భారతదేశం శాంతి స్థాపన కోసం రోడ్మ్యాప్ని కలిగి ఉంది : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
జార్ఖండ్: కోవిడ్ -19 మహమ్మారి తర్వాత, భారతదేశం శాంతి స్థాపనకు పటిష్టమైన రోడ్మ్యాప్ని కలిగి ఉందని, దీనిని ప్రపంచం కూడా నమ్ముతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) స్పష్టం చేశారు. 'సనాతన ధర్మం' మానవజాతి సంక్షేమాన్ని విశ్వసిస్తుందని ఆయన పేర్కొన్నారు. వికాస్ భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
"సనాతన సంస్కృతి, ధర్మం రాజభవనాల నుంచి వచ్చింది కాదు. ఆశ్రమాలు, అడవుల నుండి వచ్చింది, మారుతున్న కాలంతో, మన బట్టలు మారవచ్చు, కానీ మన స్వభావం ఎప్పటికీ మారదు" అని RSS అధినేత అన్నారు. మారుతున్న కాలంలో మన పని, సేవలను కొనసాగించాలంటే కొత్త కొత్త పద్ధతులను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని, స్వభావాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకునేరు అభివృద్ధి చెందుతారని తెలిపారు.
సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ అవిశ్రాంతంగా కృషి చే...