు ఆర్థిక భారాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇప్ప‌టికే తెలంగాణ‌, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీవ్ర‌మైన‌ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి...

Atul Subhash suicide case | అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య‌, త‌ల్లి అరెస్టు

Crime
Atul Subhash suicide case | బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. బాధితురాడి భార్య, ఆమె తల్లితోపాటు అత‌డి బావ‌మ‌రిదిని పోలీసులు అరెస్టు చేశారు. నికితను గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, ఆమె తల్లి, సోదరుడిని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) లో అరెస్టు చేశారు, ఆ తర్వాత వారిని బెంగళూరుకు తీసుకువచ్చి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతకుముందు శుక్రవారం.. బెంగళూరు సిటీ పోలీసులు (Bengaluru Police) అతని భార్య నికితా సింఘానియాకు సమన్లు ​​జారీ చేసి మూడు రోజుల్లోగా హాజరు కావాలని కోరారు. సబ్-ఇన్‌స్పెక్టర్ సంజీత్ కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బెంగళూరు సిటీ పోలీస్ బృందం ఈ ఉత్తరప్రదేశ్ జిల్లాలోని ఖోవా మండి ప్రాంతంలోని సింఘానియా నివాసానికి ఉదయం 11 గంటలకు చేరుకుంది. ఆమె సమన్ల కోసం నోటీసును అతికించారు. సర్కిల్ ఆఫీసర్ (సిటీ)...

SM Krishna: సిలికాన్ సిటీ బెంగళూరును తీర్చిదిద్దడంలో ఎస్ఎం కృష్ణ తెర వెనుక ఏంచేశారు?

National
Bengaluru | రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో విశేష సేవలందించిన సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ (SM Krishna) ఈరోజు ఉదయం సదాశివనగర్ నివాసంలో కన్నుమూశారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన కృష్ణ.. ఆధునిక బెంగళూరును ప్రపంచ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. తన పదవీకాలంలో, SM కృష్ణ బెంగళూరు అభివృద్ధికి ఎక్క‌వ‌గా ప్రాధాన్యతనిచ్చారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. అతని ప్రయత్నాల వల్లే బెంగళూరు "సిలికాన్ సిటీ(Silicon City)గా అవ‌త‌రించింది అలాగే కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ(Silicon valley)కి బలమైన ప్రత్యామ్నాయంగా మారింది, IT రంగంలో యువ నిపుణులకు వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించింది. టాస్క్ ఫోర్స్ (BATF) బెంగ‌ళూరు నగరం గ్లోబల్ సిటీగా పెంపొందించడానికి ఎస్ఎం కృష్ణ అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. 1999లో, ఆ...

MUDA Scam | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్‌ షాక్‌

National
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA Scam) స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది. ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు బహుమతిగా ఇచ్చారని ఎఫ్‌ఐఆర్‌‌లో పేర్కొంది. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా.. సెంట్రల్‌ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. దీంతో నిందితుల విచారణ సమయంలో వారి ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు ఈడీ (Enforcement Directorate) కి అధికారం దక్కినట్లయ్యింది. ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోప...

ట్రాఫిక్ లో చిక్కుకున్న ఎక్స్ ప్రెస్ రైలు ?.. వీడియో వైర‌ల్‌..

Viral
Bengaluru traffic jam | కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో ఎన్న‌డూ ఊహించ‌ని విచిత్ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. సాధార‌ణంగా వాహనాల ట్రాఫిక్‌తో మ‌హాన‌గ‌రాల్లో రోడ్ల‌న్నీ కిక్కిరిసిపోయిన గంట‌ల త‌ర‌బ‌డి రోడ్ల‌పైనే వేచి ఉండాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తుతుంటాయి. ట్రాఫిక్ చిక్కుల‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల్లో బెంగళూరు సిటీది దేశంలోనే ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇక్కడ మ‌న గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవ‌డానికి గంట‌ల పాటు స‌మ‌యం ప‌డుతుంది. అయితే తాజాగా నగర రోడ్లపై నడిచే వాహనాలకే కాదు.. పట్టాలపై న‌డిచే రైళ్లు కూడా బెంగ‌ళూరులో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి త‌ప్పించుకోలేదు. ఇప్పటి వరకూ ట్రాఫిక్‌లో బస్సులు, కార్లు, బైకులు తదితర వాహనాలు మాత్రమే చిక్కుకుపోయేవి. కానీ ఇప్పుడు ఆ లిస్టులో ట్రైయిన్ కూడా వచ్చి చేరింది. బెంగ‌ళూరు నగరంలో ఒక‌ రైల్వే క్రాసింగ్‌ గేట్‌ వద్ద పలు వాహనాలు ముందు క‌దులుతుండ‌గా.. కొద్ది దూరంలో ఓ రైలు...

Mallikarjun Kharge | రాహుల్ గాంధీని బ‌హిష్క‌రిచ‌కుంటే.. ఖర్గే కూడా గాంధీకుటుంబానికి కీలుబొమ్మే.. : బీజేపీ

National
Mallikarjun Kharge : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత సి.నారాయణ స్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. శనివారం (సెప్టెంబర్ 14, 2024) రాహుల్ గాంధీని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించకపోతే గాంధీ కుటుంబానికి ఖ‌ర్గే కాపలాదారు అని రుజువవుతుందని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ చీఫ్‌పై సి నారాయణ స్వామి చేసిన ఈ వ్యాఖ్య రాహుల్ గాంధీని కార్నర్ చేసే విధంగా ఉన్నాయి. ఇటీవ‌ల అమెరికాలో రాహుల్‌ చేసిన వివాదాస్పద ప్రకటనలపై బీజెపి నేత‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయ‌న‌ మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ ప్రకటనతో మాకు కోపం వచ్చింది. కొన్నిసార్లు అతను భీమ్‌రావ్ అంబేద్కర్‌ను ద్వేషిస్తాడు. కొన్నిసార్లు అతను రాజ్యాంగంతో తిరుగుతాడు. . రిజర్వేషన్లను ఎలా అంతం చేస్తారు? "రాహుల్ గాంధీ అప్పుడప్పుడు రిజర్వేషన్‌ను అంతం చేస్తానని చెబుతారు. మీరు రిజర్వేష...

Ovitrap Baskets | ఓవిట్రాప్ బాస్కెట్స్ అంటే ఏమిటి? ఇవి డెంగ్యూ దోమలను ఎలా నియంత్రిస్తాయి.?

Special Stories
Ovitrap Baskets  | కర్ణాటకలో దాదాపు 24,028 డెంగ్యూ కేసులు (dengue) న‌మోదు కాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవ‌ల ఒక కొత్త పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అదే దోమలను ఆకర్షించే ఓవిట్రాప్ బాస్కెట్స్‌.. గాంధీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గోపాలపురలో ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వీటిని ప్రారంభించారు. "పర్యవేక్షణ కోసం ఉపయోగించే ఓవిట్రాప్స్, ఏడెస్ దోమల జనాభాను గుర్తించగలవు, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తాయి. ఈ బుట్టలను ఇళ్లకు 20 అడుగుల దూరంలో అమర్చారు. లోపల స్ప్రే చేసిన రసాయనం దోమలను ఆకర్షిస్తుంది, వాటిని బుట్టలోకి రప్పిస్తుంది. ఈ వినూత్న ప్రయోగం డెంగ్యూ దోమల నివారణకు మరింత దోహదపడుతుందని ఎక్స్‌లో దినేష్ గుండూరావు అన్నారు. Our @DHFWKA health department has initiated a new pilot pr...

Mallikarjun Kharge | చిక్కుల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే..

National
Mallikarjun Kharge : ముడా స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయారు. ఈ వ్య‌వ‌హారం కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెడుతుండ‌గా మ‌రో వివాదం అక్క‌డి హ‌స్తం పార్టీకి కొత్త త‌ల‌నొప్పిని తెచ్చిపెడుతోంది. బెంగళూర్‌కు సమీపంలోని ఓ ఏరోస్పేస్‌ పార్క్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ఓ ట్రస్ట్‌కు ఏకంగా 5 ఎకరాల భూ కేటాయింపునకు ఆమోదం లభించడం దుమారం రేపుతున్న‌ది. ఖర్గే కుమారుడు రాహుల్‌ ఈ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉన్నారు. ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్ కు కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు (KIADB) భూ కేటాయించ‌డం అధికార దుర్వినియోగమని, కర్ణాటక ప్ర‌భుత్వం బంధుప్రీతికి సంకేతమని బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాల్వీయ ఎక్స్ వేదిక‌గా ఆరోప‌ణ‌లు చేశారు. ఈ వివాదంపై మ‌ల్లికార్జున‌ ఖర్గే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు ఎకరాల భూమిని ఎస్సీ కోటా కింద సిద్ధా...

Bengaluru Metro Phase 3 | బెంగళూరు మెట్రో ఫేజ్-3: భూసేకరణ ప్రణాళిక సిద్ధం.. 2028కి పూర్తి

National
Bengaluru Metro Phase 3 | బెంగుళూరు నమ్మ మెట్రో తన నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఆరెంజ్ లైన్ అని కూడా పిలిచే తన ప్రతిష్టాత్మకమైన ఫేజ్ 3 ప్రాజెక్ట్ కోసం భూసేకరణ దాదాపుగా పూర్తికావ‌చ్చింది. రెండు ప్రధాన కారిడార్లతో 44.65 కి.మీ విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ నగరంలో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. బెంగళూరు మెట్రో రూ.15,611 కోట్ల ఫేజ్-3 ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది. మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్-3 లో రెండు ఎలివేటెడ్ కారిడార్లతో మొత్తం 31 మెట్రో స్టేషన్లతో 44.65 కి.మీ మేర విస్త‌రించ‌నున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం వేచి ఉంది. మొదటి కారిడార్, ఔటర్ రింగ్ రోడ్డుకు పశ్చిమ వైపున 32.15 కి.మీ.కు పైగా విస్తరించి, JP నగర్ నాల్గవ దశను కెంపపురాని...
Exit mobile version