కశ్మీర్లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Z-Morh tunnel : సోనామార్గ్, లడఖ్ మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీ కోసం 6.5 కిలోమీటర్ల Z-మోర్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ₹2,400 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఇది రెండు గంటల ప్రయాణ సమయాన్ని 15 నిమిషాలకు తగ్గిస్తుంది.. ఈ ప్రాంతంలో పర్యాటకంతోపాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుంది.
జనవరి 13, 2025న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జమ్మూ కాశ్మీర్లో Z-మోర్హ్ టన్నెల్ను ప్రారంభించారు, ఇది శ్రీనగర్ నుంచి లడఖ్ వ్యూహాత్మక ప్రాంతం మధ్య ఆల్-వెదర్ కనెక్టివిటీని మెరుగుపరచడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.
Z-Morh వ్యూహాత్మక ప్రాముఖ్యత
6.5 -కిలోమీటర్ల పొడవుతో Z-మోర్ టన్నెల్ శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సుమారు 8,652 అడుగుల ఎత్తులో ఉంది. ఇది గగాంగీర్, ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన సోనామార్గ్ను కలుపుతుంది, హిమపాతం సంభవించే ప్రాంతాలను తప్పిస్తుంది. ప్రయాణ సమయాన్ని రెండు ...