Triple Talaq | కదులుతున్న రైలులో ట్రిపుల్ తలాక్.. ఆ తర్వాత ఏమైంది.. ?
లక్నో: ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి కదులుతున్న రైలులో తన భార్యకు ట్రిపుల్ తలాక్ (Triple Talaq) చెప్పాడు. రైల్వే స్టేషన్లో రైలు నిలవగానే భార్యపై దాడి చేసి పరారయ్యాడు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. 28 ఏళ్ల మహ్మద్ అర్షద్.. మధ్యప్రదేశ్ భోపాల్లో ఒక ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. కాగా మ్యాట్రిమోనియల్ ప్రకటన ద్వారా కోటాకు చెందిన 26 ఏళ్ల అఫ్సానాతో పరిచమయ్యింది. వీరిద్దరూ ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకున్నారు.
కాగా, గత వారం ఉత్తరప్రదేశ్లోని పుఖ్రాయన్ లో అర్షద్ బంధువుల ఇంటికి అర్షద్ అఫ్సానా వెళ్లారు. ఈ సందర్భంగా అర్షద్కు అప్పటికే వివాహమైనట్లు అఫ్సానా తెలుసుకుని షాక్ అయింది. దీంతో వెంటనే అతడిని నిలదీయగా అర్షద్, అతడి తల్లి కలిసి అఫ్సానాపై దాడికి దిగారు. ఆపై వరకట్నం కోసం అఫ్సా...