Thursday, March 6Thank you for visiting

Tag: india-news

Muslims reservations | నేను ముస్లిం వ్యతిరేకిని కాదు.. ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Elections, National
Lok Sabha Elections : తాను ఇస్లాం మతాన్ని లేదా ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్ప‌ష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేసేట‌పుడు ప్ర‌తీఒక్క‌రూ వారి భవిష్యత్తు, ఎదుగుదల గురించి స‌మాజం గురించి ఆలోచించాలని ఆయ‌న పిలుపునిచ్చారు. టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికల ప్రయోజనాల కోసం ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ప్రతిపక్షాలు మోదీతోపాటు బీజేపీ (BJP)పై ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. ఇటీవలి ప్రసంగంలో మోడీ ‘ఎక్కువ మంది పిల్లలు’ ‘చొరబాటుదారులు’ అనే ప‌దాల‌ను వాడ‌డంతో ఆయ‌న‌పై ఇండి కూట‌మి నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ఆరోపణలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వారు నెహ్రూ కాలం నుంచి ఈ కథనాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ వండి వార్చుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని ముస్లిం వ్యతిరేకులుగా దూషిస్తూనే ఉన్నారు. రెండవది వారు ముస్లింల స్నేహితులమని చెప్పుకుంటారు. ద...

తెలంగాణలో రూ.21,566 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Telangana
అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి రూ.21,566 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో అక్టోబర్‌ 1, 3 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రూ.21,566 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (G.Kirshan Reddy) శుక్రవారం తెలిపారు. తన మహబూబ్‌నగర్ పర్యటనలో మోదీ రూ.13,545 కోట్లతో ప్రాజెక్టులను ప్రారంభిస్తారని, నిజామాబాద్‌లో రూ.8,021 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తానని విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ (PM Modi) రెండు చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ...

పాక్ నుంచి దేశ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం

National
మాదక ద్రవ్యాలు, ఆయుదాల సరఫరానే లక్ష్యం 'సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాం.. : BSF పాకిస్తాన్ వైపు నుంచి దేశంలోని డ్రోన్లు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. వక్రమార్గంలో దేశంలోకి మాదకద్రవ్యాలు, ఆయుధాలను చేరవేర్చి ఇక్కడి యువతను నిర్వీర్యం చేసేందుకు తన కుటిల యత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే ఈ ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని BSF అసిస్టెంట్ కమాండెంట్ గౌరవ్ శర్మ బుధవారం విలేకరులకు తెలిపారు. "మేము మా BSF సైనికులకు డ్రోన్‌ల గురించిన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాము. ఏదైనా రకం హమ్మింగ్ సౌండ్ కనిపిస్తే సైనికులు వెంటనే అధికారులకు తెలియజేస్తారు. BSF అధికారులు పోలీసు అధికారులతో పాటు తదుపరి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ప్రాంతాన్ని పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకొని డ్రోన్లను కూల్చివేస్తారు" అని శర్మ చెప్పారు. "ఇది చాలా సవాలుతో కూడుకున్న పని, ఎందుకంటే డ్రోన్‌ల హై టెక్నాలజీని ఉపయోగించి పాకిస్...
Exit mobile version