Shimla Masjid controversy | అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలో హిందూ సంస్థల భారీ నిరసన.. లాఠీచార్జి
Shimla Masjid controversy latest updates : హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో వివాదాస్పద మసీదు వద్ద తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు గుమిగూడి మసీదు వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వేసిన బారికేడ్లను సైతం బద్దలు కొట్టారు. దీంతో నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఈ విషయంపై హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఒక ప్రకటన జారీ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే రాష్ట్ర శాంతికి విఘాతం కలిగించే పరిస్థితి రాకూడదని అన్నారు. ఈ వ్యవహారంలో న్యాయం చేసేందుకు కోర్టులో ఉందని, అక్రమ నిర్మాణమని తేలితే చట్టపరంగా కూల్చివేస్తామని చెప్పారు.
ఇదిలావుండగా.. ఇది మసీదు వివాదం కాదని, అక్రమ నిర్మాణానికి సంబంధించిన సమస్య ...