Tuesday, March 4Thank you for visiting

Tag: Jama Masjid

Sambhal Case : షాహీ జామా మసీదు కేసుపై అలహాబాద్ హైకోర్టులో నేడు విచారణ

Trending News
Sambhal Case : సంభాల్‌లోని షాహి జామా మసీదుకు సంబంధించిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) మంగళవారం విచారించనుంది. దేశ వాప్తంగా అంద‌రి దృష్టిని ఆకర్షించిన ఈ కేసును జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం ఉదయం 10 గంటలకు విచారించనుంది. కొన్ని నెల‌లుగా తీవ్ర చర్చకు దారితీసిన సంభాల్ మ‌సీదు (Jama Masjid) ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి అనుమతి కోరుతూ మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు జరిగే విచారణ సందర్భంగా, భారత పురావస్తు సర్వే (ASI) బృందం మసీదు పరిశుభ్రతపై నివేదికను సమర్పిస్తుంది. మసీదును పరిశీలించి దాని పరిశుభ్రతను నిర్ధారించాలని కోర్టు గతంలో ASIని ఆదేశించింది. ASI నివేదికకు ప్రతిస్పందనగా మసీదు కమిటీ ప్రతినిధులు సమాధాన‌విమ‌వ్వ‌నున్నారు. మసీదు నిర్వహణ కమిటీ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా, శుక్రవారం కోర్టు (Allahabad High Court) షాహి జామా మసీదు ప్రాంగణాన్...

Sambhal Violence : సంభాల్ హింసాకాండ కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్టు

Trending News
Sambhal Violence : ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదులో సర్వే సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 24 న జరిగిన హింసలో అరెస్టు చేసిన నిందితులిద్దరి ప్రమేయం ఉంద‌ని గుర్తించారు. సంభాల్ హింసాకాండ కేసులో ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతానికి చెందిన నిందితుడు సలీంను పోలీసులు అరెస్టు చేశారు. హింస తర్వాత, అతను ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. లొంగిపోయేందుకు ప్రయత్నించాడు. అంతకుముందే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 24న హింసాకాండ జరిగిన రోజు సంభాల్ సహ అనూజ్ చౌదరిపై కాల్పులు జరిపినట్లు సలీంపై ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో అరెస్టయిన ప్రధాన నిందితుల్లో ఒకరైన సలీంపై కూడా గ‌తంలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతనిపై హత్యాయత్నం, దోపిడీ, గోహత్య సహా 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నిందితుల నుంచ...

Delhi Jama Masjid | ఢిల్లీ జామా మ‌సీదును కూడా స‌ర్వే చేయాలి..

Trending News
Delhi Jama Masjid : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ సంభాల్‌ (Sambhal)లోని జామా మసీదును హరిహర‌ దేవాలయంగా, రాజస్థాన్‌లోని అజ్మీర్‌ (Ajmer Sharif Dargah) లోని సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లా అలైహ్ దర్గాను శివాలయంగా పేర్కొంటూ కోర్టుల‌లో పిటిష‌న్లు వేసిన విష‌యం తెలిసిందే.. అయితే తాజ‌గా హిందూ సేన ఢిల్లీలోని జామా మసీదుపై కూడా పిటిష‌న్ వేశారు. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా స్పందిస్తూ.. జామా మసీదును సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ భారత పురావస్తు శాఖ (ASI) జనరల్‌కు లేఖ రాశారు. జామా మసీదు మెట్లపై కృష్ణుడి ఆలయ విగ్రహాల అవశేషాలు ఉన్నాయని హిందూ సేన‌ పేర్కొంది. ఔరంగజేబ్ నామా, సాకీ ముస్తాక్ ఖాన్ ఔరంగజేబుపై రాసిన 'మసీర్-ఎ-ఆలమ్‌గిరి' పుస్తకంలో తమ రుజువు రాసి ఉంద‌ని తెలిపింది. హిందూ సేన ఢిల్లీలోని జామా మసీదును సర్వే చేసి, ఆ విగ్రహాలను బయటకు తీసి ఆలయాల్లో తిరిగి ప్రతిష్ఠించాలని కోరుతోంది. దీంతో ...
Exit mobile version