Wednesday, June 18Thank you for visiting

Tag: Jharkhand

జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్.. NDA లేదా INDI? ఎవరు గెలుస్తారు..?

Elections
Jharkhand Election Result 2024: జార్ఖండ్ లో అధికారంలోకి వచ్చేది బీజేపీ నేతృత్వంలోని NDA ? లేదా JMM నేతృత్వంలోని INDI కూటమా అనేది మ‌రికొన్ని గంట‌ల్లోనే తేలిపోనుంది. శనివారం కీలకమైన "బ్యాలెట్ల యుద్ధం" కోసం వేదిక సిద్ధమైంది . పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ట్రెండ్‌లు, ఫలితాలు ఉదయం 9 గంటలకు ఒక అంచనాకు వ‌స్తాయి. ఈ ఎన్నికలలో రికార్డు స్థాయిలో 67.74% ఓటింగ్ నమోదైంది, నవంబర్ 15, 2000న జార్ఖండ్ ఏర్పడినప్పటి నుంచి అత్యధికంగా ఈ కీలక పోటీలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది. "నవంబర్ 23న కౌంటింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విడివిడిగా పరిశీలకులను నియమించారు. పోస్టల్ బ్యాలెట్ల నిష్పక్షపాతంగా లెక్కించడానికి ప్రతి టేబుల్‌కు ARO ఉంటారు. అని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్...

‘ఖర్గే గారూ..  నా మీద కాదు.. మీ అమ్మానాన్నలను చంపిన హైదరాబాద్ నిజాం మీద కోపం తెచ్చుకోండి…’ 

Elections
Maharashtra Election : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనవసరంగా నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఖర్గే జీ, నా మీద కోపం తెచ్చుకోకండి, నేను మీ వయసును గౌరవిస్తాను. మీరు అగ్రహం వ్యక్తంచేయాలనుకుంటే ముందుగా హైదరాబాద్ నిజాంపై చేయండి అని సీఎం యోగి అన్నారు. మీ గ్రామాన్ని తగలబెట్టి హిందువులను నిర్దాక్షిణ్యంగా చంపిన హైదరాబాద్ నిజాం రజాకార్లు. మీ పూజ్యమైన తల్లి, సోదరి, మీ కుటుంబ సభ్యులను తగులబెట్టారు. ప్రజలు విడిపోయినప్పుడల్లా వారిని ఇలాగే చంపుతారు అనే ఈ సత్యాన్ని దేశ ప్రజలకు చెప్పండి అని కోరారు.  ఓటు బ్యాంకు కోసం ఈ సత్యాన్ని ప్రజలకు చెప్పడం లేదన్నారు. మీరు దేశానికి ద్రోహం చేస్తున్నారు. నేను...

Jharkhand Election | కుల గ‌ణ‌న‌పై యూపీ సీఎం సంచ‌న‌ల వ్యాఖ్య‌లు..

Elections
Jharkhand Election | భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం హజారీబాగ్ చేరుకున్నారు. బర్కాగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి ప్రసంగిస్తూ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బర్కాగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశించి సీఎం యోగి మాట్లాడుతూ కులాలవారీగా విడిపోవద్దని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాళ్లు రువ్వేవారిని శక్తిమంతులుగా మార్చవ‌ద్ద‌ని హితువు ప‌లికారు. అంద‌రూ ఐక్యంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి, మీరు ఎప్పుడైతే కులం పేరుతో విడిపోతారో.. మీరు ప‌త‌నానికి నాంది ప‌లుకుతార‌ని హెచ్చ‌రించారు. అదే జ‌రిగితే.. ఇళ్ల‌లో గంట‌లు మోగించ‌లేం.. విభజన జరిగితే భవిష్యత్తులో తమ ఇళ్లలో గంటలు, శంఖాలు మోగించలేమని బర్కాగావ్ అసెంబ్లీ ప్రజలకు ...

Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నికలు.. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. వివరాలు

Elections
Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌, జేఎంఎం కూట‌మి సీట్ల పంప‌కాలు ఖ‌రార‌య్యాయి. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని JMM 43 స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా కాంగ్రెస్ 30 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించనుంది. రాష్ట్రీయ జనతాదళ్ ఆరు స్థానాల్లో పోటీ చేయనుండగా, వామపక్షాలు మూడు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే మూడు జార్ఖండ్ నియోజకవర్గాల్లో "స్నేహపూర్వక పోరు" జరిగే అవకాశం ఉందని బ్లాక్ నాయకులు సూచించారు. ఇప్పటికే ధన్వర్‌లో జేఎంఎం, సీపీఐ-ఎంఎల్‌లు ఘర్షణకు దిగాయి. మరోవైపు ఛత్తర్‌పూర్‌, బిష్రాంపూర్‌ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్‌, ఆర్‌జేడీలు ఇదే తరహాలో సందిగ్ధం నెల‌కొన‌గా స‌యోద్య‌కు ప్రయత్నిస్తున్నాయి. "JMM, కాంగ్రెస్, RJD మరియు CPI-ML సంయుక్తంగా జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ కింద పోటీ చేస్తున్నాయి. కూటమిలోని అన్ని నియోజకవర్గాలకు - ఛతర్‌పూర్, బిష్రాంపూర్, ధన్వర్ మినహ...

Jharkhand elections : జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ 68 స్థానాల్లో పోటీ.. జాబితా ఇదే..

Elections
Jharkhand elections : భారతీయ జనతా పార్టీ (బిజెపి) శనివారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ 66 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది. ధన్వర్‌ నుంచి రాష్ట్ర చీఫ్‌ బాబూలాల్‌ మరాండీ, బోరియో నుంచి లోబిన్‌ హెంబ్రోమ్‌, జమ్‌తారా నుంచి సీతా సోరెన్‌, సరైకెల్లా నుంచి జార్ఖండ్‌ మాజీ సీఎం చంపై సోరెన్‌, చైబాసా నుంచి గీతా బల్ముచు, జగన్నాథ్‌పూర్ నుంచి గీతా కోడా, పొట్కా నుంచి మీరా ముండా తదితరులను పార్టీ బరిలోకి దించింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాన్ని ప్రకటించిన ఒక రోజు తర్వాత బిజెపి మొదటి జాబితాను వెలువ‌రించింది. Jharkhand elections బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఎన్డీయే మిత్రపక్షాలు ఏజేఎస్‌యూ 10 స్థానాల్లో, జేడీ(యూ) రెండు స్థానాల్లో, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) ఒక స్థానంలో పోటీ చేయనున్నాయి. కాగా 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవ...

Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!

Elections
Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నిక‌ల్లో అధికార జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. దీనిపై ఆ రాష్ట్ర ఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శనివారం మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమితో కలిసి పోటీ చేస్తామ‌ని, మొత్తం 81 స్థానాలకు గానూ 70 స్థానాల్లో కాంగ్రెస్‌, జేఎంఎం అభ్యర్థులను నిలబెడతాయన్నారు. మిగిలిన 11 సీట్ల కోసం కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. హేమంత్ సోరెన్, కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ క‌లిసి మీడియా స‌మావేశంలో ఈ విష‌యాన్ని ప్రకటించారు. అయితే రాష్ట్రీయ జనతాదళ్‌కు ఎన్ని సీట్లు ఇస్తారు. లెఫ్ట్ ఫ్రంట్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో హేమంత్ సోరెన్ పేర్కొనలేదు. కాగా జార్ఖండ్ లో నవంబర్ 13, 20వ‌ తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. "జార్...

Jharkhand | బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి..

National
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ (Champai Soren).. తన పార్టీ ప్రస్తుత పనితీరుపై అసంతృప్తితో తనకు ఎదురైన "చేదు అవమానం" కారణంగా  JMM పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. తాజాగా ఆయన బీజేపీలో చేరారు. ఇక్కడ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్,  అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హాజరైన వేడుకలో సోరెన్ తన మద్దతుదారులతో పాటు పెద్ద సంఖ్యలో కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలోకి చేరిన తర్వాత చంపాయ్ సోరెన్ భావోద్వేగానికి లోనయ్యారు. "ఢిల్లీ,  కోల్‌కతాలో జార్ఖండ్ ప్రభుత్వం తనపై నిఘా ఉంచిన తర్వాత, బిజెపిలో చేరాలనే నా సంకల్పం బలపడింది" అని ఆయన అన్నారు. గిరిజనుల ప్రగతిని కాంగ్రెస్ పణంగా పెట్టిందని ఆరోపించిన సోరెన్, "ప్రజలకు న్యాయం చేసేందుకు తానుకట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. "నేను నా చెమట, రక్తంతో JMM ను పోషించాను, కానీ ఎన్నో అవమానాలకు గురయ్యాను. అందుకే నేను బిజెపిలో చ...

Howrah-CSMT Express : ప‌లు రైళ్లు రద్దు.. మరికొన్ని రైళ్లు దారి మ‌ళ్లింపు పూర్తి జాబితా ఇదే..

తాజా వార్తలు
Howrah-CSMT Express  | జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ సమీపంలో మంగళవారం (జూలై 30) తెల్లవారుజామున హౌరా-CSMT ఎక్స్‌ప్రెస్ 18 కోచ్‌లు పట్టాలు తప్పడంతో అనేక రైళ్లు మళ్లించాల్సి వ‌చ్చింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు. హౌరా నుంచి ముంబైకి వెళ్తున్న ఈ రైలు ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్‌ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3.45 గంటలకు పట్టాలు తప్పింది. రద్దు అయిన‌ రైళ్ల జాబితా: 22861 హౌరా-కాంతబాజీ ఎక్స్‌ప్రెస్ 08015/18019 ఖరగ్‌పూర్-ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ 12021/12022 హౌరా-బార్బిల్ ఎక్స్‌ప్రెస్ షార్ట్ టర్మినేట్ చేసిన రైళ్లు.. 18114 బిలాస్‌పూర్-టాటా ఎక్స్‌ప్రెస్ రూర్కెలాలో దారిమ‌ళ్లింపు 18190 ఎర్నాకులం-టాటా ఎక్స్‌ప్రెస్‌ను చక్రధర్‌పూర్ వ‌ర‌కు ప‌రిమితం చేశారు. 18011 హౌరా-చక్రధర్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగ్రా వ‌ర‌కు ప‌రిమితం. హెల...

ED raids in Jharkhand : మంత్రి స‌హాయ‌కుడి ఇంట్లో ప‌ట్టుబ‌డిన నోట్ల గుట్ట‌లు..

Crime, National
ED raids in Jharkhand | జార్ఖండ్‌ రాజధాని రాంచీ (Ranchi)లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) అధికారులు సోమవారం అక‌స్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని సుమారు రూ.25 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ (Jharkhand) గ్రామీణాభివృద్ధి శాఖలో (Jharkhand Rural Development) ప‌లు పథకాల అమలులో అక్ర‌మాలు జ‌రిగాయి. ఈ వ్య‌వ‌హారంపై మనీ లాండరింగ్ కేసు నమోదు అయింది. ఈ వ్యవహారంలో గత సంవ‌త్స‌రం ఫిబ్రవరిలో గ్రామీనాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సోమ‌వారం రాంచీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఒకేసారి వరుసగా దాడులు చేశారు. ఈ దాడుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం (Alamgir Alam) వ్యక్తిగత సహాయకుడైన‌ సంజీవ్ లాల్ ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు బయటపడింది. పట్ట...

Jharkhand Police | లంచం రూపంలో రోడ్డుపై విసిరిన కరెన్సీ నోట్లు.. ఏరుకున్న పోలీసులు సస్పెండ్‌

Viral
Police suspended | లంచం రూపంలో రోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు ఏరుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బాధ్యులైన నలుగురు పోలీసులను సస్పెండ్‌ చేశారు. రాంచీ: లంచంగా నడిరోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు (Jharkhand Police) ఏరుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కాగా ఈ వీడియో పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బాధ్యులైన ఆ నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి బైక్‌పై అక్రమంగా బొగ్గు రవాణా చేస్తున్నాడు.. పోలీసులు అతడిని ఆపేందుకు యత్నించగా లంచంగా కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరేసి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే ఏఎస్‌ఐతో సహా నలుగురు పోలీసులు రోడ్డుపై పడిన ఆ నోట్ల...
Exit mobile version